HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > World
  • >Clashes With China In The Future Shocking Report

China: భవిష్యత్తులో చైనాతో ఘర్షణలు.. షాకిస్తున్న నివేదిక!

భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా..

  • By Anshu Published Date - 09:38 PM, Fri - 27 January 23
  • daily-hunt
97375396
97375396

China: భారత్ కు పక్కలో బల్లెంలా తయారైన చైనా.. అంతకంతకు భారత్ ను కవ్విస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో వ్యూహాత్మకంగా బలపడుతున్న చైనా.. ఇప్పటికే భారత్ గస్తీ పాయింట్లను హస్తగతం చేసుకుంది. తాజాగా భారత్, చైనాల మధ్య పరిస్థితి గురించి వచ్చిన ఓ నివేదిక షాకింగ్ విషయాలను వెల్లడిస్తోంది. భారత్, చైనాల మధ్య రానున్న రోజుల్లో మరిన్ని ఘర్షణలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నట్లు ఆ నివేదిక చెబుతోంది.

డీజీపీల సదస్సులో సమర్పించిన నివేదికలో ఆందోళనకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా చైనా స్థావరాలు పెంచుకుంటూ వస్తోందని.. ఈ నేపథ్యంలోనే భారత్-చైనా దళాల మధ్య మరిన్ని ఘర్షణలు జరుగొచ్చు అని నివేదికలో తేల్చడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నివేదికను విశ్లేషిస్తు ఓ అంతర్జాతీయ వార్త సంస్థ కథనాన్ని ప్రచురించింది.

‘ఈ ప్రాంతంలో తమ ఆర్థిక ప్రయోజనాల దృష్ట్యా చైనా సైన్యం (పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) మౌళిక సదుపాయాలను ముమ్మరంగా చేపడుతోంది కొన్నేళ్లుగా జరిగిన ఘర్షణలు, ఉద్రిక్తతలను విశ్లేషిస్తే.. 2013-14 తర్వత ప్రతి రెండు, మూడేళ్లకు వీటి తీవ్రత మరింత పెరిగింది. ఇలా ఇరు దేశాల సైనిక శక్తుల మధ్య ఘర్షణలు తరుచూ చోటుచేసుకుంటున్నాయి’ అని నివేదికలో పేర్కొనడం జరిగింది.

భారత్-చైనాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు, సరిహద్దు భద్రతా దళాల నుంచి నిఘా సంస్థలు సేకరించిన సమాచారం ఆధారంగా ఈ నివేదికను రూపొందించడం జరిగింది. చైనా అవలంభిస్తున్న సరిహద్దు వ్యూహం ఫలిస్తోందని, అందులో భాగంగానే సరిహద్దు రేఖ వెంబడి దళాలను, స్థావరాలను చైనా పెంచుకుంటూ వస్తోందని నివేదిక తెలిపింది. దీని వల్లే లద్దాఖ్ లో చాలా గస్తీ పాయింట్లను భారత్ కోల్పోయిందని వివరించింది. కాగా 2020లో తూర్పు లద్దాఖ్ లో జరిగిన ఘర్షణల్లో 24 మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోవడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • China Clashes
  • Chinawar

Related News

    Latest News

    • Sajjala Bhargav Reddy : భార్గవ రెడ్డికి కీలక పదవి అప్పగించిన జగన్

    • SLBC : ఉత్తమ్ కుమార్ సలహాలతో ముందుకు వెళ్తాము – సీఎం రేవంత్

    • Sree Charani: శ్రీ చరణికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్

    • Domestic Violence : అక్రమ సంబంధం తెలిసిపోయిందని కట్టుకున్న భర్తను కడతేర్చిన భార్య

    • New Rules : ఏపీ ప్రజలు తప్పక తెలుసుకోవాల్సిన రూల్స్..లేదంటే పథకాలు కట్

    Trending News

      • U-19 One-Day Challenger Trophy: టీమిండియాలోకి మాజీ కోచ్ కొడుకు.. ఎవ‌రో తెలుసా?

      • Kartik Purnima: రేపే కార్తీక పౌర్ణ‌మి.. ఏ రాశి వారు ఎలాంటి వ‌స్తువులు దానం చేయాలో తెలుసా?

      • India Post Payments Bank: ఇక‌పై ఇంటి నుండే ఆ సర్టిఫికేట్ పొందవచ్చు!

      • Rs 2,000 Notes: మ‌రోసారి చ‌ర్చ‌నీయాంశంగా రూ. 2 వేల నోట్లు!?

      • Net Worth: భార‌త్‌, సౌతాఫ్రికా జ‌ట్ల కెప్టెన్ల సంపాద‌న ఎంతో తెలుసా?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd