Brazil: బ్రెజిల్ లో విషాదం.. 36 మంది దుర్మరణం…
బ్రెజిల్ను (Brazil) భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు.
- By Gopichand Published Date - 01:40 PM, Mon - 20 February 23
బ్రెజిల్ను (Brazil) భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. వరదలు, కొండచరియలు విరిగిపడి 36 మంది దుర్మరణం పాలయ్యారు. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు పేర్కొన్నారు. ఉత్తర సావో పాలో రాష్ట్రంలోని పలు నగరాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. రంగంలోకి దిగిన సైన్యం 2 విమానాలతో వరద ప్రభావిత ప్రాంతాలకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించాయి.బ్రెజిల్లోని అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రమైన సావో పాలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో తీవ్రంగా దెబ్బతిన్నది.
వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఉత్తరాది రాష్ట్రమైన సావోపోలోలోని పలు నగరాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యాయని బ్రెజిల్ అధికారులు ఆదివారం తెలిపారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇప్పటి వరకు 36 మంది మరణించారని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. సావో పాలో, సావో సెబాస్టియో, బెర్టియోగా అనే నగరాలు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. శిథిలాలలో తప్పిపోయిన, గాయపడిన, చనిపోయిన వారిని కనుగొనడానికి రక్షకులు పోరాడుతున్నందున రెండు నగరాలు తమ కార్నివాల్ వేడుకలను రద్దు చేసుకున్నాయి.
Also Read: KCR and Jagan: ఇద్దరు ఇద్దరే! సంజీవయ్య నీతి వాళ్లకు బహు దూరం!
ఈ ప్రాంతంలో ఒక్కరోజులో 600 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ వర్షపాతం నమోదైందని, బ్రెజిల్లో ఇంత తక్కువ సమయంలో ఎన్నడూ లేని విధంగా వర్షపాతం నమోదైందని సావో పాలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. ఆ కాలంలో ఒక్క బెర్టియోగాలోనే 687 మిల్లీమీటర్ల వర్షం కురిసిందని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. గవర్నర్ టార్సిసియో డి ఫ్రీటాస్ ఒక ప్రకటనలో మాట్లాడుతూ.. సైన్యం నుండి మద్దతును అభ్యర్థించినట్లు తెలిపారు. టీవీ ఫుటేజీలో ఇళ్లలో పైకప్పులు మాత్రమే కనిపిస్తున్నాయి. స్థానికులు చిన్న పడవలను, సరకులను, ప్రజలను ఎత్తైన ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఉపయోగిస్తున్నారు. రియో డి జెనీరోను ఓడరేవు నగరమైన శాంటోస్కి కలిపే రహదారి కొండచరియలు, వరదల కారణంగా మూసుకుపోయింది.
Related News
Apple iPhones Ban: ఈ దేశంలో ఐఫోన్లపై నిషేధం.. రీజన్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
దక్షిణ కొరియా నుంచి ఆపిల్ కు చేదు వార్త వచ్చింది. భద్రతా కారణాల దృష్ట్యా దక్షిణ కొరియా సైనిక భవనాల్లోకి ఐఫోన్లను తీసుకెళ్లడాన్ని నిషేధించింది.