Bangladesh Army Chief: బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు.. పోలీసులు ఇంకా షాక్లోనే ఉన్నారంటూ కామెంట్స్..!
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ బుధవారం (ఆగస్టు 14) గత అవామీ లీగ్ ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చారని వెల్లడించారు.
- Author : Gopichand
Date : 14-08-2024 - 7:49 IST
Published By : Hashtagu Telugu Desk
Bangladesh Army Chief: బంగ్లాదేశ్లో రెండు నెలల సుదీర్ఘ రిజర్వేషన్ వ్యతిరేక విద్యార్థి ఉద్యమం తర్వాత ఆగస్టు 5న ప్రధాని షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు దేశంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. కాగా బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ (Bangladesh Army Chief).. హసీనా నేతృత్వంలోని ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం కల్పించినట్లు వెల్లడించారు.
బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ బుధవారం (ఆగస్టు 14) గత అవామీ లీగ్ ప్రభుత్వంలోని కొంతమంది ప్రభావవంతమైన వ్యక్తులకు ఆశ్రయం ఇచ్చారని వెల్లడించారు. తద్వారా వారిపై ఎలాంటి దాడులు జరగకుండా నిరోధించవచ్చన్నారు. మైనారిటీల సమస్యలపై బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ మాట్లాడుతూ 20 జిల్లాల్లో మైనారిటీలకు సంబంధించిన మొత్తం 30 దాడులు జరిగాయన్నారు. ఘటనలపై విచారణ జరుపుతున్నామని చెప్పారు. నేరస్తులను న్యాయస్థానం ముందు నిలబెట్టి అందరికీ శిక్షలు పడేలా చేస్తామన్నారు.
Also Read: Har Ghar Tiranga: హర్ ఘర్ తిరంగా సర్టిఫికేట్ను పొందండి ఇలా..!
బంగ్లాదేశ్ పోలీసులు ఇంకా షాక్లోనే ఉన్నారు- ఆర్మీ చీఫ్
ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ మాట్లాడుతూ.. కొందరి ప్రాణాలకు ముప్పు ఉన్నందున మేము వారికి ఆశ్రయం ఇచ్చాము. ప్రస్తుతం పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందని అన్నారు. అయితే పోలీసులు మాత్రం షాక్లోనే ఉన్నారు. ఇది పూర్తయితే మళ్లీ పోలీసులు సక్రమంగా విధులు నిర్వర్తించగలుగుతారన్నారు.
.
ఇదే సమయంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్-ఉజ్-జమాన్ ఒక ప్రకటన చేశారు. మాజీ న్యాయ మంత్రి అనుసుల్ హక్, మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రైవేట్ పరిశ్రమ పెట్టుబడుల సలహాదారు సల్మాన్ ఎఫ్. రెహమాన్ను ఢాకాలో అరెస్టు చేశారు. కాగా, మాజీ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్, మాజీ సహాయ మంత్రి జునైద్ అహ్మద్లను గత వారం ఢాకా విమానాశ్రయంలో అరెస్టు చేశారు. అయితే అప్పటి ప్రధాని షేక్ హసీనా ఆ పదవికి రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు వచ్చిన విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
షేక్ హసీనా బంగ్లాదేశ్ను విడిచిపెట్టినప్పటి నుండి అవామీ లీగ్ పార్టీకి చెందిన చాలా మంది పెద్ద నాయకులు ఎంపీలు, క్యాబినెట్ మంత్రులు దేశం నుండి వెళ్లిపోయారు. కాగా పలువురు ఇతర మంత్రులు తమ ప్రభుత్వ లేదా ప్రైవేట్ నివాసాలను విడిచిపెట్టారు. సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకున్నట్లు సమాచారం.