Israel Job: ఇజ్రాయెల్లో ఉద్యోగాలు.. యూపీ నుంచి 5 వేల మందికి పైగా అభ్యర్థులు ఎంపిక..!
ఇజ్రాయెల్లో ఉద్యోగాల (Israel Job) కోసం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మొదట హర్యానాలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా ఇజ్రాయెల్కు వెళ్లే వారి ఇంటర్వ్యూలు తీసుకున్నారు.
- By Gopichand Published Date - 09:36 AM, Wed - 31 January 24
Israel Job: ఇజ్రాయెల్లో ఉద్యోగాల (Israel Job) కోసం భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. మొదట హర్యానాలో ప్రారంభించి, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో కూడా ఇజ్రాయెల్కు వెళ్లే వారి ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్కు చెందిన 5 వేల మందికి పైగా అభ్యర్థులు ఇజ్రాయెల్లో ఉద్యోగాలు పొందారు. వీరంతా ఇజ్రాయెల్లో పనిచేసేందుకు రూ.1.37 లక్షల జీతం పొందనున్నారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా అక్కడ కార్మికుల కొరత ఉంది. దీని కారణంగా భారత ప్రభుత్వం, ఇజ్రాయెల్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ప్రకారం భారతదేశ ప్రజలను ఇజ్రాయెల్కు పంపుతున్నారు.
ఈ ఉద్యోగాల కోసం ఉత్తరప్రదేశ్కు చెందిన 7094 మంది అభ్యర్థులు ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఇందులో మొత్తం 5020 మందిని ఎంపిక చేశారు. వారం రోజుల పాటు జరిగే ఇంటర్వ్యూ ప్రక్రియలో అభ్యర్థుల నైపుణ్యాలను పరీక్షించారు. ITI, అలీగంజ్ (లక్నో)లో జరిగిన ఈ పరీక్షలో నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ (NSDC)తో పాటు, ఇజ్రాయెల్ ప్రభుత్వ బృందం కూడా హాజరైంది. ఎంపికైన వారు ఇజ్రాయెల్ వెళ్లి మెకానిక్లుగా పనిచేస్తారు. వారు ప్లాస్టర్ పని, సిరామిక్ టైల్స్ సంస్థాపన పని, అనేక ఇతర సారూప్య పనులు చేస్తారు.
Also Read: Budget 2024: ఏ సమయంలో మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెడతారు..?
భారత్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు ఒప్పందంపై సంతకాలు
అభ్యర్థుల నైపుణ్యాల పరీక్ష ఉత్తరప్రదేశ్ ప్రత్యేక కార్మిక కార్యదర్శి, శిక్షణ, ఉపాధి డైరెక్టర్ కునాల్ సిల్క్ నేతృత్వంలో జరిగింది. ‘ముఖ్యమంత్రి సూచనల మేరకు ఉత్తరప్రదేశ్లో ఈ ప్రచారాన్ని ప్రారంభించామని, ఇజ్రాయెల్ వెళ్లేందుకు 5 వేల మందికి పైగా ఎంపిక చేశామన్నారు. అంతకుముందు నైపుణ్యం కలిగిన కళాకారుల సరఫరా కోసం భారతదేశం- ఇజ్రాయెల్ ప్రభుత్వం ఒక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి.
ఇజ్రాయెల్ ITI అలీగంజ్లో జనవరి 23 నుండి 30 వరకు కళాకారుల నైపుణ్యాలను పరీక్షించింది. ఇజ్రాయెల్కు వెళ్లి పనిచేసినందుకు ఈ వ్యక్తులకు ప్రతి నెలా రూ.1.37 లక్షల జీతం ఇవ్వనున్నారు. ఐటీఐ అలీగంజ్ ప్రిన్సిపల్ రాజ్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. ఈ స్కిల్ టెస్ట్ మంగళవారం పూర్తయింది. ఇజ్రాయెల్ బృందం మా ప్రయత్నాలను ఎంతో మెచ్చుకుంది. భవిష్యత్తులో చేతివృత్తిదారులు అవసరమైతే ఐటీఐ అలీగంజ్ను పరీక్షా కేంద్రంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
We’re now on WhatsApp : Click to Join
Related News
MDH- Everest: భారత్లో రూట్ మార్చిన మసాలా కంపెనీలు.. రంగంలోకి FSSAI..!
సింగపూర్, హాంకాంగ్, అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో వివాదాల్లో కూరుకుపోయిన ఎండీహెచ్, ఎవరెస్ట్ మసాలాల వేడి దేశంలోని అన్ని మసాలా కంపెనీలకు చేరింది.