America: అమెరికాను ‘క్రైస్తవ దేశం’గా మార్చాలని కోరుతున్న 45శాతం మంది అమెరికన్లు..!!
- By hashtagu Published Date - 09:34 AM, Sun - 30 October 22
శతాబ్దాలుగా అగ్రరాజ్యం అమెరికాలో ఆధిపత్యం వహిస్తున్న శక్తివంతమైన, సాంప్రదాయమైన క్రైస్తవ మతస్థుల ప్రాబల్యం మళ్లీ పెరుగుతోందా? ఇప్పటివరకు ఆ మతం నుంచి బయటకు వచ్చిన వారి సంఖ్య గణనీయంగానే ఉంది. అయితే భవిష్యత్ లో ఆ మతంలోకి వెళ్లేందుకు అమెరికన్లు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే అవుననే తాజాగా జరిపిన ఒక అధ్యయనం స్పష్టం చేస్తున్నది.
అగ్రరాజ్యంలో ఇప్పటికీ క్రైస్తవమే ఆధిపత్యంలో ఉన్నా…ఆ మతాన్ని వీడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతూ వచ్చింది. ఆ మధ్య కాలంలో అనూహ్య రీతిలో క్రైస్తవ మతం క్షీణిస్తున్నట్లు ఓ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన అధ్యయనం వెల్లడించింది. నాస్తికులతోపాటు ఏ మతం స్వీకరించని వాళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోందని తెలిపింది. అయితే వాషింగ్టన్ లో ఉన్న ప్యూ రీసెర్చ్ సెంటర్ అనే అమెరికన్ థింక్ ట్యాంక్ చేసిన కొత్త సర్వే ప్రకారం 10 మంది అమెరికన్లలో 4గురు అమెరికాను క్రైస్తవ దేశంగా మార్చాలని భావిస్తున్నారని సర్వేలో తేలింది. అంతేకాదు చాలామంది అమెరికన్లు…ఇతర ప్రార్థనా మందిరాలు, చర్చిలు, రాజకీయాలకు దూరంగా ఉండాలని..ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు ఎలాంటి మద్దతు ఇవ్వకూడదని భావిస్తున్నారని సర్వే పేర్కొంది.
క్రిస్టియన్ జాతీయవాదం అనేది యునైటెడ్ స్టేట్స్ పునాది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సన్నిహితులు, అనుచరులు కొందరు ఈ భావజాలాన్ని అనుసరిస్తున్నారు. వీరిలో మాజీ జాతీయ భద్రతా సలహాదారు మైఖేల్ ఫ్లిన్, ట్రంప్ ఆమోదించిన పెన్సిల్వేనియా గవర్నర్ రిపబ్లికన్ నామినీ డౌగ్ మాస్ట్రియానో కూడా ఉన్నారు. అయితే క్రిస్టియన్ జాతీయవాదంపై విశ్వాసం పెరగలేదని ప్యూ సర్వేలో తేలింది. అమెరికా క్రైస్తవ దేశంగా ఉండాలని చెప్పే అమెరికన్ పెద్దలలో మూడింట ఒక వంతు మంది (32 శాతం) కూడా దేశం మతపరంగా వైవిధ్యమైనదని తేలింది. అమెరికా క్రైస్తవ దేశంగా ఉండాలని కోరుకునే వారి కంటే అమెరికాను క్రైస్తవ దేశంగా కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని…ఇది మత వైవిధ్యంపై ఈ ప్రతికూల అభిప్రాయాన్ని వ్యక్తం చేయడానికి వారంతా సుముఖంగా ఉన్నారని సర్వే పేర్కొంది.
Related News
Telugu Students : విహార యాత్రలో విషాదం.. అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
Telugu Students : అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృత్యువాత పడ్డారు.