Video Viral: మరోసారి డాన్స్ తో అదరగొట్టిన మెట్రో యువతి.. వీడియో వైరల్?
ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో చాలామంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు.
- By Nakshatra Published Date - 05:40 PM, Thu - 13 April 23
ఇటీవల కాలంలో సోషల్ మీడియా బాగా డెవలప్ అవ్వడంతో చాలామంది రాత్రికి రాత్రే సెలబ్రిటీలుగా మారిపోతున్నారు. వారిలో ఉన్న టాలెంట్ ని బయట పెడుతూ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అంతేకాకుండా చాలామంది సోషల్ మీడియా ద్వారా లక్షలు సంపాదిస్తున్నారు. టిక్ టాక్ వచ్చిన తర్వాత చాలామంది ఫేమస్ అయ్యారని చెప్పవచ్చు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు కూడా రాణిస్తున్న విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో డాన్స్ వీడియోలు చేసి భారీగా పాపులారిటీని సంపాదించుకొని లక్షలకు లక్షలు సంపాదిస్తున్న వారు ఎంతోమంది ఉన్నారు.
ఎక్కువగా చాలామంది డాన్స్ వీడియోలు రీల్స్ వీడియోల ద్వారా బాగా పాపులర్ అయ్యారని చెప్పవచ్చు. ప్రేక్షకులు కూడా అటువంటి టాలెంట్ ఉన్న వారిని బాగా ఎంకరేజ్ చేస్తూ సెలబ్రిటీలుగా మార్చేస్తున్నారు. వారిలో ఉన్న టాలెంట్ నిరూపించుకోవడం కోసం చాలామంది సోషల్ మీడియాను వేదికగా చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే అలా సోషల్ మీడియా ద్వారా బాగా పాపులారిటీ సంపాదించుకున్న వారిలో ఇటీవల చీర కట్టులో ఢిల్లీ మెట్రో ప్లాట్ ఫామ్ పై డాన్స్ చేసిన యువతి కూడా ఒకరు.
ఆమె పేరు అవ్నీకరీశ్. ఆమధ్య ఒకసారి ఆమె ఢిల్లీ మెట్రో ప్లాట్ఫామ్ పై డాన్స్ చేయగా అధికాస్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో బీభత్సమైన పాపులారిటీని సంపాదించుకుంది. కాగా వృత్తిరీత్యా డ్యాన్సర్గా చెప్పుకునే అవ్నీకరీశ్ ఢిల్లీ మెట్రో స్టేషన్లో భోజ్పురి పాట సాజ్ కే సవార్ కేకు తన నిర్మొహమాటంగా డ్యాన్స్ చేసినందుకు అందరి దృష్టిని ఆకర్షించింది.. తాజాగా అవ్నీకరీశ్ నలుపు రంగు లెహంగా ధరించి, తన డ్యాన్స్ పార్ట్నర్తో కలిసి స్టెప్పులను ఇరగదీసింది. సల్మాన్ ఖాన్, రాణి ముఖర్జీ నటించిన హలో బ్రదర్లోని తేరి చున్నారియా పాట బీట్లకు వీరిద్దరూ డ్యాన్స్ చేసి అలరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకట్టుకుంటోంది.
Related News
Barrelakka Crying: నన్ను ట్రోల్స్ చేయకండి ప్లీజ్.. బోరున ఏడ్చిన బర్రెలక్క
పోలింగ్కు ఒక్కరోజు ముందు నేను చనిపోతానేమోనని భయంగా ఉంది అంటూ బర్రెలక్క పోస్ట్ చేసింది. మరో గీతాంజలిలా నేనూ బలిపశువును అవుతానని భావిస్తున్నాను. మీ స్వంత ఆనందం కోసం మీరు చేసే వీడియోల ద్వారా ప్రాణాలు పోతున్నాయి అంటూ ఆవేదన వ్యక్తం చేసింది