Viral Video: రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక వేడితో పాపడ్ కాల్చిన BSF సైనికులు
రాజస్థాన్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం
- By Praveen Aluthuru Published Date - 03:37 PM, Wed - 22 May 24
![Viral Video: రాజస్థాన్ ఎడారుల్లో ఇసుక వేడితో పాపడ్ కాల్చిన BSF సైనికులు](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/papad-sixteen_nine.jpg)
Viral Video: రాజస్థాన్లో ఎండ వేడిమి కొనసాగుతోంది. ఎండ తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎండ వేడిమి, కరెంటు కోతలతో ప్రజలకు ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక సరిహద్దు భద్రతా దళాల పరిస్థితి వర్ణనాతీతం. భానుడి ప్రతాపానిక్ బీఎస్పీ (BSF) సైనికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కింద ఇసుక, పైన వేడితో దయనీయ పరిస్థితి ఎదుర్కొంటున్నారు. రాజస్థాన్ ఎడారుల్లో వారి పరిస్థితి ఏంటో ఓ బీఎస్పీ సైనికుడు అందరికి తెలిసేలా ఓ వీడియోని విడుదల చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ గా మారింది.
రాజస్థాన్ బికనీర్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెల్సియస్కు చేరుకుంది. ఈ మండుతున్న వేడి మధ్య, సరిహద్దు భద్రతా దళం (BSF) సైనికుడి వీడియో బయటపడింది. మండుతున్న వేడి ఇసుకలో పాపడ్ కాల్చడం అందర్నీ ఆలోచింపజేస్తుంది. పాపడ్ కేవలం కొన్ని సెకన్లలో ఉడికిపోతుంది. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా ఈ వీడియోను తన అధికారిక సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియోను పోస్ట్ చేస్తూ అసాధారణ పరిస్థితులలో కూడా మనల్ని సురక్షితంగా ఉంచే మన సైనికుల పట్ల అపారమైన గౌరవం మరియు కృతజ్ఞతా భావాన్ని సృష్టించింది అని ఎక్స్ ద్వారా పంచుకున్నారు.
Seeing this video from the deserts of Rajasthan fills me with immense respect and gratitude for our jawans who keep us safe in such extraordinary conditions.@BSF_India pic.twitter.com/kLfE52tuAa
— Himanta Biswa Sarma (@himantabiswa) May 22, 2024
రాష్ట్రంలోని జుంజును జిల్లా పిలానీలో వరుసగా రెండో రోజు బుధవారం ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్ను దాటింది. రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో 44 డిగ్రీల సెల్సియస్ లేదా అంతకంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. మరోవైపు ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఆదేశాల మేరకు డివిజనల్ కమిషనర్లు, జిల్లా కలెక్టర్లు, సబ్డివిజన్ అధికారులు, నీటి సరఫరా, వైద్య, ఆరోగ్య శాఖ ఉద్యోగుల సెలవులను రద్దు చేశారు. అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
Also Read: Samantha : నువ్వు గెలవాలని కోరుకుంటున్నా.. సమంత ఎవరి కోసం ఈ ప్రార్ధనలు..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్స్ట్రోక్ కేసులు!](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/heat-wave.jpg)
Heat Stroke Cases: దంచికొడుతున్న ఎండలు.. మార్చి- జూన్ మధ్య 40 వేలకు పైగా హీట్స్ట్రోక్ కేసులు!
Heat Stroke Cases: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండ తీవ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సూర్యుడు.. ఆకాశం నుండి నిప్పుల వర్షం కురిపిస్తున్నాడు. దీని కారణంగా సాధారణ ప్రజలు పలువురు ప్రాణాలు కోల్పోయారు. పగటిపూట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్న ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను వేడిగాలులు ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. రాయిటర్స్ నివేదిక ప్రకారం.. వేసవి కాలంలో దేశవ్యాప్తంగా 40,000 కంటే ఎక�