Kohli- Anushka Sharma: కృష్ణదాస్ కీర్తన షో చూసేందుకు లండన్ వెళ్లిన విరాట్ కోహ్లీ దంపతులు.. వీడియో వైరల్..!
కృష్ణదాస్ కీర్తన షో చూసేందుకు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ (Kohli- Anushka Sharma)తో కలిసి లండన్ చేరుకున్నాడు. జూలై 12 నుండి వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్ను ప్రారంభించనుంది.
- By Gopichand Published Date - 10:23 AM, Sun - 18 June 23
Kohli- Anushka Sharma: కృష్ణదాస్ కీర్తన షో చూసేందుకు విరాట్ కోహ్లీ తన భార్య అనుష్క శర్మ (Kohli- Anushka Sharma)తో కలిసి లండన్ చేరుకున్నాడు. జూలై 12 నుండి వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు టెస్ట్ సిరీస్ను ప్రారంభించనుంది. ఆపై జట్టు ఇక్కడ వన్డేలు, టి20 ఇంటర్నేషనల్ల సిరీస్ను కూడా ఆడుతుంది. ఈ టూర్కు ముందు టీమ్ ఇండియాకు ఎలాంటి మ్యాచ్ లేదు. దీంతో జట్టులోని చాలా మంది ఆటగాళ్లు విశ్రాంతిని సద్వినియోగం చేసుకుంటున్నారు.
కాగా, కీర్తన వినేందుకు విరాట్ కోహ్లీ గత శనివారం (జూన్ 17) లండన్ చేరుకున్నాడు. ప్రముఖ అమెరికన్ సింగర్ కృష్ణ దాస్ కీర్తన షోకు కోహ్లీ చేరుకున్నాడు. కృష్ణ దాస్ ప్రసిద్ధ భక్తి పాటలకు ప్రసిద్ధి చెందారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మతో కలిసి కనిపించాడు. కీర్తన వినడానికి విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ చేరుకున్నట్లు ఈ వీడియోలో కనిపిస్తుంది.
Also Read: Wrestlers Protest: పదేళ్లుగా మహిళ రెజ్లర్లపై లైగిక వేధింపులు: వైరల్ వీడియో
Virat Kohli and Anushka Sharma attend Krishna Das Kirtan in London Yesterday pic.twitter.com/IRRnz8peh3
— Virat Kohli Fan Club (@Trend_VKohli) June 17, 2023
WTC ఫైనల్లో కోహ్లీ పేలవ ప్రదర్శన
ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో టీమిండియా 209 పరుగుల తేడాతో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయాడు. తొలి ఇన్నింగ్స్లో 14, రెండో ఇన్నింగ్స్లో 49 పరుగులు మాత్రమే చేశాడు.
జూలైలో టీమిండియా వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనుంది
భారత జట్టు జూలైలో వెస్టిండీస్లో పర్యటించనుంది. అక్కడ 2 టెస్టులు, 3 ODIలు, 5 T20 ఇంటర్నేషనల్ల సిరీస్ ఆడనుంది. జూలై 12 నుంచి డొమినికాలో జరగనున్న టెస్టు మ్యాచ్తో ఈ టూర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత జూలై 27 నుంచి వన్డేలు, ఆగస్టు 3 నుంచి టీ20 సిరీస్లు జరగనున్నాయి.
ఈ పర్యటన తర్వాత భారత జట్టు ఆసియా కప్ 2023కి సిద్ధమవుతుంది. వన్డే ఫార్మాట్లో జరిగే ఆసియా కప్కు ఈసారి శ్రీలంక, పాకిస్థాన్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. టోర్నీలో భారత్కు చెందిన అన్ని మ్యాచ్లు శ్రీలంకలో జరగనున్నాయి. ఇక ఫైనల్ మ్యాచ్ కూడా శ్రీలంకలోనే జరగనుంది. ఇంకా తేదీలు ప్రకటించని ఆసియా కప్ తర్వాత వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది.
Related News
GT vs RCB: ఆర్సీబీ వర్సెస్ గుజరాత్.. గిల్ జట్టుకు డూ ఆర్ డై మ్యాచ్..!
IPL 2024 సీజన్ ఇప్పుడు ట్రేడింగ్ సీజన్గా మారింది. ఈ సీజన్లో పరుగుల పరంగా ఎన్నో రికార్డులు బద్దలవుతున్నాయి. లీగ్ 17వ సీజన్లో దాదాపు ప్రతి మ్యాచ్లో 200 స్కోర్లు చేస్తున్నారు.