Karnataka: లవర్ ని పెళ్లి చేసుకోవడం కోసం దోషికి 15 రోజులు పెరోల్ ఇచ్చిన కోర్ట్?
నీతా అనే యువతి, ఆనంద్ అనే వ్యక్తి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆనంద్ జైలులో ఉండటంతో పెళ్లి
- By Nakshatra Published Date - 07:45 PM, Tue - 4 April 23
నీతా అనే యువతి, ఆనంద్ అనే వ్యక్తి 9 ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. కానీ ఆనంద్ జైలులో ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోయారు. దాంతో తనకు వేరే వాళ్లతో పెళ్లి చేయాలని తల్లిదండ్రులు చూస్తున్నారని, ఆనంద్కు పెరోల్ మంజూరు చేస్తే అతడ్నే పెళ్లి చేసుకుంటానని నీతా కోర్టును ఆశ్రయించింది. ఆనంద్ తల్లి కూడా నీతా మద్దతుగా నిలిచింది. ఈ ప్రేమ గురించి తెలుసుకున్న న్యాయస్థానం ఇద్దరు ఒక్కటి కావాలని పెరోల్ మంజూరు చేసింది. ఈ నేపథ్యంలోనే కర్ణాటక హైకోర్టు తాజాగా కీలక తీర్పునిచ్చింది.
ఒక హత్య కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్న ఆనంద్ కి అతను ప్రేమించిన యువతిని నీతా తో పెళ్లి చేసుకునేందుకు 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది. దాంతో ఏప్రిల్ 5న ఆనంద్ జైలు నుంచి విడుదల చేయనున్నట్లు కోర్ట్ తెలిపింది. మల్లీ 20వ తేదీ సాయంత్రం తిరిగి జైలుకు చేరుకోవాల్సి ఉంటుంది. పెళ్లి కోసం పెరోల్ మంజూరు చేయాలనే నిబంధన లేకపోయినప్పటికీ ఇది అసాధారణ పరిస్థితి అని భావించి కోర్టు ఈ తీర్పునిచ్చింది.
అయితే అతన్ని విడుదల చేడయం అనివార్యం. లేకపోతే జీవితాంతం ప్రేమను కోల్పోతాడు. జైలులో ఉన్న ఇతడు తన ప్రేయసి వేరే వాళ్లను పెళ్లి చేసుకుందని తెలిస్తే భరించలేడు. అందుకే ఎమర్జెన్సీ పెరోల్ వినతికి అంగీకరిస్తున్నాం అని న్యాయస్థానం ప్రకటించింది. కాగా ఆనంద్ విషయానికి వస్తే.. ప్రేయసిని పెళ్లాడేందుకు పెరోల్ పొందిన అతని పేరు ఆనంద్ కాగా ఒక హత్య కేసులో దోషిగా తేలడంతో యావజ్జీవ శిక్ష పడింది. అయితే అతని సత్ప్రవర్తన కారణంగా ఇప్పటికే శిక్షను 10 ఏళ్లకు తగ్గించారు. ఇప్పటికే ఆరేళ్ల శిక్షాకాలం పూర్తయింది. ఇంకో 4 ఏళ్లు జైలులో ఉండాల్సి ఉంది.
Related News
Sexual Assault Case: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్
లైంగిక వేధింపుల కేసులో జేడీ(ఎస్) ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ప్రజ్వల్పై అతని తండ్రి, హోలెనరసిపుర ఎమ్మెల్యే హెచ్డి రేవణ్ణ కూడా నిందితుడిగా ఉన్న లైంగిక వేధింపుల కేసుకు సంబంధించి కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.