Bengaluru: సీఈఓ,ఎండీ జంట హత్యలు.. కలకలం రేపుతున్న వీడియో?
బెంగళూరులో తాజాగా జంట హత్యల కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఎండీ సీఈఓ ని అదే కంపెనీలో పనిచేసే మాజీ ఉద్యోగులు దారుణంగా హత్య చేసి
- By Nakshatra Published Date - 05:10 PM, Thu - 13 July 23
బెంగళూరులో తాజాగా జంట హత్యల కేసు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఎండీ సీఈఓ ని అదే కంపెనీలో పనిచేసే మాజీ ఉద్యోగులు దారుణంగా హత్య చేసిన విషయం తెలిసిందే. హత్య జరిగిన 24 గంటల్లోనే పోలీసులు నిందితులను అరెస్టు చేసి అదుపులోకి తీసుకున్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ కేసులో మరొక కీలక అంశం వెలుగులోకి వచ్చింది. అదే వీడియో. ఈ జంట హత్యల కేసులో కీలకమైన సీసీటీవీ ఫుటేజీ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
ఈ హత్యలతో సంబంధం ఉందని అనుమానిస్తున్న వ్యక్తులు ఘటన తర్వాత పారిపోతున్న వీడియో ఇపుడు సంచలనంగా మారింది. పీటీఐ దీనికి సంబంధించిన వీడియోను ట్వీట్ చేసింది. బెంగళూరులోని ఏరోనిక్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ, సీఈవో జంట హత్యకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ గురువారం ఆన్లైన్లో ప్రత్యక్షమైంది. జూలై 11న సాయంత్రం 4:14 గంటలకు మొదటి సీసీటీవీ విజువల్లో, ముగ్గురు నిందితులు ఏరోనిక్స్ కార్యాలయం నుంచి బయటకు పరుగెత్తుతూ కెమెరాకు చిక్కారు.
VIDEO | Bengaluru double-murder: CCTV footage shows two of the accused, who allegedly killed a managing director and a chief executive officer of a company, fleeing spot after committing the crime.
(Source: Third Party) pic.twitter.com/scntpM5dRP
— Press Trust of India (@PTI_News) July 13, 2023
నిందితులు సంతోష్, వినయ్ రెడ్డి ఆఫీసు గేటు నుంచి బయటకు వస్తుండగా, ప్రధాన నిందితుడు శబరీష్ అలియాస్ జాక్ ఫిలిక్స్ కనిపించారు. కన్నడ ర్యాపర్గా చెప్పుకునే ఫిలిక్స్కు ఇన్స్టాలో 16 వేల మంది ఫాలోయిర్స్ ఉన్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బెంగళూరు నగరంలోని అమృతహళ్లి పంపా లేఅవుట్ లోని ఎయిర్ ఆన్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సీఈఓ వినుకుమార్, మేనేజింగ్ డైరెక్టర్ ఫణీంద్ర సుబ్రహ్మణ్య తాజాగా మంగళవారం సాయంత్రం హత్యకు గురయ్యారు. వెంటనే పోలీసులు ఈ కేసున ఛేదించారు. నిందితులను శబరీష్, వినయ్రెడ్డి, సంతోష్గా గుర్తించారు. నిందితులంతా ఎయిర్ ఆన్లో మాజీ ఉద్యోగులు కావడం గమనార్హం.
Related News
Beers Sales: మద్యం ప్రియులకు బిగ్ షాక్.. బెంగళూరులో బీర్ల కొరత, కారణమిదే
Beers Sales: రాష్ట్రవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండటంతో బెంగళూరు వాసులు వేడిని తట్టుకునేందుకు చల్లని బీర్ల వైపు మొగ్గుచూపడంతో డిమాండ్ పెరగడంతో ఎక్సైజ్ శాఖ అనూహ్యంగా అమ్మకాల లెక్కలతో సతమతమవుతోంది. ఏప్రిల్- మే నెలల్లో చివరి 11 రోజుల్లో 17 లక్షల లీటర్ల కోల్డ్ బీర్లు అమ్ముడయ్యాయని, మూడు సంవత్సరాల క్రితం 14.4 లక్షల లీటర్లు అమ్ముడుపోయిన గత రికార్డులను బద్దలు కొట్టిందని వెల్లడైంద