ATM Bandh : 3 రోజుల పాటు ATMలు బంద్..ఎంత నిజం ?
ATM Bandh : ముఖ్యంగా వాట్సాప్లో ఈ ప్రచారం మరింత వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ప్రజల్లో భయం నెలకొనగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించి స్పష్టత ఇచ్చింది
- By Sudheer Published Date - 12:58 PM, Fri - 9 May 25

భారత్ – పాకిస్తాన్ (India – Pakistan war) మధ్య ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో సామాజిక మాధ్యమాల్లో “మూడు రోజుల పాటు ఏటీఎంలు బంద్ (ATMS Close) అవుతాయని” పుకార్లు వైరల్ గా మారాయి. ముఖ్యంగా వాట్సాప్లో ఈ ప్రచారం మరింత వైరల్ అవుతోంది. ఈ వార్తలపై ప్రజల్లో భయం నెలకొనగా, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) స్పందించి స్పష్టత ఇచ్చింది. ఏటీఎంల మూసివేత గురించి వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని, అది పూర్తిగా తప్పుడు సమాచారం అని PIB ఖండించింది.
అలాంటి అవాస్తవాలను నమ్మవద్దని, వాటిని ఇతరులకు షేర్ చేయకూడదని PIB హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం పౌరుల భద్రతకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ, బ్యాంకింగ్ సేవల్లో అంతరాయం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రయోజక భయాందోళన చెందాల్సిన అవసరం లేదని సూచించింది. ఏటీఎంలు సాధారణంగా పని చేస్తున్నాయని, ప్రజలు విధిగా వాటిని వినియోగించుకోవచ్చని తెలిపింది.
Operation Sindoor : మళ్లీ సైన్యంలో పాల్గొంటాం అంటున్న మాజీ సైనికులు
ఇక భారత్ – పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పంజాబ్, రాజస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని స్కూలులు, కాలేజీలు తాత్కాలికంగా మూసివేయగా, ఛండీఘర్, శ్రీనగర్ సహా పలు విమానాశ్రయాలు కూడా నిష్క్రియంగా ఉన్నాయని సమాచారం. అయితే ఇవి ప్రజల రక్షణ కోసం తీసుకున్న జాగ్రత్త చర్యలు మాత్రమేనని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు అధికారిక సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, తప్పుడు ప్రచారాలకు బలవకుండానీ సూచిస్తున్నారు.
Are ATMs closed⁉️
A viral #WhatsApp message claims ATMs will be closed for 2–3 days.
🛑 This Message is FAKE
✅ ATMs will continue to operate as usual
❌ Don’t share unverified messages.#IndiaFightsPropaganda pic.twitter.com/BXfzjjFpzD
— PIB Fact Check (@PIBFactCheck) May 9, 2025