Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్
మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది.
- By Praveen Aluthuru Published Date - 05:51 PM, Sat - 25 May 24
![Madhya Pradesh: సినిమా తరహాలో దొంగతనం.. ఎవర్రా మీరంతా అంటున్న కాప్స్](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/05/3-men-on-bike-steal-from-moving-truck-filmy-style-255447205-16x9_0.jpg)
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో ముగ్గురు వ్యక్తులు కదులుతున్న ట్రక్కులో వస్తువులను దొంగిలించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆగ్రా-ముంబై హైవేపై దేవాస్-షాజాపూర్ మార్గం మధ్య డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి తన కారు నుండి ఈ సంఘటనను రికార్డ్ చేయడంతో విషయం బయటకు వచ్చింది. నిజానికి ఈ దోపిడీ వీడియో హిందీ సినిమా ధూమ్ సన్నివేశాన్ని తలపిస్తోంది.
వీడియోలో ఒక వ్యక్తి ట్రక్కు వెనుక బైక్ నడుపుతుండగా, అతని సహచరులు వస్తువులను దొంగిలించే పనిలో ఉన్నారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు లారీపైకి ఎక్కి సరుకుపై ఉన్న టార్పాలిన్ షీట్ను కత్తిరించారు. ఆపై అందులో ఉన్న వస్తువుల్ని కిందపడేశారు. ఆ తర్వాత ట్రక్కు దిగి స్నేహితుడు నడుపుతున్న బైక్పైకి దూకారు. ట్రక్కు కదులుతున్న కొద్దీ రోడ్డుపై పడి ఉన్న వస్తువులను సేకరించేందుకు వీలుగా బైక్ వేగాన్ని తగ్గించి సినిమా తరహాలో దొంగతనానికి పాల్పడ్డారు.
ఈ సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియరాలేదు. ఏ ట్రక్కు డ్రైవర్ కూడా ఇంతవరకు సంఘటనను నివేదించలేదు. వీడియో లభించిన వెంటనే దర్యాప్తు చేసి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు చెప్పారు.
Also Read: Nara Lokesh : వైసీపీ నేతలు లోకేశ్ను మిస్సవుతున్నారా..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Hyderabad: 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Hyderabad_11zon.jpg)
Hyderabad: 13 ఏళ్ల బాలికకు మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం
నేరేడ్మెట్లో దారుణం చోటు చేసుకుంది. 13 ఏళ్ల బాలికపై సామూహిక హత్యాచారం జరిగింది. అయితే ఇదంతా చేసింది బాలిక ప్రియుడే కావడం విశేషం. సదరు బాలికపై ఆమె ప్రియుడుతో పాటు మరో నలుగురు మత్తుమందు ఇచ్చి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు.