Rahul : ప్రతి పరిశ్రమలో అదానీయే ఎందుకు కనిపిస్తున్నారు? : రాహుల్ గాంధీ
- By Latha Suma Published Date - 08:02 PM, Thu - 11 April 24
Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీPrime Minister Narendra Modi) పారిశ్రామికవేత్త అదానీ(Adani)కే అన్ని ప్రయోజనాలను కట్టబెడుతున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ఆరోపించారు. తాను ఈ విషయం పార్లమెంట్(Parliament) వేదికగా చెబితే తన సభ్యత్వాన్ని తీసివేశారని, సుప్రీంకోర్టు జోక్యంతో తాను తిరిగి ఎంపీ పదవి చేపట్టానని రాహుల్ అన్నారు.
#WATCH | Jodhpur, Rajasthan: Congress leader Rahul Gandhi says, "PM Modi gave all the benefits to one person. I spoke about it in the Parliament. They took away my membership. The Supreme Court made me the MP again. I had only asked why Adani was visible in every industry… I… pic.twitter.com/sfP6UJjuIQ
— ANI (@ANI) April 11, 2024
రాజస్ధాన్(Rajasthan)లోని జోథ్పూర్(Jodhpur)లో గురువారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ, కాషాయ పార్టీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ప్రతి పరిశ్రమలో అదానీయే ఎందుకు కనిపిస్తున్నారని తాను అడిగానని, అదానీతో మీకెలాంటి సంబంధం ఉందని ప్రధానిని ప్రశ్నించానని చెప్పారు. కాషాయ పాలకులు ప్రతిగా తన పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసి తన ఇంటిని లాగేసుకున్నారని పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
వారు నా ఇంటిని తీసుకుంటే నేను మౌనంగా ఉంటానని వారనుకున్నారని చెప్పారు. ఇంటి తాళాలను వారికి అప్పగించి మీ ఇల్లు నాకు అవసరం లేదని, నాకు దేశంలో కోట్లాది ఇండ్లున్నాయని, కోట్ల మంది ప్రజల హృదయాల్లో నివసిస్తానని వారికి చెప్పానని రాహుల్ వివరించారు. కొద్ది మంది బడా సంపన్న పారిశ్రామికవేత్తల బాగు కోసమే మోడీ పనిచేస్తున్నారని విమర్శించారు.
Read Also: Summer: సమ్మర్ ఎఫెక్ట్.. సిటీలో పెరుగుతున్న విద్యుత్ వాడకం
Related News
AP Politics : టీడీపీ నయా ప్లాన్.. ఇక వై నాట్ వైసీపీ కాదు.. వై వైసీపీనే..!
ఏపీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. అయితే.. ప్రజలకు చేరువయ్యందుకు ఆయా పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. అయితే.. అధికార వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను వాడుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు.