HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >To Stop Pakistan The Center Plans To Revive The Tulbul Project

Tulbul project : పాక్‌కు అడ్డుకట్ట..తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!

ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.

  • By Latha Suma Published Date - 05:40 PM, Thu - 26 June 25
  • daily-hunt
To stop Pakistan..the Center plans to revive the Tulbul project..!
To stop Pakistan..the Center plans to revive the Tulbul project..!

Tulbul project : పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సరిహద్దులలో తరచూ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు బుద్ధిచెప్పేందుకు దేశం ఇప్పుడు నీటి దారులను వదిలిపెట్టడం లేదు. ఇందుకు భాగంగా సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేస్తూ భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్‌లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్‌ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లోని తుల్‌బుల్‌ నావిగేషన్‌ ప్రాజెక్టుపై మళ్లీ దృష్టి సారించింది. సుదీర్ఘకాలంగా నిలిచిపోయిన ఈ ప్రాజెక్టు పునరుద్ధరణకు సంబంధించి చర్చలు తుది దశలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Read Also: CM Chandrababu : ఆంధ్రప్రదేశ్‌కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు

ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) ప్రస్తుతం సిద్ధమవుతుండగా, వచ్చే ఏడాదిలో ఇది పూర్తి అవుతుందనే అంచనాలు వ్యక్తమవుతున్నాయి. తుల్‌బుల్‌ ప్రాజెక్టుతో పాటు పశ్చిమ నదులైన జీలం, చీనాబ్‌ నదుల నీటిని దేశ అవసరాల కోసం మరింతగా వాడుకునే మార్గాలను భారత ప్రభుత్వం విశ్లేషిస్తోంది. ఇదిలా ఉండగా, పంజాబ్‌, హరియాణా వంటి రాష్ట్రాలకు నీటిని మళ్లించే అవకాశాలను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. అంతేకాక, దేశంలోని నీటి నిల్వ సామర్థ్యాన్ని మెరుగుపర్చే దిశగా కొన్ని కీలక ప్రణాళికలు రూపుదిద్దుకుంటున్నాయి. డ్రై సీజన్‌లో కొంతమేర నిల్వ ఉంటున్నా, వర్షాకాలంలో అధిక నీరు దిగువన పాకిస్థాన్‌కు వెళ్లిపోతున్నదే ప్రధాన సవాలు.

1960 సెప్టెంబర్‌ 19న భారత్‌, పాక్‌ మధ్య కుదిరిన సింధూ జలాల ఒప్పందం ప్రకారం సింధూ, జీలం, చీనాబ్‌ వంటి పశ్చిమ నదులపై పాకిస్థాన్‌కు 80 శాతం హక్కు ఉంది. భారత్‌కు కేవలం 20 శాతం మాత్రమే వినియోగం హక్కు లభించింది. ఇదే కారణంగా భారత్ పలు నీటి ప్రాజెక్టులు చేపట్టేందుకు పాకిస్థాన్‌ తరచూ అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వచ్చింది. అయితే, భారత్‌ ఇప్పుడు వీటిపై కఠిన వైఖరితో ముందుకెళుతోంది. ఇప్పటికే కిషన్‌గంగా ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేసిన భారత్, ప్రస్తుతం రాట్లే హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది. ఈ ప్రాజెక్టులతో పాటు తుల్‌బుల్‌ ప్రాజెక్టును మళ్లీ ముందుకు తీసుకురావడం ద్వారా నీటి నియంత్రణపై భారత్‌ పట్టుదలగా ఉంది. ఇవన్నీ కలిపి చూస్తే, భారత్‌ ఇప్పుడు జలవనరులను అంతర్జాతీయ ఒప్పందాల పరిధిలోనే కానీ, తమ దేశ ప్రయోజనాలను రక్షించుకునే దిశగా ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోంది. పాకిస్థాన్‌కి ఇది మేలుకోటానికి ఓ సంకేతంగా మారుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Tragedy : ఆదిలాబాద్‌లో విషాదం.. పొంగిపొర్లుతున్న వాగులో పడి యువకుడు గల్లంతు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • India Pakistan Tensions
  • Indus Waters Treaty
  • Jhelum river
  • Pakistan water crisis
  • Tulbul project

Related News

Once again, India's humanitarian approach...an early warning to Pakistan

Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

భారత విదేశాంగ శాఖ ద్వారా ఇస్లామాబాద్‌కు ఈ సమాచారాన్ని నిన్ననే పంపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. సట్లెజ్ నది వరద ఉద్ధృతికి లోనవుతుందని, పాక్‌లో ప్రాణ నష్టం లేదా ఆస్తి నష్టం సంభవించకూడదనే ఉద్దేశంతో ఈ చర్య తీసుకున్నట్లు భారత అధికారులు స్పష్టం చేశారు.

    Latest News

    • Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

    • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

    • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

    • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

    • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

    Trending News

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

      • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd