HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Sama Rammohan Reddy Comments On Chargesheets Bjp Brs Criticisms

Sama Ram Mohan Reddy: వంచన కేసీఆర్ కుటుంబం పెటెంట్… వారు తప్ప ఎవరూ చేయలేరు

Sama Rammohan Reddy : ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • Author : Kavya Krishna Date : 08-12-2024 - 6:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Sama Rammohan Reddy
Sama Rammohan Reddy

Sama Ram Mohan Reddy : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పాలన సాగించిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా పాలన వియోజత్సవాల సంబరాలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రతిపక్షాలైన బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. వీరిపైన, చార్జీషీట్లు విడుదల చేసి, కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆరోపణలు గుప్పిస్తున్నాయి. ఈ చార్జీ షీట్లపై కాంగ్రెస్ నాయకులు తమ స్టైల్‌లో సమాధానాలు ఇస్తున్నారు. ముఖ్యంగా, కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి ఈ విషయంపై ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్, బీజేపీ నాయకుల చార్జీషీట్లపై రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ … కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ ఏడాది కాలంలో అలుపెరగని విమర్శలు గుప్పిస్తోందని ఆరోపించారు. అంతేకాకుండా.. “వంచన కేసీఆర్ కుటుంబం పేటెంట్. వారు తప్ప వంచన ఎవరూ చేయలేరు” అని తీవ్రంగా విమర్శించారు రామ్మోహన్ రెడ్డి. అంతేకాకుండా.. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కుటుంబ వంచన నుంచి ప్రజలను విముక్తి కల్పించామని రామ్మోహన్ రెడ్డి అన్నారు. చెట్టుపేరు చెప్పి కాయలమ్ముకునే పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

ఇక, 2014 నుండి 2024 వరకు బీఆర్ఎస్ తన హామీలను అమలు చేయకపోవడంపై విమర్శలు చేస్తూ… “తెలంగాణ సెంటిమెంట్” పేరుతో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను తప్పించుకుని, చార్జీషీట్లు విడుదల చేస్తుందని మండిపడ్డారు. ఆయన ఈ చర్యను “దొంగే దొంగ” అన్నట్లుగా ఉందని అభిప్రాయపడ్డారు.

“మేము బీఆర్ఎస్ భాషలోనే సమాధానం ఇవ్వగలమని, కానీ మాకు సంస్కారం అడ్డొస్తుందని” రామ్మోహన్ రెడ్డి అన్నారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మా పార్టీ చేతలే కాదు, మాటల కన్నా కట్టుబాట్లు ముఖ్యంగా విశ్వసించేది” అని చెప్పి, కాంగ్రెస్ పార్టీ యొక్క సంకల్పం, రాష్ట్రాన్ని సురాష్ట్రంగా మార్చే దిశగా ఉందని స్పష్టం చేశారు రామ్మోహన్ రెడ్డి.

బీఆర్ఎస్ నాయకులు, తమ హామీలను అమలు చేయకుండా, ఇప్పుడు చార్జీషీట్లు విడుదల చేస్తున్నారని ఈ చర్యపై విమర్శలు చేశారు. అదే సమయంలో, బీజేపీ పై కూడా విమర్శలు చేస్తూ, “వారు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా గాలి మాటలు చెబుతున్నారు” అని అన్నారు. 2014, 2019, 2024 ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసిన విధానంపై స్పష్టత ఇవ్వాలని, తమకు ఇది సంస్కారం అని, వారందరూ రాజకీయాలపై ఆత్మపరిశీలన చేసుకోవాలని రామ్మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read Also : Syria : తారాస్థాయికి సిరియాలో అంతర్యుద్ధం.. మరణాల మధ్య విద్యార్థులు చదువులు..


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • chargesheets
  • Congress Leadership
  • Congress Media Committee
  • Criticisms
  • KCR family
  • Political Criticism
  • Political Party Statements
  • Rammoohan Reddy Comments
  • Sama Rammohan Reddy
  • telangana congress
  • telangana politics
  • telangana sentiment

Related News

Harish Rao is in touch with the BJP: Revanth Reddy

Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద

  • Kavitha warns the Congress government.

    Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్

  • CM Revanth Reddy issues a strong warning to KTR.

    Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

  • Bhagyashri Borse: ఎట్టకేలకు హిట్ కొట్టిన అందాల భామ భాగ్యశ్రీ బోర్సే

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd