HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Rahul Gandhi Comments On Karnataka Ordinance

Rahul Gandhi : కర్ణాటక ఆర్డినెన్స్‌పై రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు

కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి శాసన పరంగా మద్దతుగా నిలిచే తొలి చర్యలలో ఒకటిగా ఆయన అభిప్రాయపడ్డారు.

  • Author : Latha Suma Date : 29-05-2025 - 12:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Rahul Gandhi comments on Karnataka Ordinance
Rahul Gandhi comments on Karnataka Ordinance

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమం పట్ల కీలక వ్యాఖ్యలు చేశారు. ఆన్‌లైన్ వేదికల ద్వారా పనిచేస్తున్న గిగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆయన తన ఆవేదనను వెల్లడించారు. భారత్ జోడో యాత్ర సందర్భంగా తమను కలిసిన గిగ్ వర్కర్లు చెప్పిన మాటలు ఇప్పటికీ తన మనసులో ముద్రగా నిలిచాయన్నారు. “మాకు రేటింగ్‌లు కాదు, హక్కులు కావాలి. మేము మనుషులమే, బానిసలం కాదు” అనే వారి ఆవేదనను గుర్తు చేస్తూ, తాను తన ఎక్స్ ఖాతా ద్వారా స్పందించారు. ఈ నేపథ్యంలో, కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం గిగ్ కార్మికుల హక్కులను పరిరక్షించేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను రాహుల్ చారిత్రాత్మక ముందడుగుగా అభివర్ణించారు. ఇది దేశంలో గిగ్ కార్మికుల సంక్షేమానికి శాసన పరంగా మద్దతుగా నిలిచే తొలి చర్యలలో ఒకటిగా ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతికూల వాతావరణం మధ్య రోజూ వేలాది గిగ్ కార్మికులు ప్రజలకు ఆహారం, నిత్యావసర వస్తువులు సరఫరా చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అయినా కూడా, వీరికి తగిన గుర్తింపు లేకపోవడం, భద్రత లేనిది, హక్కులు కాదని విమర్శించారు.

Read Also: CM Chandrababu: నేడు ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. పూర్తి షెడ్యూల్ ఇదే!

గిగ్ వర్కర్లు ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యలను వివరించిన రాహుల్ గాంధీ. “యాప్‌ల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా బ్లాక్ చేయడం, అనారోగ్య కారణంగా సెలవులు మంజూరు కాకపోవడం, ఆదాయాలు పారదర్శకత లేని అల్గోరిథమ్స్ ఆధారంగా నిర్ణయించబడటం” వంటి అంశాలను ముఖ్యంగా ప్రస్తావించారు. ఈ సమస్యలకు పరిష్కారంగా కర్ణాటక ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ద్వారా గిగ్ వర్కర్లకు సామాజిక భద్రత, న్యాయమైన ఒప్పందాలు, చెల్లింపులలో పారదర్శకత, ఏకపక్షంగా తొలగింపుల నుంచి రక్షణ లభించనున్నట్లు తెలిపారు. రాహుల్ గాంధీ టెక్నాలజీ ప్రజలకు సేవ చేయాల్సినదని, కార్మిక హక్కులను పరిగణనలోకి తీసుకునే విధంగా వ్యవస్థలను మలచుకోవాలని సూచించారు. ఈ దిశగా రాజస్థాన్ మరియు కర్ణాటక రాష్ట్రాలు దేశానికి మార్గదర్శకంగా నిలుస్తున్నాయని కొనియాడారు. త్వరలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ విధానాన్ని అనుసరిస్తుందని సూచించారు. గిగ్ మరియు ప్లాట్‌ఫార్మ్ ఆధారిత ఉపాధి అవకాశాలు నూతన అవకాశాలను సృష్టిస్తున్నప్పటికీ, అవి సంప్రదాయ కార్మిక సంబంధాలను మార్చేస్తున్నాయని, ఈ మార్పులో కార్మికుల హక్కులు కేంద్రీకృతంగా ఉండాలని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ శ్రమజీవుల సంక్షేమాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఈ విధానాన్ని దేశవ్యాప్తంగా విస్తరించేందుకు కృషి చేస్తుందన్నారు.

Read Also: Kavitha : ఎంపీగా పోటీ చేస్తే పార్టీలోనే కుట్రపూరితంగా ఓడించారు : కవిత


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Gig Workers
  • karnataka
  • ordinance
  • Platform Workers
  • rahul gandhi
  • Social Securit

Related News

Rahul Kerala

Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

కేరళ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేసింది. ఇందులో భాగంగా ఢిల్లీలో జరిగిన కేంద్ర ఎన్నికల కమిటీ (CEC) సమావేశం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది

  • Pm Modi Hits Back At Rahul

    Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • Wife Kills Husband

    Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

  • Karnataka to ban social media use for children under 16

    16 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్‌ మీడియా నిషేధం: కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd