HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Problems Cant Be Solved On Battlefield Pm Modi In Poland

PM Modi : యుద్ధక్షేత్రంలో సమస్యలకు పరిష్కారం లభించదు: పోలండ్‌లో ప్రధాని మోడీ

పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

  • By Latha Suma Published Date - 05:47 PM, Thu - 22 August 24
  • daily-hunt
Problems can't be solved on battlefield: PM Modi in Poland
PM Modi will participate in the election campaign in Jammu kashmir on 14th

PM Modi: ప్రధాని మోడీ ఉక్రెయిన్‌ (Ukraine)తో పాటు పశ్చిమాసియాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ..సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. యుద్ధక్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన.. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి, స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతామన్నారు. పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయిన తర్వాత మీడియాకు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు.

We’re now on WhatsApp. Click to Join.

”ఉక్రెయిన్‌, పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధాలు మనందరికీ తీవ్ర ఆందోళనకరం. యుద్ధక్షేత్రంలో ఏ సమస్యకు పరిష్కారం దొరకదని భారత్‌ బలంగా విశ్వసిస్తుంది. ఏ సంక్షోభంలోనైనా సామాన్యులు ప్రాణాలు కోల్పోవడం యావత్‌ మానవాళికే అతిపెద్ద సవాల్‌. చర్చలు, దౌత్యంతోనే శాంతి, స్థిరత్వానికి మేం మద్దతిస్తాం. ఇందుకోసం మిత్రదేశాలతో కలిసి అన్నిరకాల మద్దతు ఇచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉంది” అని ప్రధాని మోడీ పేర్కొన్నారు.

రెండు రోజుల పర్యటనలో భాగంగా పోలండ్‌ వెళ్లిన ప్రధాని మోడీ ఆ దేశ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చించామని.. ఇరుదేశాలు తమ సంబంధాలను వ్యూహాత్మక భాగస్వామ్యంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నామన్నారు. రష్యా దండయాత్ర సమయంలో భారత విద్యార్థుల తరలింపునకు పోలండ్‌ ఎంతో సహకరించిందని, అందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. అంతకుముందు అక్కడి ప్రధానమంత్రి కార్యాలయం ‘ఛాన్స్‌లరీ’లో ప్రధాని మోడీకి ఘనస్వాగతం లభించింది.

Read Also: Nutrition : శరీరంలో ఈ పోషకాహారం లేకపోవడం వల్ల తరచుగా ఇన్ఫెక్షన్లు వస్తాయి..!

”భారత్‌-పోలండ్‌ భాగస్వామ్యంలో సరికొత్త మైలురాయి. వార్సాలోని ఫెడరల్‌ ఛాన్స్‌లరీలో భారత ప్రధానికి పోలండ్‌ ప్రధాని డొనాల్డ్‌ టస్క్‌ ఘనస్వాగతం పలికారు. 45 ఏళ్ల అనంతరం భారత ప్రధాని పోలండ్‌లో చేపట్టిన ఈ పర్యటన ఇరుదేశాల భాగస్వామ్యానికి సరికొత్త ఊపునిస్తుంది” అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్‌ జైశ్వాల్‌ పేర్కొన్నారు. ఈ విషయంపై పోలండ్‌ ప్రధాని టస్క్‌ స్పందిస్తూ.. ” చివరకు, 45ఏళ్ల అనంతరం.. భారత ప్రధానిని వార్సాలో చూడటం సంతోషంగా ఉంది” అని ఎక్స్‌లో పోస్టు చేశారు. భేటీలో భాగంగా పలు అంశాలపై ఇరువురు చర్చలు జరిపారు. ఆ తర్వాత పోలండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ సెబాస్టియన్‌ దుడాతోనూ మోడీ భేటీ కానున్నారు.

ప్రధాని మోడీ పోలండ్‌ పర్యటనలో భాగంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌.. ఆ దేశ విదేశీ వ్యవహారాల మంత్రి రాడోస్లావ్‌ సికోర్క్సీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌ సంక్షోభం, ఇండో-పసిఫిక్‌లో ద్వైపాక్షిక సహకారంపై చర్చించినట్లు ఎస్‌.జైశంకర్‌ పేర్కొన్నారు.

Read Also: Fake GST Bills : ఫేక్ జీఎస్టీ బిల్లులతో మాయ.. వాటిని ఇలా గుర్తించండి

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Battlefield
  • pm modi
  • poland
  • ukraine

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Minister Lokesh meets Prime Minister Modi..these are the topics discussed..!

    Lokesh Delhi Tour : ప్రధాని మోడీతో మంత్రి లోకేష్ భేటీ..చర్చించిన అంశాలివే..!

  • New GST

    New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

  • Small chip made in India has the power to change the world: PM Modi

    PM Modi : భారత్ తయారు చేసిన చిన్న చిప్ ప్రపంచాన్ని మార్చే శక్తి కలిగి ఉంది: ప్రధాని మోడీ

  • Trump

    Trump: భార‌త్‌పై మ‌రోసారి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన ట్రంప్‌!

Latest News

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd