HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Pm Modi Inaugurated 103 Amrit Bharat Railway Stations Key Stations In Telangana And Ap

PM Modi : ప్రధాని మోడీ చేతుల మీదుగా 103 అమృత్‌ భారత్‌ రైల్వే స్టేషన్ల ప్రారంభం.. తెలంగాణ, ఏపీలో కీలక స్టేషన్లు

తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్‌ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నూతన రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

  • By Latha Suma Published Date - 11:41 AM, Thu - 22 May 25
  • daily-hunt
PM Modi inaugurated 103 Amrit Bharat Railway stations.. Key stations in Telangana and AP
PM Modi inaugurated 103 Amrit Bharat Railway stations.. Key stations in Telangana and AP

PM Modi : అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లను ఆధునీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో, ప్రధాని నరేంద్ర మోడీ రాజస్థాన్‌ రాష్ట్రంలోని బికనీర్‌ నుంచి వర్చువల్‌ విధానంలో 18 రాష్ట్రాల్లో మోడర్న్‌గా అభివృద్ధి చేసిన 103 రైల్వే స్టేషన్లను జాతికి అంకితమిచ్చారు. ఈ కార్యక్రమం దేశ రవాణా రంగంలో మైలురాయిగా నిలిచింది. ఈ పథకం కింద వివిధ రాష్ట్రాల్లోని ముఖ్యమైన రైల్వే స్టేషన్లను ఆధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. వీటిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బేగంపేట, కరీంనగర్, వరంగల్‌ స్టేషన్లు ఉన్నత ప్రమాణాలతో తీర్చిదిద్దబడ్డాయి. అదేవిధంగా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని సూళ్లూరుపేట రైల్వే స్టేషన్‌ కూడా ఈ ప్రారంభోత్సవంలో భాగంగా నూతన రూపంలో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.

Read Also: Miss World Contestants : శిల్పారామంలో మిస్‌ వరల్డ్‌ కంటెస్టెంట్‌ల సందడి

ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీ, అభివృద్ధి చెందిన స్టేషన్లతో ప్రయాణికులకు సౌకర్యాలు పెరుగుతాయని, రైల్వే సేవల్లో నాణ్యత పెరిగి, భవిష్యత్తులో ప్రయాణ అనుభవం మరింత సమర్థవంతంగా మారుతుందని పేర్కొన్నారు. ఈ స్టేషన్లను కొత్త రూపంలో చూడగానే ప్రజలు గర్వపడేలా చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం కొన్ని స్కూల్ విద్యార్థులతో వర్చువల్‌ మార్గంలో సంభాషించారు. దేశ భవిష్యత్తు వారేనని, వారు కొత్త ఆవిష్కరణలకు ప్రేరణ కావాలని ప్రధాని సూచించారు. విద్యార్థులు దేశాభివృద్ధిలో భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. విద్యపై వారి అభిప్రాయాలు తెలుసుకుని, వారిని ఉత్సాహపరిచారు.

అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకం కింద దేశవ్యాప్తంగా 1,300 పైగా స్టేషన్లను నూతనంగా అభివృద్ధి చేయాలని భారత రైల్వేలు లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా మొదటి విడతగా ఈ 103 స్టేషన్లు ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. వీటిని మౌలిక సదుపాయాల కలయికతో, ఆధునిక రూపకల్పనలతో, గ్రీన్‌ ఎనర్జీ వినియోగంతో తీర్చిదిద్దడం విశేషం. ఈ కార్యక్రమం ద్వారా రైల్వే వ్యవస్థను ఆధునీకరించడం కాకుండా, ప్రజల ప్రయాణ అనుభవాన్ని మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం గట్టి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా చిన్న పట్టణాల రైల్వే స్టేషన్లను సైతం అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ ప్రాంతాల ప్రయాణికులకు సౌకర్యవంతమైన సేవలు అందించేలా ఈ పథకం రూపొందించబడింది.

Read Also: Street Vendors : వీధి వ్యాపారులకు క్రెడిట్‌ కార్డులు.. రూ.80వేల దాకా క్రెడిట్ లిమిట్ ?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 103 Amrit Bharat Railway Stations
  • Amrit Bharat Station Scheme
  • ap
  • pm modi
  • telangana

Related News

Tensions in India-US relations: Modi absent from UN meetings!

PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

అందులో భాగంగా, సెప్టెంబరు 9 నుంచి ప్రారంభం కానున్న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సమావేశాలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ హాజరుకాకపోవచ్చని సమాచారం. ఇది UNGA 80వ సెషన్‌గా జరుగుతోంది. ఈ సమావేశాల్లో 23 నుంచి 29 తేదీల మధ్య ప్రపంచ దేశాధినేతల అత్యున్నత స్థాయి చర్చలు జరుగుతాయి.

  • Ap Egg

    Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Heavy Rains

    Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

Latest News

  • Ghaati : అనుష్క ‘ఘాటి’కి షాకింగ్ కలెక్షన్స్!

  • India – US : దిగొచ్చిన ట్రంప్..ఇక భారత్-అమెరికా వైరం ముగిసినట్లేనా?

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd