Trending
-
CM Revanth Reddy : రాహుల్, ఖర్గేతో రేవంత్ భేటీ.. మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ..!
ఇప్పటికే ఉన్న కొంతమంది మంత్రుల శాఖల్లో మార్పులు చేర్పులపై కూడా ఈ సమావేశాల్లో ముఖ్యంగా చర్చించారని సమాచారం. తద్వారా రాష్ట్ర పరిపాలన మరింత సమర్థవంతంగా సాగేందుకు అవసరమైన మార్గదర్శకాలు ఏఐసీసీ నేతలు అందించినట్లు తెలుస్తోంది.
Date : 10-06-2025 - 3:25 IST -
Vidyarthi Mitra : ఏపీలో విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీకి సిద్ధం…
ఈ విద్యార్థి మిత్ర కిట్లో ప్రతి విద్యార్థికి పాఠ్య పుస్తకాలు, వర్క్బుక్లు, నోట్బుక్లు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ, మూడు జతల ఏకరూప దుస్తులు, బూట్లు, బ్యాగ్, రెండు జతల సాక్సులు, బెల్ట్ లాంటి అవసరమైన వస్తువులు ఉంటాయి. మొదటి తరగతి విద్యార్థులకు ప్రత్యేకంగా పిక్టోరియల్ డిక్షనరీను కూడా అందిస్తారు.
Date : 10-06-2025 - 3:00 IST -
Kommineni Srinivasarao : కొమ్మినేని శ్రీనివాసరావుకి 14 రోజుల రిమాండ్
కోర్టు ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అనంతరం ఆయన్ని గుంటూరు జిల్లా ప్రధాన జైలుకు తరలించారు. ఈ కేసు నేపథ్యంలో పోలీసుల విచారణ ముమ్మరంగా సాగుతున్నది. గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల్లో ప్రసారమైన కొన్ని వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి.
Date : 10-06-2025 - 2:27 IST -
Polavaram Project : షెడ్యూల్ ప్రకారం పోలవరం పనులు: మంత్రి నిమ్మల రామానాయుడు
పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పటికే మూడు సార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రాజెక్టు పనులను నిర్దిష్ట లక్ష్యాలతో ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. 2027 సంవత్సరం చివరి నాటికి పోలవరం పూర్తి చేసే విధంగా ప్రణాళిక రచించాం.
Date : 10-06-2025 - 1:51 IST -
NCW : కృష్ణంరాజు వ్యాఖ్యలను సుమోటోగా తీసుకున్న జాతీయ మహిళా కమిషన్
కమిషన్ చైర్పర్సన్ విజయ రహత్కర్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి కఠినమైన లేఖ రాశారు. కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల పరువును తక్కువ చేస్తాయని, అవి పూర్తి స్థాయిలో అసభ్యంగా ఉన్నాయని కమిషన్ అభిప్రాయపడింది.
Date : 10-06-2025 - 1:02 IST -
Yoga Day : ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా : చిరంజీవి
సోషల్ మీడియా వేదికగా "ఎక్స్" లో పోస్ట్ చేస్తూ చిరంజీవి స్పందించారు. ఫోకస్ వల్ల ఫిట్నెస్ పెరుగుతుంది. యోగా చేస్తే ఈ రెండూ వస్తాయి. యెగా డేను సెలబ్రేట్ చేసుకుందాం. ప్రపంచానికి మన దేశం ఇచ్చిన బహుమతి యోగా. ఇది సరిహద్దులు దాటి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. అందరూ కలిసి #IDY2025 ని ఘనంగా జరుపుదాం అని ఆయన పేర్కొన్నారు.
Date : 10-06-2025 - 12:44 IST -
Harish Rao: హైకోర్టులో హరీశ్రావుకు ఊరట
వాదనలు, ఆధారాల ఆధారంగా న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. హరీశ్ రావు అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చినట్టు నిరూపించేందుకు పిటిషనర్ సమర్పించిన ఆధారాలు సరిపోవని, అవి నిర్ధారణకు నొప్పేంతగా లేవని అభిప్రాయపడింది.
Date : 10-06-2025 - 12:18 IST -
Raghurama : సజ్జలపై చర్యలు తీసుకోండి.. డీజీపీకి రఘురామ ఫిర్యాదు
మహిళలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తి ప్రభుత్వ పదవిలో కొనసాగడమే అన్యాయం అని, ఇది రాష్ట్రంలో ఉన్న మహిళలకు తలవంచే అంశంగా అభివర్ణించారు. ఇప్పటికే పలు మహిళా సంఘాలు, సామాజిక సంస్థలు ఈ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేస్తూ ర్యాలీలు, ధర్నాలు నిర్వహిస్తున్నాయి.
Date : 10-06-2025 - 11:56 IST -
Bala Krishna : బాలయ్యకి చంద్రబాబు, లోకేష్ స్పెషల్ విషెస్..
ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తన సోషల్ మీడియా ఖాతాలో బాలకృష్ణకు హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలిపారు. "వెండి తెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను సంపాదించిన మీరు, నిండు నూరేళ్ళూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను" అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Date : 10-06-2025 - 11:17 IST -
ICC Hall Of Fame: ఎంఎస్ ధోనీకి అరుదైన గౌరవం.. ICC హాల్ ఆఫ్ ఫేమ్లో స్థానం!
ఎంఎస్ ధోనీ 2004లో బంగ్లాదేశ్తో జరిగిన ODI మ్యాచ్లో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మూడు సంవత్సరాల తర్వాత అంటే 2007లో ధోనీకి టీమ్ ఇండియా కెప్టెన్సీ లభించింది.
Date : 09-06-2025 - 10:29 IST -
Rahul Gandhi : నరేంద్ర మోడీ పాలనలో మార్పు లేదు.. కేవలం ప్రచారమే: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.
Date : 09-06-2025 - 6:27 IST -
AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి
2025–26 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం తొలి విడతగా విడుదల చేసిన ఈ నిధులను ఉపాధి హామీ పనులకు వినియోగించనుంది. ఈ నిధులను సంబంధిత నిబంధనల ప్రకారం ఖర్చు చేయాల్సిందిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్కు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి.
Date : 09-06-2025 - 5:48 IST -
Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్
మహిళలపై వైసీపీ నేతల దుర్భాషలు, అవమానకర వ్యాఖ్యల పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేసిన లోకేశ్, వైసీపీ నేతలకు మహిళల పట్ల గౌరవం లేదని, వారిని తక్కువగా చూస్తున్న తీరు హేయం అని వ్యాఖ్యానించారు. వారు తల్లి, చెల్లిని గౌరవించని వ్యక్తిని ఆదర్శంగా తీసుకుంటున్నారని భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
Date : 09-06-2025 - 5:38 IST -
Amit Shah : 11 ఏళ్ల మోడీ పాలన స్వర్ణయుగం లాంటిది : అమిత్ షా
మోడీ మూడో హయాంలో దేశం అనేక రంగాల్లో ముందుకు సాగుతుందని, ప్రజాసేవ పట్ల ఆయనకున్న అంకితభావం దేశ అభివృద్ధికి ప్రధాన ఆస్తిగా మారిందని చెప్పారు. ఎక్స్ వేదికగా అభిప్రాయాలు వెల్లడించిన అమిత్ షా, ప్రధాని మోడీ నేతృత్వంలోని గత 11 సంవత్సరాల పాలనను “స్వర్ణయుగం”గా వర్ణించారు.
Date : 09-06-2025 - 5:15 IST -
Bhatti Vikramarka : మహిళల ఉచిత ప్రయాణానికి రూ.182 కోట్లు జీరో టికెట్లు: భట్టి విక్రమార్క
కానీ నిజానికి ప్రభుత్వం ఆర్టీసీకి పూర్తి పరిహారం చెల్లిస్తోంది. ఇప్పటివరకు రూ.6,088 కోట్లు ఆర్టీసీకి ప్రభుత్వం అందించింది. దీంతో ఆర్టీసీ కార్యకలాపాలు గాడిలో పడుతున్నాయి అని తెలిపారు.
Date : 09-06-2025 - 4:49 IST -
CM Chandrababu : రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈలు, సేవారంగానికి పెద్దపీట: సీఎం చంద్రబాబు
సచివాలయం నుంచి వర్చువల్గా స్వర్ణాంధ్ర కార్యాలయాలను ప్రారంభించిన అనంతరం, ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రస్తుతం సేవారంగం ద్వారా రాష్ట్రానికి కేవలం 6.3 శాతం ఆదాయం మాత్రమే వస్తోందని తెలిపారు. ఈ రంగాన్ని విస్తరించడం ద్వారా ఆదాయాన్ని గణనీయంగా పెంచవచ్చన్నారు.
Date : 09-06-2025 - 4:04 IST -
RCB : బెంగళూరు తొక్కిసలాట ఘటన.. హైకోర్టును ఆశ్రయించిన ఆర్సీబీ
ఈ ఘటనపై సమాచార హక్కు కార్యకర్త స్నేహమయి కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ కేసులో RCB యాజమాన్యం, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ DNA ఎంటర్టైన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ (KSCA) సహా పలువురు నిర్వాహకులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
Date : 09-06-2025 - 3:31 IST -
TGSRTC : తెలంగాణ ఆర్టీసీ బస్పాస్ ఛార్జీల పెంపు..నేటి నుంచే అమలు
నేటి నుంచి కొత్త ధరలు అధికారికంగా అమల్లోకి వచ్చాయి. పెరిగిన ఛార్జీలు సామాన్య ప్రజలపై భారం మోపేలా ఉన్నాయి. ఆర్టీసీ ప్రకటన మేరకు, బస్ పాస్ ఛార్జీలు సగటున 20 శాతం కంటే ఎక్కువగా పెరిగాయి. ఇప్పటివరకు రూ.1,150కి లభించిన ఆర్డినరీ పాస్ను ఇప్పుడు రూ.1,400కి పెంచారు. అదే విధంగా, మెట్రో ఎక్స్ప్రెస్ పాస్ ధరను రూ.1,300 నుండి రూ.1,600కి మార్చారు.
Date : 09-06-2025 - 2:58 IST -
CM Revanth Reddy : తెలంగాణ మంత్రివర్గ విస్తరణ..శాఖల కేటాయింపుపై చర్చ..!
మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ, కీలక శాఖల బదిలీల అంశంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కొన్ని కీలక శాఖలు ముఖ్యంగా ఆర్థిక శాఖ, పౌర సరఫరాల శాఖల మార్పు చాలా కీలకంగా మారాయి.
Date : 09-06-2025 - 1:17 IST -
Padi kaushik Reddy : పాడి కౌశిక్రెడ్డిపై కేసును కొట్టేసేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరణ
ఈ కేసు 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో చోటుచేసుకుంది. ఆ సమయంలో కౌశిక్రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. ‘‘నన్ను గెలిపించకపోతే కుటుంబంతో పాటు ఆత్మహత్య చేసుకుంటా’’ అని ఆయన చెప్పిన వీడియో క్లిప్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది.
Date : 09-06-2025 - 12:46 IST