Trending
-
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసు..కేసీఆర్, కేటీఆర్ జైలుకు వెళ్లాల్సిందే: కొండా విశ్వేశ్వర్రెడ్డి
విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా, ఫోన్ ట్యాపింగ్ వంటి తీవ్రమైన అక్రమ చర్యలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Date : 27-06-2025 - 5:09 IST -
Hyderabad : హైకోర్టు కీలక తీర్పు.. ఐఏఎంసీకి భూ కేటాయింపులు రద్దు చేసిన న్యాయస్థానం
ప్రైవేట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా విలువైన ప్రభుత్వ భూమిని కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో న్యాయవాదులు కె.రఘునాథ్ రావు, వెంకటరామ్ రెడ్డి తరఫున వాదనలు వినిపించారు.
Date : 27-06-2025 - 4:49 IST -
TGEAPCET : టీజీఈఏపీసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశానికి సంబంధించిన ఈఏపీసెట్ (EAPCET) కౌన్సిలింగ్ షెడ్యూల్ను అధికారికంగా విడుదల చేశారు. తెలంగాణ ఉన్నత విద్యా మండలి మూడు విడతలుగా ఈ ప్రవేశ కౌన్సిలింగ్ను నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
Date : 27-06-2025 - 4:17 IST -
Maoist : మంత్రి సీతక్కకు మావోయిస్టుల హెచ్చరికల లేఖ..!
రాష్ట్ర ప్రభుత్వం ఆదివాసీలపై వివక్ష చూపుతుంటే, గిరిజనుల నేతగా ఉన్న మంత్రి మాత్రం స్పందించకపోవడం పట్ల మావోయిస్టులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు లేఖలో పేర్కొన్నారు. ఈ లేఖలో ముఖ్యంగా ములుగు, కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాల్లో గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు, అధికారులు తీసుకుంటున్న ఆంక్షలు, అటవీ శాఖ దాడుల గురించి వివరంగా రాశారు.
Date : 27-06-2025 - 3:32 IST -
Jagannath Rath Yatra : జగన్నాథ రథయాత్రలో అపశ్రుతి
ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడినట్లు ఆలయ అధికారులు తెలిపారు. వివరాల్లోకి వెళితే, శుక్రవారం ఉదయం 10:15 గంటల సమయంలో రథయాత్ర అహ్మదాబాద్ నగరంలోని ఖాదియా ప్రాంతానికి చేరుకుంది. ఈ సందర్భంలో ఊరేగింపు ముందు భాగంలో నడుస్తున్న మూడు ఏనుగులు హఠాత్తుగా భయభ్రాంతులకు లోనై నియంత్రణ తప్పాయి.
Date : 27-06-2025 - 3:15 IST -
S Jaishankar : ఒక కుటుంబం కోసమే దేశంలో ఎమర్జెన్సీ విధించారు: జైశంకర్
ఏకపక్షంగా, స్వార్ధ ప్రయోజనాల కోసం ఎమర్జెన్సీని విధించిన పార్టీకి ఇది రాజ్యాంగం మీద ప్రేమ ఉంటుందని ఎలా నమ్మగలం? అని జైశంకర్ ప్రశ్నించారు. అధికారాన్ని కాపాడుకోవడమే వారి అసలు లక్ష్యం. ఆ సమయంలో దేశ ప్రజల అభిప్రాయాలు, హక్కులు అన్నీ పక్కన పెట్టి, తమ పదవిని నిలబెట్టుకోవడం కోసమే కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకుంది అని అన్నారు.
Date : 27-06-2025 - 2:59 IST -
Tourism Conclave Program : ప్రతి రంగంలో సంపద సృష్టించాలనేదే నా లక్ష్యం: సీఎం చంద్రబాబు
ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బాబా రామ్దేవ్ పాల్గొనడం గర్వకారణమన్నారు. బాబా రామ్దేవ్ సమాజానికి చేసిన సేవ అపూర్వం. ఆయన్ను రాష్ట్ర పర్యాటక శాఖ సలహాదారుగా నియమించాలని కోరాం అని తెలిపారు. పర్యాటక రంగం రాష్ట్రాభివృద్ధికి కీలకమని సీఎం స్పష్టం చేశారు.
Date : 27-06-2025 - 2:37 IST -
Prashant Kishor : బీహార్ పాలిటిక్స్.. రాహుల్గాంధీకి ప్రశాంత్ కిషోర్ సవాల్
తాజాగా కేంద్రం బీహార్లో అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇది రాష్ట్ర అభివృద్ధికి కీలకమైనదిగా చెబుతున్నారు. ఇటువంటి కీలక సమయంలో ప్రజలకు నిజాలు చెప్పాలంటూ జనసురాజ్ ఉద్యమ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ రాజకీయాల్లో జోరందిస్తున్నారు.
Date : 27-06-2025 - 2:08 IST -
CM Chandrababu : విజయవాడలో ఘనంగా టూరిజం కాన్క్లేవ్ ప్రారంభం
ఈ దిశగా ప్రభుత్వం విజయవాడలో జూన్ 27న ప్రతిష్టాత్మకంగా టూరిజం కాన్క్లేవ్ను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఆయనతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Date : 27-06-2025 - 1:39 IST -
CM Chandrababu : సీఎం చంద్రబాబు బిజీ పర్యటన.. మూడు జిల్లాల్లో అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు
పాలనలో వేగం పెంచుతూ అభివృద్ధి అజెండాను ముందుకు నడిపేందుకు ఈ పర్యటనలోని ప్రతి కార్యక్రమాన్ని ఆయన లక్ష్యపూర్వకంగా ప్రణాళికాబద్ధంగా సిద్ధం చేశారు.
Date : 27-06-2025 - 11:22 IST -
Gold Prices: నేటి బంగారం, వెండి ధరలివే.. తగ్గాయా? పెరిగాయా?
బంగారం- వెండి ధరలు రోజువారీ ప్రాతిపదికన నిర్ణయించబడతాయి. అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులతో పాటు ఎక్స్ఛేంజ్ రేట్, డాలర్ విలువలో హెచ్చుతగ్గులు, క్రూడ్ ఆయిల్ వంటి అంశాలు బంగారం-వెండి ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి.
Date : 27-06-2025 - 11:22 IST -
Telangana : నూతన సంస్కరణల దిశగా ప్రభుత్వం.. డిజిటల్ రూపంలోకి కేబినెట్ ఫైల్స్
పరిపాలనా వ్యవస్థను మరింత పారదర్శకంగా, వేగవంతంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దేందుకు కీలక సంస్కరణలు అమలవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యంగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశాల (కేబినెట్ మీటింగ్లు) నిర్వహణ విధానాన్ని సమూలంగా మార్చుతున్నారు.
Date : 27-06-2025 - 11:09 IST -
Election commission : ఎన్నికల్లో పోటీ చేయని పార్టీలపై ఎన్నికల సంఘం కొరడా..345 పార్టీల డీలిస్ట్కు సిద్ధం
ఈ పార్టీల కార్యాలయాలు ఏ రాష్ట్రంలోనూ కనిపించకపోవడం, కార్యకలాపాల లేమి, ఎటువంటి ప్రజాప్రాతినిధ్యం లేకపోవడం వంటి కారణాలతో ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు ఈసీ ప్రకటించింది.
Date : 26-06-2025 - 6:52 IST -
CM Chandrababu : గంజాయి బ్యాచ్కు సహకరించిన వారికి గుణపాఠం : సీఎం చంద్రబాబు
గురువారం గుంటూరులో నిర్వహించిన యాంటీ నార్కోటిక్స్ డే వాక్థాన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, అక్కడ సభలో స్పందిస్తూ, గతంలో డ్రగ్స్కు వ్యతిరేకంగా తన ప్రభుత్వం పోరాడినందుకు టీడీపీ కార్యాలయంపై దాడులు జరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు.
Date : 26-06-2025 - 6:23 IST -
Tulbul project : పాక్కు అడ్డుకట్ట..తుల్బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణపై కేంద్రం యోచన..!
ఈ నిర్ణయం వల్ల ఇప్పటికే పాకిస్థాన్లో నీటి కొరత మొదలైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో భారత్ పశ్చిమ నదుల నీటిని మరింతగా సద్వినియోగం చేసుకోవాలని తలంపుతో కొన్ని ప్రాజెక్టులను తిరిగి ముందుకు తీసుకురావడానికి సిద్ధమవుతోంది.
Date : 26-06-2025 - 5:40 IST -
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్కు ‘స్పేస్ పాలసీ 4.0’ తో నూతన దిశ : సీఎం చంద్రబాబు
ఈ సందర్భంగా పాలసీ లక్ష్యాలు, పెట్టుబడి అవకాశాలు, ఉపాధి సృష్టిపై ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేశారు. ఈ కొత్త స్పేస్ పాలసీ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలోకి రాబట్టడమే లక్ష్యంగా ఉందని సీఎం తెలిపారు.
Date : 26-06-2025 - 5:22 IST -
Amaravati : అమరావతిలో ఇంటిగ్రేటెడ్ రాష్ట్ర సచివాలయం, హెచ్ఓడీ టవర్ల నిర్మాణానికి టెండర్లు ఖరారు
ఆయా సంస్థలకు బిడ్లు మంజూరు చేస్తూ సంబంధిత ఉత్తర్వులు జారీ చేసింది. ఇంటిగ్రేటెడ్ ఆంధ్రప్రదేశ్ సచివాలయం ప్రాంతంలో మూడు భాగాలుగా విభజించి పనులు అప్పగించబడ్డాయి. ఇందులో భాగంగా జీఏడీ (GAD) టవర్ నిర్మాణానికి ఎన్సీసీ లిమిటెడ్ సంస్థకు కాంట్రాక్ట్ లభించింది.
Date : 26-06-2025 - 4:59 IST -
ACB searches : రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ కార్యాలయాల్లో ఏసీబీ సోదాలు
అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. హైదరాబాద్ నగరంలోని ఉప్పల్, తిరుమలగిరి, మన్నెగూడ వంటి ప్రాంతాల్లో ఉన్న RTA కార్యాలయాల్లో ఏసీబీ బృందాలు విస్తృత తనిఖీలు చేపట్టాయి. అధికారులు కార్యాలయాల్లోని రికార్డులు, లావాదేవీల పత్రాలు, కంప్యూటర్లు, ఫైల్స్ తదితర కీలక సమాచారాన్ని తనిఖీ చేస్తున్నారు.
Date : 26-06-2025 - 4:49 IST -
Justice B.R. Gavai : రాజ్యాంగ విలువలకు న్యాయమూర్తులు సంరక్షకులు: సీజేఐ
Justice B.R. Gavai : పౌరుల హక్కులు, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడే బాధ్యత న్యాయమూర్తులపై ఉందని, తీర్పులు వెలువరించేటప్పుడు వారికి స్వతంత్రంగా ఆలోచించే స్వేచ్ఛ ఉండాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బి.ఆర్. గవాయ్ స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని అమరావతిలో జరిగిన సన్మాన సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తీర్పులపై ప్రజల అభిప్రాయాలు, విమర్శలు న్యాయ నిర్ణయాలపై ప
Date : 26-06-2025 - 1:57 IST -
Shubhanshu Shukla : నేను ఒంటరి కాను.. కోట్లాది మంది భారతీయులు నాకు తోడు..అంతరిక్షం నుంచి శుభాంశు శుక్లా లైవ్కాల్
ఇక్కడ ఉన్న ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను. నా భుజంపై భారత త్రివర్ణ పతాకం ఉంది. అది చూస్తే, నేను ఒంటరిగా రాలేదన్న భావన కలుగుతోంది. కోట్లాది మంది భారతీయుల ఆశలు నా వెంట ఉన్నాయి. ఈ చిన్న అడుగు నాది కావచ్చు, కానీ ఇది భారత మానవ అంతరిక్ష ప్రయాణాల దిశగా వున్న ఒక గొప్ప ముందడుగు అని భావోద్వేగంగా మాట్లాడారు.
Date : 26-06-2025 - 1:29 IST