HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >There Is No Change In Narendra Modis Rule Just Propaganda Rahul Gandhi

Rahul Gandhi : నరేంద్ర మోడీ పాలనలో మార్పు లేదు.. కేవలం ప్రచారమే: రాహుల్‌ గాంధీ

మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్‌ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

  • Author : Latha Suma Date : 09-06-2025 - 6:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
There is no change in Narendra Modi's rule..just propaganda: Rahul Gandhi
There is no change in Narendra Modi's rule..just propaganda: Rahul Gandhi

Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజల సంక్షేమంపై కన్నెత్తి చూడకుండా, కేవలం ప్రచారంపై దృష్టి పెట్టిందని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో వాస్తవ సమస్యలపై స్పందించకుండా, 2047 కలలపై మాత్రమే దృష్టి పెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్‌ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Read Also: AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి

ఠానే జిల్లా ముంబ్రా దివా స్టేషన్ల మధ్య రద్దీగా ఉన్న లోకల్‌ రైలు నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోడీ ప్రభుత్వం పదకొండేళ్లు పూర్తి చేసుకున్న వేళ, ఇలాంటి వార్తలు దేశంలోని అసలైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. భారతీయ రైల్వేలు కోట్లాది మంది జీవనాధారంగా ఉండగా, ఇవే ఇప్పుడు అప్రమత్తత, రద్దీ, గందరగోళానికి సంకేతంగా మారాయి” అని అన్నారు. అలాగేడఈ దేశాన్ని నడిపించాలంటే కేవలం కలలు కాదు, భూమి మీద వాస్తవాలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నేటి సమస్యలపై స్పందించకుండా, దూర భవిష్యత్తు కలలతో ప్రజలను మభ్యపెడుతోంది అని రాహుల్ గాంధీ విమర్శించారు.

ఇలాంటి ఘోర సంఘటనలపై ప్రభుత్వ ప్రతిస్పందనలేమి నిరాశకు గురిచేస్తోందని, నరేంద్ర మోడీ పాలనలో జవాబుదారీతనం కనపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవికతను గుర్తించకుండా ప్రచారమే నడిపితే, ప్రజల నమ్మకం కోల్పోతారు అని హెచ్చరించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలన్నీ మోడీ పాలనపై కొనసాగుతున్న విమర్శల్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్‌

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • Modi government rule
  • Narendra Modi leadership
  • rahul gandhi

Related News

Trump's harsh comments on India.. Is that why Modi is silent?: Rahul Gandhi asks

Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా

    Latest News

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    Trending News

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd