HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >There Is No Change In Narendra Modis Rule Just Propaganda Rahul Gandhi

Rahul Gandhi : నరేంద్ర మోడీ పాలనలో మార్పు లేదు.. కేవలం ప్రచారమే: రాహుల్‌ గాంధీ

మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్‌ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

  • Author : Latha Suma Date : 09-06-2025 - 6:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
There is no change in Narendra Modi's rule..just propaganda: Rahul Gandhi
There is no change in Narendra Modi's rule..just propaganda: Rahul Gandhi

Rahul Gandhi : ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత 11 ఏళ్లుగా ప్రజల సంక్షేమంపై కన్నెత్తి చూడకుండా, కేవలం ప్రచారంపై దృష్టి పెట్టిందని కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో వాస్తవ సమస్యలపై స్పందించకుండా, 2047 కలలపై మాత్రమే దృష్టి పెట్టడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా మహారాష్ట్ర ఠానే జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం అనంతరం రాహుల్ గాంధీ తన అధికారిక ‘ఎక్స్‌’ ఖాతా ద్వారా స్పందిస్తూ, మోడీ సర్కార్‌ పాలనలో విఫలతలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ధ్వజమెత్తారు. దేశంలో నిత్యం ఎదురవుతున్న బీభత్స ఘటనలు ప్రజల భద్రతపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వెల్లడిస్తున్నాయని వ్యాఖ్యానించారు.

Read Also: AP Government : ఉపాధి హామీ పనుల కోసం రూ. 176.35 కోట్ల విడుదలకు అనుమతి

ఠానే జిల్లా ముంబ్రా దివా స్టేషన్ల మధ్య రద్దీగా ఉన్న లోకల్‌ రైలు నుంచి ప్రయాణికులు జారిపడి ఐదుగురు మృతి చెందారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోడీ ప్రభుత్వం పదకొండేళ్లు పూర్తి చేసుకున్న వేళ, ఇలాంటి వార్తలు దేశంలోని అసలైన వాస్తవాన్ని చూపిస్తున్నాయి. భారతీయ రైల్వేలు కోట్లాది మంది జీవనాధారంగా ఉండగా, ఇవే ఇప్పుడు అప్రమత్తత, రద్దీ, గందరగోళానికి సంకేతంగా మారాయి” అని అన్నారు. అలాగేడఈ దేశాన్ని నడిపించాలంటే కేవలం కలలు కాదు, భూమి మీద వాస్తవాలను కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల సమస్యలపైనే దృష్టి పెట్టాలి. కానీ ఈ ప్రభుత్వం మాత్రం నేటి సమస్యలపై స్పందించకుండా, దూర భవిష్యత్తు కలలతో ప్రజలను మభ్యపెడుతోంది అని రాహుల్ గాంధీ విమర్శించారు.

ఇలాంటి ఘోర సంఘటనలపై ప్రభుత్వ ప్రతిస్పందనలేమి నిరాశకు గురిచేస్తోందని, నరేంద్ర మోడీ పాలనలో జవాబుదారీతనం కనపడడం లేదని ఆయన స్పష్టం చేశారు. వాస్తవికతను గుర్తించకుండా ప్రచారమే నడిపితే, ప్రజల నమ్మకం కోల్పోతారు అని హెచ్చరించారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ వ్యాఖ్యలన్నీ మోడీ పాలనపై కొనసాగుతున్న విమర్శల్ని మరింత ఉద్ధృతం చేస్తున్నాయి. రాహుల్ గాంధీ వ్యాఖ్యలు ప్రస్తుత రాజకీయ వాతావరణంలో చర్చనీయాంశంగా మారాయి.

Read Also: Nara Lokesh : వైసీపీ నేతలకు మహిళలంటే ఎందుకంత చిన్నచూపు?: మంత్రి లోకేశ్‌

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • Modi government rule
  • Narendra Modi leadership
  • rahul gandhi

Related News

Esic Hospital

తెలంగాణలో మరో ESIC హాస్పిటల్‌.. గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం

Esic Hospital : తెలంగాణలోని కార్మికులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. శంషాబాద్ పరిసరాల్లోని పారిశ్రామిక కార్మికుల కోసం 100 పడకల ఈఎస్‌ఐ ఆసుపత్రి ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రంగారెడ్డి జిల్లా పెద్ద గోల్కొండ వద్ద రూ. 16.12 కోట్ల విలువైన భూసేకరణకు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల జిల్లాలోని 1.32 లక్షల మంది బీమా క

  • Sonia- Rahul Gandhi

    నేషనల్ హెరాల్డ్ కేసు.. సోనియా, రాహుల్ గాంధీలకు ఊరట!

  • Vote Chori Rally

    Vote Chori : ‘ఓట్ చోరీ’పై ఈరోజు కాంగ్రెస్ మెగా ర్యాలీ

  • Cm Revanth Messi

    Messi & Revanth Match : ఇది మరిచిపోలేని క్షణం – రేవంత్ రెడ్డి

  • Messi Mania

    Messi Mania: నేడు మెస్సీతో సీఎం రేవంత్ ఫుట్ బాల్ మ్యాచ్‌.. ఢిల్లీ నుంచి హైద‌రాబాద్‌కు రాహుల్ గాంధీ రాక‌!

Latest News

  • జగన్‌కు షాక్.. టీడీపీలోకి వైసీపీ కీలక నేత

  • గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు ఓటరు పై కాసుల వర్షం

  • భార‌త్‌- సౌతాఫ్రికా మ్యాచ్ ర‌ద్దు.. కార‌ణ‌మిదే?!

  • ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ నిమోనియా.. సంకేతాలివే!?

  • మీరు ఆధార్ కార్డును ఆన్‌లైన్‌లో స్వయంగా అప్డేట్ చేసుకోండిలా!

Trending News

    • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం.. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ సంచలన తీర్పు

    • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd