HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Operation Sindoor 100 Terrorists Killed Rajnath Singh

Operation Sindoor : ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్‌ సింగ్‌

ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్‌ లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

  • By Latha Suma Published Date - 01:38 PM, Thu - 8 May 25
  • daily-hunt
'Operation Sindoor'.. 100 terrorists killed: Rajnath Singh
'Operation Sindoor'.. 100 terrorists killed: Rajnath Singh

Operation Sindoor : దేశ భద్రత పరంగా కీలకమైన ముందడుగు పడింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సమాచారం ప్రకారం, భారత ఆర్మీ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ ‌లో కనీసం 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం జరిగిన అఖిలపక్ష సమావేశంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ (PoK) సహా పాకిస్తాన్‌ లోని అనేక ఉగ్రవాద స్థావరాలపై భారత భద్రతా బలగాలు ఆకస్మికంగా జరిపిన దాడుల్లో 100 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

Read Also: Who is Sajid Mir : సాజిద్ మీర్ ఎవరు ? పాకిస్తానే చంపింది.. బతికించింది !!

రాజ్‌నాథ్ సింగ్ ప్రకటన ప్రకారం, ఈ ఆపరేషన్ చాలా గోప్యంగా, సమన్వయంగా జరిపారు. శత్రు ప్రాంతాల్లో సుదీర్ఘంగా గూఢచర్యం నిర్వహించిన అనంతరం ఈ దాడులకు పర్మిషన్ ఇవ్వబడింది. సర్జికల్ స్ట్రైక్స్‌కు మించిన స్థాయిలో ఈ ఆపరేషన్ జరిపినట్లు భద్రతా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఉగ్రవాద కార్యకలాపాలకు గట్టి ధాటిగా నిలిచే ఈ చర్యకు అన్ని రాజకీయ పార్టీల నుంచి మద్దతు లభించింది.

ఈ దాడులతో పాక్‌ వ్యతిరేకంగా మండిపోతూ, భారత్‌పై ఎదురు దాడికి సిద్ధమవుతోందన్న సమాచారంతో భారత భద్రతా వ్యవస్థ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాలైన రాజస్థాన్, పంజాబ్‌ల్లో హై అలర్ట్‌ ప్రకటించడంతో పాటు, పోలీసు సిబ్బంది సెలవులు రద్దు చేశారు. ప్రజల రక్షణ దృష్ట్యా బహిరంగ సభలపై నిషేధం విధించారు. ముఖ్యంగా, భారత్-పాక్ సరిహద్దులను పూర్తిగా మూసివేసినట్లు అధికారులు తెలిపారు.

సరిహద్దు ప్రాంతాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, వెంటనే కాల్పులు జరిపేందుకు భద్రతా బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ప్రజలెవ్వరూ పుకారులతో ఆందోళన చెందవద్దని, అధికారిక సమాచారం కోసం మాత్రమే ఎదురుచూడాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. భారత దళాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు కట్టుబడి ఉన్నాయని స్పష్టం చేశారు.

Read Also: Operation Sindoor : భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 100 terrorists killed
  • Defense Minister Rajnath Singh
  • India airstrikes
  • Operation Sindoor

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

    S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

Latest News

  • MP Mithun Reddy : జైలు నుంచి ఎంపీ మిథున్ రెడ్డి విడుదల

  • AI Effect : 2030 కల్లా 99% ఉద్యోగాలు మటాష్!

  • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd