HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >India
  • >Dont Ignore Anti India False Propaganda Center Tells States

Operation Sindoor : భారత వ్యతిరేక తప్పుడు ప్రచారాన్ని ఉపేక్షించొద్దు.. రాష్ట్రాలకు కేంద్రం ఆదేశం

ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేశ భద్రతపై తప్పుడు వార్తలు, అపోహలు సృష్టించే ఖాతాలపై సీరియస్‌గా స్పందించాలని స్పష్టం చేసింది.

  • By Latha Suma Published Date - 12:57 PM, Thu - 8 May 25
  • daily-hunt
Don't ignore anti-India false propaganda.. Center tells states
Don't ignore anti-India false propaganda.. Center tells states

Operation Sindoor : ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతంగా ముగిసిన నేపథ్యంలో, దేశ వ్యతిరేక సోషల్ మీడియా ప్రచారాలపై గట్టి నిఘా పెట్టాలని కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టం చేసింది. మంగళవారం అర్ధరాత్రి సమయంలో భారత సైన్యం పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పాటు పాకిస్థాన్‌ లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో సుమారు 80 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. పహల్గాం దాడికి భారత్ ఇచ్చిన ఇది బలమైన ప్రతీకారం. ఈ దాడుల అనంతరం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అత్యవసర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పలు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో దేశ భద్రతపై తప్పుడు వార్తలు, అపోహలు సృష్టించే ఖాతాలపై సీరియస్‌గా స్పందించాలని స్పష్టం చేసింది.

Read Also: Gold Prices Today: రూ. ల‌క్ష‌కు చేరువ‌లో బంగారం.. వెండి ధ‌ర ఎంతంటే?

దేశవ్యతిరేక ప్రచారాలు దేశంలోని వ్యక్తులు లేదా విదేశాల నుంచి వచ్చినా సరే, సంబంధిత సోషల్ మీడియా ఖాతాలను వెంటనే గుర్తించి బ్లాక్ చేయాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. అదేవిధంగా, సరిహద్దు ప్రాంతాల్లో భద్రతా సంస్థలు, స్థానిక ప్రభుత్వ యంత్రాంగం మధ్య సమాచార బంధాన్ని బలోపేతం చేయాలని సూచించబడింది. ఆపరేషన్‌ సిందూర్‌ అనంతరం పాకిస్తాన్‌ కొన్ని వేదికల ద్వారా తప్పుడు కథనాలు, వక్రీకరణల ద్వారా భారత్‌ను నిందించే ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ, సోషల్ మీడియా వేదికలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలను అరికట్టేందుకు యాక్టివ్‌గా వ్యవహరించాలని ఆదేశించింది. ఇటువంటి ప్రచారాల వల్ల ప్రజల్లో భయాందోళనలు పుట్టే అవకాశం ఉండడంతో, ప్రజలతో సమర్థవంతమైన కమ్యూనికేషన్‌ మెరుగుపర్చాలని హోంశాఖ స్పష్టం చేసింది. జాతీయ భద్రత కోసం అన్ని స్థాయిలలో సమన్వయం అవసరం అని ఈ సందర్భంగా కేంద్రం పునరుద్ఘాటించింది.

Read Also: Ajit Doval : ప్రధాని మోడీతో అజిత్ ధోవల్ భేటీ..సరిహద్దుల్లో పరిస్థితులపై వివరణ..!

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Anti-national propaganda
  • Instructions to States
  • Operation Sindoor
  • social media
  • Union Home Minister Amit Shah

Related News

A new chapter in India's defense system... Negotiations with Russia for the purchase of S-400

S-400 : భారత రక్షణ వ్యవస్థలో కొత్త అధ్యాయం..ఎస్-400 కొనుగోళ్లకు రష్యాతో చర్చలు

ఈ వ్యవస్థల తయారీదారు రోసోబోరోనెక్స్పోర్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న చర్చల గురించి, రష్యా సైనిక-సాంకేతిక సహకార సంస్థ చీఫ్ దిమిత్రి షుగేవ్ స్పష్టం చేశారు. భారతదేశం ఇప్పటికే ఎస్-400 వ్యవస్థలను వినియోగిస్తున్నప్పటికీ, భవిష్యత్తు ముప్పులను దృష్టిలో ఉంచుకుని మరిన్ని యూనిట్లు అవసరమవుతున్నాయని ఆయన చెప్పారు.

  • TikTok re-entering India?.. Speculations are abound with job postings

    TikTok : భారత్‌లోకి టిక్‌టాక్ మళ్లీ ఎంట్రీ?.. ఉద్యోగ నియామకాలతో ఊహాగానాలు వెల్లువ

  • Pakistan has agreed to ceasefire for just 50 weapons: Air Force officer

    Operation Sindoor : 50 ఆయుధాలకే..కాల్పుల విరమణకు దిగివచ్చిన పాక్ : వాయుసేన అధికారి

  • Mahua Moitra

    Mahua Moitra: తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రాపై ఎఫ్‌ఐఆర్ నమోదు!

Latest News

  • SIIMA 2025 : సైమా అవార్డ్స్ లో దుమ్ములేపిన పుష్ప 2 ..అవార్డ్స్ మొత్తం కొట్టేసింది

  • Ganesh Immersion : బై బై గణేశా.. నేడే మహానిమజ్జనం

  • Bomb Threat : ఉలిక్కపడ్డ ముంబయి.. ఫ్రెండ్ మీద కోపంతో ఫేక్‌ ఉగ్ర బెదిరింపు మెయిల్‌

  • Production of Eggs : గుడ్ల ఉత్పత్తిలో ఏపీ నం.1

  • Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd