HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Non Bailable Warrant Issued Against Rahul Gandhi

Rahul Gandhi : రాహుల్ గాంధీ పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు.

  • Author : Latha Suma Date : 24-05-2025 - 12:27 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Non-bailable warrant issued against Rahul Gandhi
Non-bailable warrant issued against Rahul Gandhi

Rahul Gandhi : కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి చైబాసా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పరువు నష్టం కేసులో ఆయనపై నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీచేయడంతో రాజకీయ వర్గాల్లో కలకలం రేగింది. జార్ఖండ్ రాష్ట్రంలోని చైబాసాలో ఉన్న ఎంపీ-ఎమ్మెల్యే ప్రత్యేక కోర్టు రాహుల్ గాంధీని జూన్ 26న స్వయంగా హాజరుకావాలని ఆదేశించింది. రాహుల్ గాంధీ ఇప్పటికే పలు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ కోర్టు విచారణకు హాజరుకాలేదు. మొదట్లో కోర్టు ఆయనపై బెయిలబుల్ వారెంట్ జారీ చేసినా, అనంతరం ఆయన జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ హైకోర్టు మార్చి 20, 2024న ఆయన పిటిషన్‌ను తిరస్కరించింది. ఆ తర్వాత వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరుతూ రాహుల్ గాంధీ తరఫు న్యాయవాది మరోసారి కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ విజ్ఞప్తిని కూడా చైబాసా కోర్టు తిరస్కరించడంతో చివరికి నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేయాల్సి వచ్చింది.

Read Also:KTR : పార్టీ అధినేతకు లేఖ రాయడంలో తప్పేం లేదు..అంతర్గత విషయాలు..అంతర్గతంగానే చర్చించుకోవాలి: కేటీఆర్‌

ఈ పరువు నష్టం కేసు 2018లోని కాంగ్రెస్ ప్లీనరీ సమావేశానికి సంబంధించినది. ఆ సమావేశంలో రాహుల్ గాంధీ అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదాస్పదమయ్యాయి. “హత్యా ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికీ బీజేపీలో అధ్యక్ష పదవులు దక్కుతాయా?” అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలు బీజేపీ కార్యకర్తల మనోభావాలను దెబ్బతీశాయంటూ, బీజేపీ నేత ప్రతాప్ కటియార్ జూలై 9, 2018న చైబాసా చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పరువు నష్టం కేసు దాఖలు చేశారు. పరిస్థితుల దృష్ట్యా 2020 ఫిబ్రవరిలో జార్ఖండ్ హైకోర్టు ఆదేశాల మేరకు కేసును రాంచీలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేశారు. అయితే అనంతరం కేసును మళ్లీ చైబాసాలోని ఎంపీ-ఎమ్మెల్యే కోర్టుకు తిరిగి పంపించారు. అప్పటి నుంచీ కోర్టు పలు సార్లు సమన్లు జారీ చేసినా, రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా హాజరు కాలేదు. ఈ నేపథ్యంలో కోర్టు కఠినంగా స్పందించి తాజా నాన్ బెయిల్‌బుల్ వారెంట్ జారీ చేసింది.

రాహుల్ గాంధీపై జారీ అయిన ఈ వారెంట్ దేశవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారి తీసింది. ఇప్పటికే 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో కేంద్రం తీరుపై తీవ్ర విమర్శలు చేసిన రాహుల్, తాజాగా కోర్టు ఆదేశాలపై ఎలా స్పందిస్తారో అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. జూన్ 26న ఆయన కోర్టుకు హాజరవుతారా? లేదా మరోసారి న్యాయపరమైన మార్గాలు అన్వేషిస్తారా? అన్నదానిపై దృష్టి నిలిచింది. ఈ పరిణామం కాంగ్రెస్ పార్టీకి సమయస్ఫూర్తిగా ఎదురవుతోంది. ఇప్పటికే విపక్ష నాయకుడిగా ప్రజలలో తిరుగుతున్న రాహుల్ గాంధీకి చట్టపరమైన ఇబ్బందులు ఏర్పడటం పార్టీకి ఇబ్బందికరంగా మారొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

Read Also: Keshava Rao Encounter : మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావు ఎన్‌కౌంట‌ర్‌‌పై అనుమానాలివీ

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Chaibasa Court
  • congress
  • defamation case
  • Non Bailable Warrant
  • rahul gandhi

Related News

Survey

ఇప్పుడు ఎన్నికలు జరిగితే దేశంలో ఎవరి ప్రభుత్వం ఏర్పడుతుందో తెలుసా?

గత లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి కొంత ఎదురుదెబ్బ తగిలింది. ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటికీ బీజేపీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు.

  • 'patka' Controversy

    బీజేపీ – కాంగ్రెస్ మధ్య ‘పట్కా’ వివాదం

  • Bhatti Ap Congress

    మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యం – భట్టి

Latest News

  • భారత్- న్యూజిలాండ్ 5వ టీ20.. వాతావ‌ర‌ణం ఎలా ఉంటుందంటే?!

  • పీఎం కిసాన్ ప‌థ‌కం 22వ వాయిదా విడుదల ఎప్పుడంటే?!

  • భార‌త్‌- పాక్ మ్యాచ్‌పై శ్రీలంక ప్రత్యేక దృష్టి!

  • నంది నగర్ నివాసంలోనే కేసీఆర్ విచారణ!

  • అంజనాదేవి పుట్టిన రోజు సందర్బంగా పవన్ దత్తత

Trending News

    • ఆర్థిక సర్వేను ప్ర‌వేశ పెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి.. జీడీపీ అంచ‌నా ఎంతంటే?!

    • బంగారం పై నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన..ఏకంగా రూ. 12 లక్షల కోట్లు..!

    • రిటైర్మెంట్‌పై యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్య‌లు!

    • జాతీయ రహదారులపై నిర్మలా సీతారామన్ సంచలనం

    • యూపీఐ ద్వారా డబ్బు కట్ అయి, పేమెంట్ ఫెయిల్ అయితే ఏం జరుగుతుంది?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd