HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Maoist Spokesperson Jagan Sensational Letter

Maoist : మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ సంచలన లేఖ

  • By Latha Suma Published Date - 12:54 PM, Sat - 30 March 24
  • daily-hunt
Maoist spokesperson Jagan sensational letter
Maoist spokesperson Jagan sensational letter

Maoist: గడ్చిరోలి(Gadchiroli)లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్‌(Encounter)పై మావోయిస్టులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ లేఖ విడుదల చేశారు. ప్రజాపాలన(Praja Palana) పేరుతో తెలంగాణ(telangana)లో అధికారం చేపట్టిన కాంగ్రెస్(Congress) పార్టీ బీజేపీ(bjp)తో చేతులు కలిపి విప్లవ ప్రజాఘాతుక కగార్ (అంతిమదశ) ఆపరేషన్స్ కొనసాగిస్తున్నాయంటూ మావోయిస్టు అగ్రనేత, ఆ పార్టీ అధికార ప్రతినిధి జగన్(jagan) లేఖ విడుదల చేశారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు తెలంగాణ ప్రభుత్వం, పోలీసులే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. మార్చి 19న గడ్చిరోలిలోని కొల్లమర్క అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్ పేరిట తమ కామ్రేడ్లు మంగు (డీవీపీఎం), వర్గేశ్ (వీఎం), రాజు (పీఎం), బుద్రాం (పీఎం)లను హత్య చేశారని ఆరోపించారు.

We’re now on WhatsApp. Click to Join.

గడ్చిరోలిలో జరిగింది బూటకపు ఎన్‌కౌంటర్ అని, తెలంగాణ ప్రభుత్వం తమ పోలీసుల ద్వారా జరిపించిందని జగన్ ఆ లేఖలో ఆరోపించారు. ఆహార పదార్థాల్లో విషం పెట్టి వారు స్పృహ కోల్పోయిన తర్వాత పట్టుకుని చిత్రహింసలకు గురిచేసి క్రూరంగా హత్యచేశారని ఆరోపించారు. మంచిర్యాల జిల్లా ఎస్పీ ఈ పథకాన్ని అమలు చేశారని పేర్కొన్నారు. ఈ ఎన్‌కౌంటర్ నెత్తుటి మరకలు తమ చేతులకు అంటుకోకుండా మహారాష్ట్ర పోలీసుల ఎన్‌కౌంటర్‌లో వారు మరణించినట్టు తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని ఆరోపించారు. ఈ ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఈ ఘటన తర్వాత మావోయిస్టు నిర్మూలన కోసం నిర్ణయాత్మక యుద్ధాన్ని మరింత పకడ్బందీగా కొనసాగించేందుకు తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన మంచిర్యాల, భూపాలపల్లి, గడ్చిరోలి జిల్లాల ఎస్పీలతో సంయుక్త సమావేశం జరిపారని పేర్కొన్నారు. దీనిని బట్టి ప్రజాస్వామ్యం ముసుగువేసుకున్న కాంగ్రెస్ దమననీతి ఏంటో అర్థమవుతోందని పేర్కొన్నారు.

Read Also: GHMC Mayor: బీఆర్ఎస్‌కు భారీ ఎదురుదెబ్బ.. కాంగ్రెస్‌లో చేరిన జీహెచ్ఎంసీ మేయర్

ఈ నెల 8న బీజాపూర్ జిల్లా ఉపూర్ బ్లాక్ తుమ్మిరెల్లికి చెందిన మాదేవ్, మాడ్కాల్ అనే ఇద్దరు అమాయక ఆదివాసీ యువకులను దుమ్ముగూడెం పోలీసులు అరెస్ట్ చేసి మాయం చేశారని లేఖలో జగన్ ఆరోపించారు. వారి కోసం కుటుంబ సభ్యులు 25 రోజులుగా తిరుగుతున్నా పోలీసులు వారి ఆచూకీ చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయలేదని బుకాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల చర్ల పోలీసులు బీజాపూ్ జిల్లా నేంద్ర గ్రామానికి చెందిన ఐదుగురు యువకులను పట్టుకుని చిత్రహింసలకు గురిచేశారని ఆరోపించారు. ఆదివాసీలను బతకనివ్వడం లేదని, వారిని దేశ పౌరులుగా గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గడ్చిరోలి ఎన్‌కౌంటర్‌కు, ఆదివాసీ యువకులను మాయం చేసిన ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పూర్తి బాధ్యత వహించాలని, మాయం చేసిన యువకుల వివరాలను ప్రకటించాలని, వారిని మాయం చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని లేఖలో జగన్ డిమాండ్ చేశారు.

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bijapur
  • chhattisgarh
  • Gadchiroli Encounter
  • Maoist Jagan
  • maoists
  • revanth reddy

Related News

Raghunandan Rao

Raghunandan Rao : రేవంత్-హరీశ్ కుమ్మక్కు.. బీఆర్ఎస్ అవినీతి పునాదుల మీద నిలిచింది

Raghunandan Rao : తెలంగాణ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.

  • Cm Revanth Reddy

    Telangana : రేవంత్ సర్కార్ కొత్త ప్లాన్.. రాయదుర్గ్ భూముల అమ్మకాలే లక్ష్యం

  • Cm Revanth Reddy

    CM Revanth Reddy : కేసీఆర్ అప్పులపై నిజాలు బయటపెట్టిన సీఎం రేవంత్

  • KCR model is needed for agricultural development in the country: KTR

    KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ నేత కేటీఆర్ సవాల్

  • Telangana Assembly approves 42 percent reservation amendment bills for BCs

    Telangana : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ సవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం

Latest News

  • Shreyas Iyer: ఆసియా క‌ప్‌కు ముందు టీమిండియా కెప్టెన్‌గా అయ్య‌ర్‌!

  • Canada : ఖలిస్థానీ ఉగ్రవాదులకు కెనడా నుంచే నిధుల సరఫరా: కెనడా నివేదికలో వెల్లడి..!

  • ‘Mahindra’ Bumper offer : కార్లు కొనే వారికి ‘మహీంద్రా’ బంపరాఫర్

  • Delhi : తీహార్‌ జైలును పరిశీలించిన బ్రిటన్‌ అధికారులు.. భారత్‌కు నీరవ్ మోదీ, మాల్యాను అప్పగిస్తారా..?!

  • ACB Court : ఏపీ లిక్కర్ స్కామ్ కేసు..ముగ్గురు నిందితులకు బెయిల్ మంజూరు

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd