HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Trending
  • >Many Diplomatic Tours Of Global Importance In The New Year

PM Modi : కొత్త ఏడాదిలో ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు..?

భారత మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చే ఏడాది భారత్‌ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది ఆయన తొలిసారి భారత్ పర్యటన అవుతుంది.

  • By Latha Suma Published Date - 07:05 PM, Thu - 26 December 24
  • daily-hunt
Many diplomatic tours of global importance in the new year..?
Many diplomatic tours of global importance in the new year..?

PM Modi : 2025లో ప్రధానమంత్రి మోడీ చైనాను సందర్శించే అవకాశం కనిపిస్తోంది. ఆగస్టు లేదా సెప్టెంబర్‌లో చైనాలో నిర్వహించనున్న షాంఘై కోపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్‌ కోసం ప్రధాని మోడీ చైనాకు వెళ్తారని భావిస్తున్నారు. ఇటీవల భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ చైనాలో పర్యటించి, సరిహద్దు సమస్యలతో పాటు పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరిపిన విషయం తెలిసిందే. రెండు దేశాలు తమ సంబంధాలను పునరుద్ధరించుకోవాలని ఉద్దేశిస్తున్నాయి. ఇక భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు.

మరోవైపు వచ్చే ఏడాది క్వాడ్ సమ్మిట్‌ కోసం ట్రంప్ భారత్‌కు రానున్నారని, అదే సమయంలో ప్రధాని మోడీ అమెరికాకు వెళ్లే అవకాశం ఉందని సమాచారం. యూరోపియన్ యూనియన్‌తో భారత్‌లో శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో జరగనుంది. ఈ సమావేశం కోసం పలువురు యూరోపియన్ నాయకులు భారత్‌కు రానున్నారు. భారత మిత్రదేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా వచ్చే ఏడాది భారత్‌ను సందర్శించనున్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత ఇది ఆయన తొలిసారి భారత్ పర్యటన అవుతుంది.

అంతేకాక..జనవరిలో సింగపూర్ అధ్యక్షుడు ధర్మన్ షణ్ముగరత్నం భారత్‌కి వస్తారు. గణతంత్ర దినోత్సవానికి ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సియాంటో ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మార్చి లేదా ఏప్రిల్‌లో చిలీ అధ్యక్షుడు గాబ్రియేల్ బోరిక్ భారత్ సందర్శించనున్నారు. 2025 చివరిలో G20 సదస్సు దక్షిణాఫ్రికాలో, ASEAN సదస్సు మలేషియాలో జరగనున్నాయి. వీటికి హాజరయ్యేందుకు కూడా ప్రధానమంత్రి మోడీ ఆయా దేశాలకు వెళ్లే అవకాశముంది. ఈ పర్యటనలన్నీ భారత్ దౌత్య సంబంధాల పెంపుకు కీలకంగా మారవచ్చు. ఫిబ్రవరిలో ప్రధానమంత్రి మోడీ ఫ్రాన్స్‌కి పర్యటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ కూడా వెళ్లవచ్చు.

కాగా, వచ్చే ఏడాది ప్రపంచ స్థాయిలో ప్రాధాన్యత కలిగిన అనేక దౌత్య పర్యటనలు జరిగే అవకాశం ఉంది. 2020లో గల్వాన్ సంఘటనల తర్వాత భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమయ్యాయి. సరిహద్దు సమస్యలతో రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే ఇటీవలే సరిహద్దు ఉద్రిక్తతలను తగ్గించుకునేందుకు ఇరుదేశాలు సైన్యాలను వెనక్కి పిలిపించుకోవడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

Read Also: RK Roja : చంద్రబాబు నాయుడు నిజానికి రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచారు..!

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Diplomatic tours
  • Donald Trump
  • France
  • india
  • pm modi
  • Tharman Shanmugaratnam
  • Vladimir Putin

Related News

IND vs SL

IND vs SL: భారత్-శ్రీలంక మధ్య కేవలం నామమాత్రపు మ్యాచ్.. టీమిండియా జ‌ట్టు ఇదేనా?

ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ భారత్, పాకిస్తాన్‌ల మధ్య సెప్టెంబర్ 28న జరుగుతుంది. భారత్ ఇప్పటికే ఫైనల్‌లో తన స్థానాన్ని ఖరారు చేసుకోగా, పాకిస్తాన్ కూడా బంగ్లాదేశ్‌ను ఓడించి ఫైనల్ టికెట్‌ను ఖరారు చేసుకుంది.

  • TikTok

    TikTok: టిక్‌టాక్‌పై ఉన్న నిషేధాన్ని ట్రంప్ ఎందుకు ర‌ద్దు చేశారు?

  • Pithapuram

    Pithapuram : భారతదేశం లోని అష్టాదశ మహా శక్తి పీఠాల్లో ఒకటైన హుంకారిణీ శక్తి పీఠం

  • Railway Employees

    Railway Employees: రైల్వే ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌.. బోన‌స్ ప్ర‌క‌టించిన కేంద్రం!

  • Paracetamol

    Paracetamol: గర్భిణీలు పారాసెట‌మాల్ వాడ‌కూడ‌దా? డ‌బ్ల్యూహెచ్‌వో ఏం చెప్పిందంటే?

Latest News

  • 42% quota for BCs : BCలకు 42% కోటా .. జీవో రిలీజ్ చేసిన రేవంత్ సర్కార్

  • Trump Tariffs Pharma : “ఫార్మా” పై ట్రంప్ సుంకాల ప్రభావం ఎంత ఉండబోతుంది..?

  • Dasara : మందుబాబులకు ముందే హెచ్చరిక జారీ చేసిన వైన్స్ షాప్స్

  • L&T : L&T వెళ్లిపోవడానికి కారణం రేవంత్ రెడ్డినే – కేటీఆర్

  • Paytm : మీరు పేటిఎం వాడుతున్నారా..? అయితే బంగారు కాయిన్‌ గెల్చుకునే ఛాన్స్ !!

Trending News

    • Prime Minister Routine Checkup: ప్రధానమంత్రి మోదీ ఆరోగ్య ప్రోటోకాల్.. ప్రతి 3 నెలలకు ఒకసారి చెకప్!

    • Rupee: పుంజుకున్న రూపాయి.. బ‌ల‌హీన‌ప‌డిన డాల‌ర్‌!

    • IND vs PAK Final: భార‌త్‌- పాక్ మ‌ధ్య ఫైన‌ల్ మ్యాచ్‌.. పైచేయి ఎవ‌రిదంటే?

    • Ladakh: లడఖ్‌లో ఉద్రిక్త ప‌రిస్థితుల‌కు కార‌ణాలీవేనా??

    • UPI Boom: యూపీఐ వినియోగం పెరగడంతో నగదు వాడకం తగ్గింది: ఆర్‌బీఐ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd