HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Kcrs Investigation Concluded Pc Ghosh Commission Questioned Him For 50 Minutes

KCR : ముగిసిన కేసీఆర్‌ విచారణ..50 నిమిషాలు ప్రశ్నించిన పీసీ ఘోష్ కమిషన్

ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది.

  • By Latha Suma Published Date - 01:31 PM, Wed - 11 June 25
  • daily-hunt
KCR
KCR

KCR : రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన కాళేశ్వరం ప్రాజెక్ట్‌ విచారణలో కీలక మలుపు తలెత్తింది. బీఆర్కే భవన్‌లో న్యాయ విచారణ కమిషన్‌ ఎదుట భారతీయ రాష్ట్ర సమితి అధినేత, మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్‌) విచారణ ముగిసింది. సుమారు 50 నిమిషాల పాటు జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలోని కమిషన్‌ కేసీఆర్‌ను ప్రశ్నించింది. ఆయనను 115వ సాక్షిగా విచారించడం గమనార్హం. విచారణలో భాగంగా కమిషన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణ తీరుపై వివిధ ప్రశ్నలు సంధించింది. ప్రాజెక్టు ఆరంభం నుంచి తీసుకున్న కీలక నిర్ణయాలు, బ్యారేజీల నిర్మాణ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, వాటికి అందించిన పరిష్కారాలు, నిధుల వినియోగం వంటి అంశాలపై సమగ్రంగా వివరణ కోరింది. విచారణ అనంతరం కేసీఆర్‌ బీఆర్కే భవన్‌ ఎదుట వేచి ఉన్న అభిమానులు, పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తూ కారులో బయటకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కూడా ఉన్నారు.

Read Also: Pakistan : ఆపరేషన్‌ సిందూర్‌ ఎఫెక్ట్‌..రక్షణ బడ్జెట్‌ భారీగా పెంచిన పాక్‌..!

కమిషన్‌ గత కొన్ని నెలలుగా విచారణను వేగంగా కొనసాగిస్తోంది. ఇప్పటికే పలు శాఖల అధికారులు, నిర్మాణ సంస్థల ప్రతినిధులు విచారణకు హాజరైపు, అఫిడవిట్లు సమర్పించారు. మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించిన సీపేజ్ సమస్యలపై ప్రాజెక్టు నాణ్యతపై అనేక అనుమానాలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో 2024 మార్చిలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ పీసీ ఘోష్‌ నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్‌ ఇప్పటివరకు నీటిపారుదల, ఆర్థిక శాఖలతో పాటు సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్స్‌ అండ్‌ మెయింటెనెన్స్ విభాగాలకు చెందిన అధికారులను విచారించి, వారి నుండి వివరాలు సేకరించింది. అదే సమయంలో నిర్మాణ సంస్థల ప్రతినిధుల నుంచి అఫిడవిట్లు తీసుకొని, అవసరమైన సందర్భాల్లో వారిని క్రాస్‌ ఎగ్జామినేషన్‌కు కూడా పిలిపించింది.

ఇటీవలే కమిషన్‌ మాజీ మంత్రులు ఈటల రాజేందర్‌, హరీశ్‌రావులను కూడా విచారించింది. తాజా పరిణామంలో కేసీఆర్‌ విచారణ పూర్తవడం కీలకమైన దశగా మారింది. విచారణ తీరును బట్టి, కమిషన్‌ తుది నివేదిక కోసం వేచి చూడాల్సిందే. రాష్ట్ర ప్రాజెక్టులపై ప్రజాధనం వినియోగంపై పారదర్శకత, బాధ్యతాయుతమైన పాలనకు ఇది ఒక ఉదాహరణగా నిలవనుంది. ఈ విచారణలో వచ్చిన ఫలితాలు, తుది నివేదిక ఎలా ఉండబోతుందన్నదే ప్రస్తుతం రాజకీయ, సామాజిక వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది. ఇక, ఈ రోజు ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్‌లో జరిగే పీసీ ఘోష్ విచారణకు కేసీఆర్ హాజరయ్యారు. ఆయన్ని కమిటీ హాల్‌లోకి తీసుకెళ్తే తనకు వేరుగా విచారించాలని రిక్వస్ట్ చేశారు కేసీఆర్. ఆయన అభ్యర్థనను ఘోష్‌ అంగీకరించారు. మిగతా నాయకులను బయటకు పంపేశారు. కేసీఆర్‌ను ఓ రూమ్‌లో ఉంచి ప్రశ్నలు అడిగినట్టు సమాచారం అందుతోంది.

Read Also: Barla Srinivas : మంథని నియోజకవర్గంలో కాంగ్రెస్ నేత బహిష్కరణ

 

 

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BRK Bhavan
  • brs party
  • kaleshwaram project
  • Kaleshwaram project inquiry
  • kcr
  • PC Ghosh Commission

Related News

Cbi Director

CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

CBI : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేయాలని కోరుతూ సీబీఐకి లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ కేసు వివరాలు తెలుసుకోవడానికే ప్రవీణ్ సూద్ హైదరాబాద్ వచ్చారా అనే చర్చ జరుగుతోంది

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • That's why I resigned from BRS.. Kadiam Srihari's key comments

    Kadiyam Srihari : అందుకే బీఆర్ఎస్‌కి రాజీనామా చేశా..కడియం శ్రీహరి కీలక వ్యాఖ్యలు

  • Harish Rao Kcr

    Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!

  • Revanth Brs

    Revanth Counter : మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి – కవిత కు రేవంత్ కౌంటర్

Latest News

  • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

  • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

  • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

  • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

  • AP : రాష్ట్రంలో యూరియా కొరతపై ‘అన్నదాత పోరు’: వైసీపీ ఆందోళనకు సిద్ధం

Trending News

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd