Suicide Attack: పాక్లో ఆత్మాహుతి దాడి..ఐదుగురు చైనా పౌరుల మృతి
- By Latha Suma Published Date - 05:06 PM, Tue - 26 March 24
Suicide Attack: పాకిస్థాన్(Pakistan)లో ఆత్మాహుతి దాడి(suicide attack) జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్(Khyber Pakhtunkhwa Province) లో చోటు చేసుకున్న ఈ ఆత్మాహుతి దాడిలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. మరణించినవారిలో ఐదుగురు చైనా(Chinese)జాతీయులు ఉన్నారు.
Pakistan: Five Chinese nationals killed in suicide attack in Khyber Pakhtunkhwa
Read @ANI Story | https://t.co/9IQbrLY55f#Pakistan #ChineseNationals #suicideattack pic.twitter.com/0SpqF28wS0
— ANI Digital (@ani_digital) March 26, 2024
ఇస్లామాబాద్ నుంచి దసు ప్రాంతంలోని తమ క్యాంపునకు చైనా ఇంజినీర్ల బృందం వెళుతుండగా ఈ ఆత్మాహుతి దాడి జరిగింది. ఖైబర్ పక్తుంక్వా ప్రావిన్స్ లోని బిషమ్ తెహ్సిల్ వద్ద చైనా ఇంజినీర్ల కాన్వాయ్ వెళుతుండగా, ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు పేలుడు పదార్థాలతో నిండిన వాహనంతో దాడికి పాల్పడ్డాడు.
We’re now on WhatsApp. Click to Join.
ఈ దాడిలో ఐదుగురు చైనా ఇంజినీర్లు, వారి వాహనం డ్రైవర్ గా ఉన్న ఓ పాకిస్థానీ జాతీయుడు మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. కాగా, పేలుడు ధాటికి చైనా ఇంజినీర్ల వాహనం రోడ్డు పై నుంచి పక్కనే ఉన్న ఓ గోతిలోకి ఎగిరిపడిందని, అనంతరం మంటల్లో చిక్కుకుందని పోలీసులు వివరించారు.
Read Also: YSRCP: అనకాపల్లి ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన వైఎస్ఆర్సిపి
ఈ ఆత్మాహుతి దాడి ఘటనను పాకిస్థాన్ దేశాధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ తీవ్రంగా ఖండించారు. చైనా పౌరులు మృతి చెందడం పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ వ్యతిరేక శక్తులు ఎన్నటికీ పాకిస్థాన్-చైనా స్నేహాన్ని దెబ్బతీయలేవని జర్దారీ ఉద్ఘాటించారు.
Read Also: KTR: 100 రోజుల్లో తెలంగాణ నుంచి ఢిల్లీకి 2500 కోట్లు: కేటీఆర్
కాగా, ఈ ఆత్మాహుతి దాడికి తమదే బాధ్యత అని ఇంకా ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు.
Tags
Related News
Viral : హనుమాన్ ఆలయాన్ని పబ్లిక్ టాయిలెట్గా మార్చేశారు ..
అన్యాయంగా హనుమాన్ టెంపుల్ని పబ్లిక్ టాయిలెట్గా మార్చేశారు