Money laundering case : మహారాష్ట్ర, గుజరాత్లో 23 చోట్ల ఈడీ దాడులు
హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
- By Latha Suma Published Date - 05:03 PM, Thu - 14 November 24

ED Raids : మనీలాండరింగ్ కేసులో మాలెగావ్లోని సిరాజ్ అహ్మద్ అనే వ్యాపారికి సంబంధించిన విచారణలో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మహారాష్ట్ర, గుజరాత్లోని 23 ప్రాంతాల్లో గురువారం సోదాలు చేపట్టింది. ఈ మేరకు మహారాష్ట్రలోని మాలెగావ్, నాసిక్, ముంబయి గుజరాతా్లోని అహ్మదాబాద్, సూరత్లో తనిఖీలు చేపట్టింది. రూ.100 కోట్ల విలువైన లావాదేవీలు జరిపేందుకు ఆ వ్యాపారి బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు నకిలీ పత్రాలను ఉపయోగించినట్టు ఈడీ ఆరోపించింది. హవాలా లావాదేవీలను వెలికితీయడంతో పాటు, అక్రమ బ్యాంకింగ్ కార్యకలాపాలలో పాల్గొన్న వారిని గుర్తించడమే లక్ష్యంగా ఈ సోదాలు చేపట్టినట్టు సన్నిహిత వర్గాలు తెలిపాయి.
అయితే సిరాజ్ నాసిక్ మర్చంట్ కోఆపరేటివ్ బ్యాంక్లో బ్యాంకు ఖాతాలు తెరవడానికి దాదాపు డజను మంది కేవైసీ పేపర్లు, పాన్, ఆధార్ తీసుకున్నాడని ఆరోపణలున్నాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఈడీ దర్యాప్తు చేస్తోంది. నిందితుడు మొత్తం 14 బ్యాంకు ఖాతాలు తెరవగా వాటి ద్వారా 2200 లావాదేవీలు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఖాతాల ద్వారా రూ. 112 కోట్లు కాగా క్రెడిట్ కాగా, 315 డెబిట్ లావాదేవీలు గుర్తించినట్టు ఈడీ అధికారులు తెలిపారు. మరిన్ని ఆధారాలు సేకరించేందుకు తాజాగా సోదాలు జరిపినట్టు వెల్లడించారు. అయితే ఎన్నికల వేళ మహారాష్ట్రలో సోదాలు జరగడం కలకలం రేపుతుంది.