Delhi Chalo: ‘ఛలో ఢిల్లీ’.. రైతుల ప్రధాన డిమాండ్లు ఇవే..?
- By Latha Suma Published Date - 10:54 AM, Tue - 13 February 24
Farmers Protest Delhi : పంజాబ్ రైతులతో కేంద్రం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. సుమారు 5 గంటలపాటు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగియడంతో ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించేందుకు రైతులు సిద్ధమయ్యారు. నేడు (మంగళవారం) ఢిల్లీలో నిర్వహించ తలపెట్టిన ధర్నా కోసం రైతుల సంఘాల నాయకులు, రైతులు దేశ రాజధాని ఢిల్లీ(delhi)కి పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 250కి పైగా రైతు సంఘాల మద్దతున్న ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, దాదాపు 150 సంఘాలతో కూడిన ‘కిసాన్ మోర్చా’ డిసెంబర్లోనే నిరసనకు పిలుపునివ్వడంతో పెద్ద సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్తున్నారు. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తమైన ఢిల్లీ పోలీసులు(delhi police) నగర సరిహద్దులు మూసివేశారు. ర్యాలీలు, నిరసనలపై నిషేధించారు. ఈ నేపథ్యంలో అపరిష్కృతంగా ఉన్న రైతుల ప్రధాన డిమాండ్ ఏవో ఒకసారి పరిశీలిద్దాం..
రైతుల ప్రధాన డిమాండ్లలో ప్రధానమైనది పంటలకు కనీస మద్దతు ధరకి హామీ ఇచ్చే చట్టం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మార్కెట్లో అనిశ్చితితో సంబంధం లేకుండా కనీస మద్దతు ధరకు హామీ లభించాలని రైతులు కోరుతుకున్నారు. విద్యుత్ చట్టం 2020 రద్దు, లఖింపూర్ ఖేరీ(Lakhimpur Kheri) ఘటనలో మృతి చెందిన రైతులకు నష్టపరిహారం పరిహారం చెల్లింపు, రైతు ఉద్యమంలో పాల్గొన్న వారిపై కేసుల ఉపసంహరణ రైతుల ప్రధాన డిమాండ్లుగా ఉన్నాయి. రెండేళ్ల క్రితం పలు డిమాండ్ల పరిష్కారానికి కేంద్రం హామీ ఇచ్చినా నెరవేర్చకపోవడంతో ధర్మా చేపట్టాలని రైతులు నిర్ణయించారు.
We’re now on WhatsApp. Click to Join.
2020-21 రైతు ఆందోళన సమయంలో రైతులపై నమోదయిన కేసు ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తమ డిమాండ్లలో అత్యంత ముఖ్యమైన ‘కనీస మద్దత ధర’కు’ హామీ ఇవ్వాలని రైతులు పట్టుబడుతున్నారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చే విషయంలో ప్రభుత్వ నిబద్ధతపై రైతు సంఘాల నాయకులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కనీస మద్దతు ధర, రుణమాఫీ డిమాండ్ల విషయంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలును పరిశీలించేందుకు కేంద్రం ఒక కమిటీని ప్రతిపాదించింది. అయినప్పటికీ రైతులు వెనక్కి తగ్గడం లేదు. ఇక భూసేకరణ చట్టం-2013 పునరుద్దరణ, ప్రపంచ వాణిజ్య సంస్థ నుంచి ఉపసంహరణ కూడా రైతుల డిమాండ్లలో ప్రధానమైనవిగా ఉన్నాయి.
read also : Magunta : టిడిపిలో చేరేందుకు రెడీ అవుతున్న మాగుంట!
Related News
Pakistan Reaction: కేజ్రీవాల్ విడుదలతో పాకిస్థాన్ లో సంబురాలు
ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ విడుదల వార్త పాకిస్థాన్ లోనూ హల్ చల్ చేసింది. పాకిస్థాన్ మీడియా డాన్ ఈ వార్తను ప్రచురించింది.కేజ్రీవాల్ను భారతదేశ అత్యున్నత న్యాయస్థానం విడుదల చేసింది. ఇది మోడీ ప్రభుత్వ ఓటమి అంటూ పాక్ నేతలు కూడా సంబరాలు చేసుకున్నారు.