HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Trending
  • >Bad Guys Are Not Equal To The Victims India Will Never Tolerate Terrorism Jaishankar

Jaishankar : దుష్టులు బాధితులతో సమానం కాదు..భారత్‌ ఉగ్రవాదాన్ని ఎన్నటికీ సహించబోదు : జైశంకర్‌

బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు.

  • By Latha Suma Published Date - 02:42 PM, Sat - 7 June 25
  • daily-hunt
bad guys are not equal to the victims.. India will never tolerate terrorism: Jaishankar
bad guys are not equal to the victims.. India will never tolerate terrorism: Jaishankar

Jaishankar : భారత్‌ విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్ మరోసారి ఉగ్రవాదంపై భారత్‌ అవలంబిస్తున్న అవిశ్రాంత పోరాటాన్ని తేటతెల్లం చేశారు. దుష్టశక్తులు బాధితులతో సమానం కాలేరని స్పష్టంగా చెప్పారు. పాకిస్థాన్‌కు పరోక్షంగా హితవు పలుకుతూ, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలను భారత్ ఇకపై సహించదని హెచ్చరించారు. బ్రిటన్‌ విదేశాంగ మంత్రి డేవిడ్ లామీతో ఢిల్లీలో జరిగిన సమావేశం సందర్భంగా జైశంకర్ ఈ వ్యాఖ్యలు చేశారు. పహల్గాంలో ఇటీవల జరిగిన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించినందుకు బ్రిటన్ ప్రభుత్వానికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఉగ్రవాదాన్ని మేం ఎన్నటికీ సహించబోం. దానికి శాశ్వతంగా ముగింపు రావాల్సిందే. చెడుకు పాల్పడే వారిని బాధితులుగా చూడటమన్నది మాకు ఆమోదయోగ్యం కాదు. భాగస్వామ్య దేశాలు కూడా ఇది గుర్తించాలి అని జైశంకర్ ధ్వజమెత్తారు.

Read Also: Lakhpati Didi Yojana: దేశంలోని మహిళల ఆర్థిక పురోగతికి కేంద్రం పథకం

ఈ సందర్భంగా ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వాణిజ్య సహకారం, రక్షణ రంగంలో భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చలు జరిగినట్లు జాతీయ మీడియా పేర్కొంది. బ్రిటన్‌తో ఉన్న సంబంధాలు మరింత బలపడాలని భారత్‌ ఆశిస్తోంది. జైశంకర్ వ్యాఖ్యలు, ఉగ్రవాదంపై దేశం అవలంబిస్తున్న స్పష్టమైన విధానాన్ని ప్రతిబింబిస్తున్నాయి. ఇదిలాఉండగా… పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రపంచ దేశాలు ఖండించాయి. పాక్‌ మద్దతుతో ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారని నిఘా సంస్థలు నిర్ధారించాయి. ఈ దాడిలో పలువురు భద్రతా సిబ్బంది, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన భారత్‌ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌ ప్రాయోజిత శిబిరాలపై లక్ష్యంగా దాడులు జరిపింది.

ఈ దాడుల అనంతరం భారత ప్రభుత్వం ప్రత్యేక అఖిలపక్ష బృందాలను విదేశాలకు పంపింది. ఉగ్రవాదంపై భారత్‌ చేస్తున్న పోరాటం, పాకిస్థాన్‌ పాత్ర గురించి వివరణ ఇచ్చేందుకు ఈ బృందాలు పలు దేశాలకు వెళ్లాయి. ప్రపంచ దేశాలు భారత్‌కు మద్దతు ప్రకటించి, బాధిత కుటుంబాలకు సంఘీభావం తెలిపారు. ఈ పరిణామాల నేపథ్యంలో, ఉగ్రవాదంపై అంతర్జాతీయ మద్దతును సాధించడంలో భారత్‌ కీలకంగా ముందంజ వేస్తోంది. జైశంకర్ వ్యాఖ్యలు ఈ క్రమంలోనే ఉన్నదిగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. భారత్ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనే విషయంలో ఎలాంటి రాజీ చేయదని, అంతర్జాతీయ మద్దతుతో దుష్టశక్తులను ఒళ్లు గగుర్పాటు చేయించే విధంగా చర్యలు తీసుకుంటుందని సంకేతాలు అందిస్తున్నాయి.

Read Also: Annadatta Sukhibhava : ఏపీ రైతులకు గుడ్‌న్యూస్‌.. ‘అన్నదాతా సుఖీభవ’ డబ్బుల జమ ఎప్పుడంటే..?


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • British
  • David Lammy
  • Jaishankar
  • pakistan
  • terrorism

Related News

Upendra Dwivedi

Operation Sindoor : యుద్ధం మూడురోజుల్లోనే ముగిసిందని అనుకోవడం తప్పు : ఆర్మీ చీఫ్‌ ద్వివేదీ

Operation Sindoor : భారత-పాక్‌ మధ్య యుద్ధాలు అధికారికంగా ముగిసినా, పాకిస్థాన్‌ ప్రోత్సహిస్తున్న ఉగ్రవాదం మాత్రం ఆగలేదని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేదీ స్పష్టంచేశారు.

  • Once again, India's humanitarian approach...an early warning to Pakistan

    Sutlej River : మరోసారి భారత్‌ మానవతా దృక్పథం..పాకిస్థాన్‌కు ముందస్తు హెచ్చరిక

  • Attack In Balochistan

    Pakistan : బెలూచిస్తాన్‌లో ఆత్మాహుతి దాడి – 25 మంది మృతి

  • A massive earthquake shook Afghanistan, killing more than 250 people

    Earthquake : ఆఫ్ఘనిస్థాన్‌ను కుదిపేసిన భారీ భూకంపం.. 250 మందికి పైగా మృతి

  • Nobel Peace Prize

    Nobel Peace Prize: నోబెల్ బహుమతి పొందాలని ఆశ‌ప‌డిన ట్రంప్‌.. భారీ షాక్ ఇచ్చిన భార‌త్‌!

Latest News

  • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

  • Viral : రూ.10 వేల కోట్ల ఆస్తి ఫుట్‌బాల్‌ స్టార్‌కి రాసిచ్చిన బిలియనీర్‌

  • Coolie : వచ్చేస్తోంది.. ‘కూలీ’ ఇప్పుడు ఏ ఓటీటీలో అంటే..?

  • Ganesh Visarjan : 16 కిలో మీటర్లు సాగనున్న బాలాపూర్‌ గణేష్‌ శోభాయాత్ర..

  • AP : అసెంబ్లీకి రాకపోతే ఉప ఎన్నికలే: జగన్ కు రఘురామకృష్ణరాజు హెచ్చరిక

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd