Space X Satellites : అంతరిక్షంలో కల్లోలం.. సౌరతుఫాను వల్ల 40 శాటిలైట్లు ధ్వంసం
శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేందుకు కృషిచేస్తున్న స్పేస్ ఎక్స్ కంపెనీకి భారీ నష్టం జరిగింది. ఫిబ్రవరి 3న అంతరిక్షంలో సంభవించిన అతిపెద్ద సౌరతుఫాను వల్ల ఆ కంపెనీకి చెందిన 40 నుంచి 40 శాటిలైట్లు ధ్వంసం అయ్యాయి.
- By Hashtag U Published Date - 01:05 PM, Wed - 9 February 22
శాటిలైట్ల ద్వారా ఇంటర్నెట్ సదుపాయాన్ని అందించేందుకు కృషిచేస్తున్న ఎలాన్ మస్క్కి (Elon Musk) చెందిన స్పేస్ ఎక్స్ (Space X) కంపెనీకి భారీ నష్టం జరిగింది. ఫిబ్రవరి 3న అంతరిక్షంలో సంభవించిన అతిపెద్ద సౌరతుఫాను (Geo Magnetic Storm) వల్ల ఆ కంపెనీకి చెందిన 40 నుంచి 40 శాటిలైట్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే భూమి నుంచి లాంచ్ అయిన ఆ శాటిలైట్లు ఇంకా నిర్ణీత కక్షలోకి చేరుకోలేదు. ఈ లోగా సంభవించిన సౌరతుఫాను వల్ల అవి పేలిపోయాయని భావిస్తున్నట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. సౌరతుఫాను నుంచి తప్పించుకునే విధంగా శాటిలైట్లను సేఫ్ మోడ్ కమాండ్లోకి పంపినా కూడా అతి తక్కువ దూరంలో అవి స్పేస్ స్టార్మ్ను తాకాయని, అందువల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు పేర్కొంది.
ఇప్పటికే 2వేల శాటిలైట్లను లాంచ్ చేసిన స్పేస్ ఎక్స్.. మొత్తమ్మీద 12వేల శాటిలైట్లను అంతరిక్షంలోకి పంపాలని టార్గెట్గా పెట్టుకుంది. ఇంత పెద్ద టార్గెట్ ముందు ఈ నష్టం పెద్దది కాకపోవచ్చు కానీ.. దాని వల్ల జరగబోయే పరిణామాలను మాత్రం తన ఆపరేషన్స్ను నష్టపరుస్తాయని అంటోంది కంపెనీ. ఈ స్ధాయిలో అంతరిక్షంలో శాటిలైట్లను పంపించడం ద్వారా జరగబోయే పరిణామాలపై ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉల్కలు, ఇలాంటి సౌరతుఫాన్ల వల్ల భారీ స్ధాయిలో నష్టం వస్తుందని, స్పేస్ జంక్ పెరిగిపోతోందనే వాదనలూ వినిపిస్తున్నాయి.
Related News
Elon Musk Net Worth Rise: మస్క్తో మామూలుగా ఉండదు మరీ.. 5 రోజుల్లో రూ. 3 లక్షల కోట్లు సంపద..!
ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటో కంపెనీ టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ నికర విలువ సోమవారం నాడు 18.5 బిలియన్ డాలర్లు పెరిగింది.