YS Viveka Murder Case : తెలంగాణకు వైఎస్ వివేకా హత్య కేసు..త్వరగా పూర్తిచేయాలని సుప్రీం ఆదేశం..!!
- By hashtagu Published Date - 11:57 AM, Tue - 29 November 22
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన కేసు తెలంగాణకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు విచారణను ఏపీ నుంచి హైదరాబాద్ కు బదిలీ చేస్తున్నట్లు తెలిపింది. వివేకా హత్య కేసు దర్యాప్తులో జరుగుతున్నతీరుపై ఆయన కూతురు సునీతా రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఏపీలో తమ న్యాయం జరగదని సునీతారెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు. మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరారు. పిటిషన్ పై దర్యాప్తు చేపట్టిన ధర్మాసనం..ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇందుకు సంబంధించిన తీర్పును వెలువరించిది సుప్రీంకోర్టు. ఏపీ నుంచి హైదరాబాద్ స్పెషల్ సీబీఐ కోర్టుకు బదిలీ చేస్తున్నట్లు జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ ఎంఎం సుందరేష్ లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.
Related News
EVM : వీవీ ప్యాట్పై మధ్యాహ్నం 2 గంటల్లోపు వివరణ ఇవ్వండి: ఈసీకి సుప్రీంకోర్టు సూచన
EVM: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) పనితీరుపై సుప్రీంకోర్టు(Supreme Court) బుధవారం భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ)కి కొన్ని ప్రశ్నలను సంధించింది. వాటికి సమాధానం ఇవ్వడానికి మధ్యాహ్నం 2 గంటలకు ఈసీ అధికారిని కోర్టుకు హాజరై తమ ప్రశ్నలకు బదులివ్వాలని సూచించింది. We’re now on WhatsApp. Click to Join. ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ (వీవీపీఏటీ) పేపర్ స్లిప్లతో ఈవీఎంలలో 100 శాతం ఓట్ల లెక్కింపును క్రాస్ వెరి