Telangana: కాళేశ్వరంపై సీఎం కేసీఆర్ ని ప్రశ్నించిన షర్మిల
కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు వల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా కాళేశ్వరం అంశాన్ని లేవనెత్తారు.
- By Praveen Aluthuru Published Date - 07:04 AM, Wed - 26 July 23
Telangana: కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, ఆ ప్రాజెక్టు వల్ల కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆరోపణలు చేస్తున్న వైఎస్ఆర్టీపి చీఫ్ వైఎస్ షర్మిల తాజాగా కాళేశ్వరం అంశాన్ని లేవనెత్తారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ కు అనేక ప్రశ్నలు సంధించారు. రూ.1.49లక్షల కోట్లతో కాళేశ్వరం తిప్పిపోతల పథకం కట్టిన కేసీఆర్ గారు..మూడేండ్లకే మునిగిన ప్రాజెక్టుతో రూ.80వేల కోట్ల అప్పెట్ల తీర్చారు అంటూ షర్మిల సీఎంని ప్రశ్నించారు.
రోజుకు 3 TMC లు అని చెప్పి, అర TMC కూడా ఎత్తలేని ప్రాజెక్టు బాకీలు తీర్చిందా?ఎత్తిపోసిన 157 టీఎంసీలలో 100 టీఎంసీలను గోదాట్లో పోసినందుకు బాకీలు తీరినయా? లక్ష ఎకరాల సాగుకు దిక్కులేని ప్రాజెక్టుతో వడ్లు ఉష్కె లెక్క పండినయా? ప్రతి సీజన్ లో పట్టుపని 40వేల ఎకరాలను కూడా తడపని ప్రాజెక్టుతో రైతులకు డబ్బులే డబ్బులా? మీరు పుట్టకపోతే తెలంగాణలో వ్యవసాయమే లేనట్లు.. ప్రాజెక్టు కట్టకపోతే రైతుకు దిక్కేలేనట్లు ఉంది మీ వ్యవహారం. 70 ప్రాజెక్టుల పాత ఆయకట్టును కనికట్టు చేసి కొత్త ఆయకట్టుగా చూపి.. కాళేశ్వరం ఖాతాలో వేసినంత మాత్రానా కోటి ఎకరాలకు తడిపినట్లు కాదు దొర! విస్తారంగా వర్షాలు పడి,పాత ప్రాజెక్టులు నిండినయే తప్పా.. మీ కాసులధార కాళేశ్వరం ఒక్కటీ నింపలే. 9ఏండ్లలో 15లక్షల కొత్త బోర్లు పడ్డాయంటే, మీ డ్రీమ్డ్ ప్రాజెక్ట్ అంతా బోగస్ అని తేలిపోయింది. మీ కమీషన్ల సౌదం కాళేశ్వరం అప్పులు తీర్చేది కాదు. అప్పుల మీద అప్పులు మోపేది.
తెలంగాణ నెత్తిన ఎప్పటికీ గుదిబండే. రాష్ట్ర సొమ్మును వడ్డీలకు, నిర్వహణకు కాజేసే కన్నీటి సౌదం. కాళేశ్వరం ముమ్మాటికీ కేసీఆర్ వైట్ ఎలిఫెంట్. తెచ్చిన రూ.97,447కోట్లకు అదనంగా రూ.71,575కోట్లు కలిపి కట్టే ఫలితం లేని ప్రాజెక్ట్ కాళేశ్వరం. నిర్వహణ కింద ఏటా రూ.23వేల కోట్లు బూడిదలో పోసిన పన్నీరుతో సమానమే. అప్పులు తీర్చి, ఖజానా నింపుకున్నది కేసీఆర్ మాత్రమే. అందుకే దొరకు కాళేశ్వరం ఒక ATM. మీ బంధిపోట్ల పాలనలో రైతుల జేబులకు చిల్లులు పడ్డయ్ తప్పితే.. జేబులు నిండలే. దేశంలోని రైతులకు ఉన్న అప్పుల్లో తెలంగాణ ఐదో స్థానంలో ఉంది. రైతుల ఆదాయంలో 25వ స్థానంలో ఉంది. ఒక్కో రైతు మీద రూ.లక్షన్నర అప్పు ఉంది. ఇది పార్లమెంటులో కేంద్రం చెప్పిన వివరాలే. ఇప్పుడు చెప్పండి దొర గారు.. మీరు కట్టిన కాళేశ్వరం పుణ్యాన ,రైతులకు అప్పులు తేరినయా? అప్పులు మిగిలినయా? అంటూ ఆమె సీఎం కెసిఆర్ ని అనేక ప్రశ్నలు సంధించారు.
Also Read: Telangana Government : రేపు, ఎల్లుండి విద్యాసంస్థలకు సెలవు ప్రకటన
Related News
Harish Rao: చంద్రబాబుపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు
హరీష్ సంచలన కామెంట్స్ కు పాల్పడ్డారు. విభజనలో భాగంగా పదేళ్ల గడువు ముగిసినా హైదరాబాద్ను ఏపీ, తెలంగాణలకు ఉమ్మడి రాజధానిగా పొడిగించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని హరీష్ చెప్పారు.