Telangana: తెలంగాణ తాలిబన్లను తరిమికొట్టాలి
తెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించేందుకు విపక్షాలు వ్యయాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా తయారైంది
- By Praveen Aluthuru Published Date - 09:40 AM, Mon - 6 November 23
Telangana: తెలంగాణలో మరో రెండు వారాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఆయా రాజకీయ పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. తెలంగాణ అధికార పార్టీ బీఆర్ఎస్ ని గద్దె దించేందుకు విపక్షాలు వ్యయాలు రచిస్తున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో బలంగా తయారైంది. ఇక అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలో మూడు పార్టీల మధ్య ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణలో కొత్త పార్టీతో ఎన్నికల్లో పోటీ చేసందుకు వైఎస్ షర్మిల సిద్ధమైంది. తొలుత ఆమె కాంగ్రెస్ నుంచి పోటీకి దిగుతుంది అనుకున్నా పరిణామాల దృష్ట్యా అది సాధ్యపడలేదు. ఈ మేరకు ఆమె ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో షర్మిల అధికార బీఆర్ఎస్, కల్వకుంట్ల కుటుంబంపై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంది. తాజాగా షర్మిల సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లపై దుమ్మెత్తిపోసింది.
తాజాగా మాట్లాడిన వైఎస్ షర్మిల.. అభివృద్ధిపై చర్చించే దమ్ము, ధైర్యం లేక ఇంకా సెంటిమెంట్ ని వాడుకుంటున్నావా కేటీఆర్ అంటూ హాట్ కామెంట్స్ చేశారు. మీ తండ్రీకొడుకులను మించిన తెలంగాణ ద్రోహులు ఇంకెవ్వరూ ఉండరని ఎద్దేవా చేశారు. నమ్మి రెండు దఫాలు అధికారమిస్తే రాష్ట్ర సంపదను పందికొక్కుల్లా తిన్న వెన్నుపోటుదారులు కేసీఆర్, కేటీఆర్ మరియు కల్వకుంట్ల కుటుంబం అంటూ ధ్వజమెత్తారు. ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలి, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకున్న బందిపోట్లు మీరేనంటూ మండిపడ్డారు.
రాష్ట్రాన్ని 4 లక్షల కోట్ల అప్పుల్లో నెట్టి దివాలా తీయించిన దొంగలు మీరు.కోటి ఎకరాల మాగానికి సాగునీరని పనికి రాని ప్రాజెక్ట్ కట్టి లక్ష కోట్లు కాజేసిన దోపిడీదారులు మీరు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి 10 ఏళ్లలో లక్ష ఉద్యోగాలు ఇవ్వలేని మీరు నిరుద్యోగుల పాలిట వ్యతిరేక శక్తులు. 3 ఎకరాల భూమి,ఇంటికి 10 లక్షలు అని చెప్పి దళితులను దగా చేసిన దళిత ద్రోహులు మీరు. నిధులు, నీళ్లు, నియామకాల కోసం ప్రజలంతా ఏకమై సాగించిన ఉద్యమం సాక్షిగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే.. నిధులు మీ ఖజానాకే.. నీళ్లు మీ ఫామ్ హౌజ్ కే.. నియామకాలు మీ ఇంట్లోకే.ఇంకా సెంటిమెంట్ రాజకీయాలు చేసి గద్దెనెక్కాలనుకోవడం మీ అవివేకానికి, అత్యాశకు నిదర్శనం. రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి,నియంత పాలన చేస్తున్న తాలిబన్లను తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధమయ్యారంటూ సంచలన ఆరోపణలు చేశారు షర్మిల.
Also Read: Gold Price Today: ఈ రోజు బంగారం, వెండి ధరలు
Tags
Related News
KCR : తెలంగాణ గొంతుకపై నిషేధమా..? ఇదెక్కడి న్యాయం..?
48 గంటలపాటు ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయకూడదని ఆంక్షలు విధించింది