HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Where Is Kcr Brs Boss Hide And Seek Game Brs Car Steering In The Hand Of Ktr

Where is KCR : కేసీఆర్ ఎక్కడ ? గులాబీ బాస్ ‘హైడ్ అండ్ సీక్’.. కేటీఆర్ చేతిలో ‘కారు’ స్టీరింగ్

కేసీఆర్(Where is KCR) ఎక్కడ? ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌.

  • Author : Dinesh Akula Date : 29-01-2025 - 5:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Where Is Kcr Brs Ktr Harish Rao Telangana Revanth Reddy Congress

Where is KCR :  కేసీఆర్.. ఒకప్పుడు తెలంగాణ రాజకీయాల్లో చక్రం తిప్పిన రాజకీయ యోధుడు. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేతగా తెలంగాణ రాజకీయాలను శాసించిన ఈ నేత ఇప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్టు కనిపిస్తోంది. దీంతో బీఆర్ఎస్‌ ‘కారు’ను ముందుకు నడిపించే బాధ్యతను కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తీసుకున్నారు. ఆయన తనదైన శైలిలో పార్టీ శ్రేణులను ముందుకు నడిపిస్తున్నారు.

Also Read :Congress Manifesto : ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ మేనిఫెస్టో.. నిరుద్యోగులు, మహిళలకు కీలక హామీలు

కేటీఆర్: బీఆర్ఎస్ కొత్త ముఖం

కేసీఆర్ రాజకీయంగా యాక్టివ్‌గా లేని ప్రస్తుత తరుణంలో బీఆర్ఎస్‌లో కేటీఆర్ నాయకత్వ పటిమతో చొరవ చూపి నిర్ణయాలు తీసుకుంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని విమర్శనాత్మకంగా ఎదుర్కొంటున్నారు. ఇటీవలే నల్గొండలో నిర్వహించిన ‘రైతు మహా ధర్నా’లో కేటీఆర్ ధ్వజమెత్తారు. తెలంగాణ రైతులను కాంగ్రెస్ సర్కారు ఆదుకోవడం లేదన్నారు. రైతు బంధు పథకం నిధుల విడుదలలో జాప్యం జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన ప్రస్తుత తరుణంలో ఆర్థిక సాయం హామీలతో రైతుల ఓట్లు పొందేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం యత్నిస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఓ వైపు బీఆర్ఎస్ నిరసనలు, ర్యాలీలను కేటీఆర్ ముందుండి నడుపుతుంటే.. మరోవైపు కేసీఆర్ మాత్రం పార్టీ కార్యకలాపాలకు దూరంగా, మౌనంగా ఉండిపోవడం గమనార్హం.

కేసీఆర్ అదృశ్య మాయాజాలం

కేసీఆర్(Where is KCR) ఎక్కడ? ఇది తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన స్థాయికి సరిపోడనే భావనతోనే కేసీఆర్ రాజకీయాల్లో సైలెంట్‌గా ఉండిపోయారని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు. ఒకవేళ కేసీఆర్ ఈ విధమైన ఆలోచన చేసి ఉంటే అది సరికాదని అంటున్నారు. కుమారుడు కేటీఆర్‌ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించే క్రమంలోనే కేసీఆర్ ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారని ఇంకొందరు రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కేటీఆర్ యాక్టివిటీని కేసీఆర్ నిశితంగా పరిశీలిస్తున్నారని అంటున్నారు. ఇప్పటికే పలుచోట్ల బీఆర్ఎస్ సమావేశాల్లో పార్టీ కార్యకర్తలు “సీఎం కేటీఆర్” అంటూ నినాదాలు చేశారు. ఇదంతా చూస్తుంటే, పార్టీలో నాయకత్వ మార్పిడి కోసం కేసీఆర్ పన్నిన వ్యూహంలాగే కనిపిస్తోంది.

Also Read :Maha Kumbh Stampede : డస్ట్ బిన్స్ వల్లే తొక్కిసలాట.. మహాకుంభ మేళాలోని ప్రత్యక్ష సాక్షులు

భయానికి కారణం : కేసీఆర్‌పై ఉన్న కేసులే

కేసీఆర్ కనిపించకుండా పోవడానికి గల మరో పెద్ద కారణం ‘కేసులు’ కావచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్, విద్యుత్ ఒప్పందాలపై విచారణను ప్రారంభించింది. మరోవైపు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలుకు వెళ్లి వచ్చారు. ఆమెపై మరిన్ని కేసులు నమోదయ్యే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ఫార్ములా ఈ రేస్ కుంభకోణంలో కేటీఆర్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ స్వయంగా బయటకు వచ్చి సమస్యలను మరింత పెంచుకోవాలని అనుకోవడం లేదని పలువురు పరిశీలకులు అంటున్నారు.

డబ్బు లేకే కేసీఆర్ సైలెంట్?

కేసీఆర్ ఆర్థిక కారణాల వల్లే బయటకు రాకూడదనే నిర్ణయం తీసుకున్నారా? బీఆర్ఎస్ శక్తివంతంగా ఉండాలంటే పెద్దఎత్తున సభలు, ర్యాలీలను నిర్వహించాలి. అయితే పార్టీ అధికారంలో లేని ప్రస్తుత పరిస్థిత్తుల్లో ఇవన్నీ చేయడానికి పెద్ద మొత్తంలో నిధులు అవసరం. బీఆర్ఎస్ పార్టీ ఖాతాలో ఉన్న నిధులను ప్రస్తుత తరుణంలో వినియోగించడానికి కల్వకుంట్ల కుటుంబం సిద్ధపడకపోవచ్చు. ఈ ఆర్థిక ప్రతికూలతల వల్లే కేసీఆర్ సైలెంట్ అయ్యారని అంటున్నారు. దాదాపు పదేళ్ల పాటు తెలంగాణను ఏకఛత్రాధిపత్యంగా ఏలిన కేసీఆర్ ఇక శాశ్వతంగా ఇలాగే మౌనంగా ఉండిపోతారా ?

విపక్ష నాయకుడా ? మొహం చాటేసిన నాయకుడా?

కేసీఆర్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు. ఆయనొక ఎమ్మెల్యే. విపక్ష పార్టీ నేత. మౌనంగా ఉండటం వల్ల కేసీఆర్‌కు మేలు జరగకపోగా, రాజకీయంగా చెడు జరిగే అవకాశాలు ఉంటాయి. రాజకీయ వైఖరిని ప్రజల ఎదుట వ్యక్తం చేయాల్సిన బాధ్యత ఆయనపై ఉంటుంది. కాంగ్రెస్‌కు కేసీఆర్ సవాల్ విసరాలని ప్రజలు కోరుకుంటున్నారు. కేసీఆర్ మళ్లీ పోరాడి, ముందంజలో నిలవాలని ప్రజానీకం ఆశిస్తున్నారు. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్ తెరమరుగు అయ్యారు. ఆయన కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీశ్ రావు మాత్రమే బీఆర్ఎస్‌ను ముందుకు తీసుకెళ్తున్నారు.

సమయం కోసం వేచి చూస్తున్నారా ? తలనొప్పి తప్పించుకుంటున్నారా?

బీఆర్ఎస్ నేతలంతా ఒకే మాట చెబుతున్నారు. రాజకీయాల్లో సరైన సమయం కోసం కేసీఆర్ ఎదురు చూస్తున్నారని వారు అంటున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజలు అర్థం చేసుకొని, కళ్లారా చూసిన తర్వాతే జనక్షేత్రంలోకి దూకాలని కేసీఆర్ అనుకుంటున్నారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అయితే అప్పటిదాకా ప్రజలు కేసీఆర్ కోసం ఎదురు చూస్తారా ? అనేది పెద్ద ప్రశ్న. 2018 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్‌తో కేసీఆర్ గెలిచారు. 2023 ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయలేదు. అప్పటి బీఆర్ఎస్‌ ప్రభుత్వంపై ఏర్పడిన ప్రజా వ్యతిరేకత, అవినీతి ఆరోపణలు, బలమైన విపక్షం వంటి అంశాలు ప్రజలను ఆలోచింపజేశాయి. వెరసి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరిగింది. ఆ ఎన్నికల్లో ఓటమి ఎదురైంది.

ఇదే సమయంలో కేసీఆర్‌పై సీఎం రేవంత్ విమర్శల వాడిని పెంచుతున్నారు. కేసీఆర్, ఆయన కుటుంబంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనా కేసీఆర్ బయటకు వస్తారా? లేక తన ఫాంహౌస్‌లోనే కూర్చొని రాజకీయాలను దూరం నుంచే చూస్తూ ఉండిపోతారా?

ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. తెలంగాణ రాజకీయాల్లో నిశ్శబ్దం అంటే రాజకీయ జీవితానికి ముగింపు. కేసీఆర్ ఇకపై కూడా మౌనంగా ఉంటే, తెలంగాణ ప్రజలు ఆయనను మరచిపోయారా అనే ప్రశ్న తలెత్తుతుంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • congress
  • Dinesh akula
  • harish rao
  • kcr
  • ktr
  • revanth reddy
  • telangana
  • Where is KCR

Related News

bjp Mp Godam Nagesh

తెలంగాణలో మరో కొత్త ఎయిర్‌పోర్టు.. మాస్టర్‌ ప్లాన్‌ ప్రతిని విడుదల చేసిన ఎంపీ నగేష్

Bjp Mp Godam Nagesh  ఆదిలాబాద్ జిల్లా ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది. జిల్లాలో కొత్తగా ఎయిర్‌పోర్టు కానుంది. ఈ మేరకు ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్లాన్‌ను ఎంపీ గోడం నగేష్ విడుదల చేశారు. త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం అవుతాయని ఎంపీ వెల్లడించారు. ఈ ఎయిర్‌పోర్టు అందుబాటులోకి వస్తే జిల్లా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఆదిలాబాద్ కొత్త ఎయిర్‌పోర్టు మాస్టర్ ప్ల

  • Rajya Sabha Elections

    Breaking News రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల

  • Engineering Students Telang

    Engineering Students : ప్రైవేటు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ కు బిగ్ షాక్..భారీగా పెరిగిన ఫీజులు

  • New Holland Launches 'workm

    తెలంగాణ మార్కెట్లోకి ‘వర్క్‌మాస్టర్ 105’ ట్రాక్టర్‌

  • Jangaon Thorrur Congress

    లక్కీ డ్రాలో తొర్రూరు, జనగామ కాంగ్రెస్ కైవసం..

Latest News

  • కాంగ్రెస్ నాయ‌కుల‌కు నోటీసులు పంపిన లోక్‌స‌భ ప్రివిలేజ్ క‌మిటీ!

  • టీ20 క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా సూర్యకుమార్ యాదవ్!

  • 122 ఏళ్ల తర్వాత తెరుచుకోనున్న ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం లో గర్భగుడి

  • మదనపల్లె హత్యాచార ఘటన మరవకముందే మరో దారుణం !!

  • Encounter in Karregutta : కర్రెగుట్టల్లో భారీ ఎన్కౌంటర్.. ఐదుగురు మావోలు హతం

Trending News

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

    • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

    • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd