Uttam Kumar Reddy : అన్నారం ప్రాజెక్టులోనూ లీకులు
- By Kavya Krishna Published Date - 11:30 AM, Sat - 17 February 24
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Sessions) వాడి వేడిగా సాగుతున్నాయి. అయితే నేడు.. కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project)పై అసెంబ్లీలో మాట్లాడిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్నారం బ్యారేజీ (Annaram Barrage)లో నిన్నటి నుంచి లీకులు మొదలయ్యాయని ఆయన పేర్కొన్నారు. అందులోని నీటిని తొలగించాలని NDSA పేర్కొందని ఆయన వెల్లడించారు. ఈ బ్యారేజీ కూడా ప్రమాదంలో ఉందని ఆయన అన్నారు. కుంగేలా కనిపిస్తోందని, రిజర్వాయర్లో నీరు నింపొద్దని NDSA సూచించిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కాళేశ్వరంపై కాగ్ రిపోర్ట్ (CAG Report) ఆధారంగా బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణలో నిర్మించిన ప్రాజెక్టులు అనేవి భారత దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. వందేళ్లు భద్రంగా ఉండాల్సిన కట్టడం మూడేళ్లకే కుప్పకూలిపోయిందని ఆరోపించారు. కీలకమైన బ్యారేజ్ ఇలా నాణ్యత లోపంతో కుంగిపోవడం చాలా దురదృష్టకరమని ఆయన అన్నారు. ఇదంతా కూడా గత ప్రభుత్వ అవినీతి వల్ల ప్రాజెక్టు కుప్పకూలిపోయిందని ఉత్తమ్ మండిపడ్డారు.
We’re now on WhatsApp. Click to Join.
మేడిగడ్డ బ్యారేజీకి దిగువన ఉన్న ఇసుక ఉపరితలాన్ని క్షుణ్ణంగా అంచనా వేస్తేనే అసలు నష్టం ఎంత ఉందో తేలుతుందని విజిలెన్స్ ఉన్నతాధికారులు టీఎన్ఐఈకి తెలిపారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇసుక కోత స్థాయిని అంచనా వేస్తుంది మరియు బ్యారేజీలో ఫ్రీ-స్టాండింగ్ ఎంత ఉందో తనిఖీ చేస్తుంది. బ్యారేజీ తగినంత స్థిరంగా ఉందో, వినియోగానికి అనుకూలంగా ఉందో NDSA నివేదిక వెల్లడిస్తుంది.
ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలోని శాసనసభ్యుల బృందం పర్యటించిన నేపథ్యంలో భారీ పగుళ్లు, తుప్పుపట్టిన ఉక్కు, మునిగిపోయిన రిజర్వాయర్ బెడ్, మేడిగడ్డ బ్యారేజీలోని పైర్ల నుండి నీరు కారుతున్న చిత్రాలతో బ్యారేజీ స్థిరత్వంపై అనుమానాలు బలంగా పెరిగాయి. పైర్లు క్రమంగా మునిగిపోతే, అది ఇప్పటికీ నిర్వహించదగినది. మేము డ్యామ్ను నియంత్రించగలము, నీటి స్థాయిని నిర్వహించడానికి గేట్లను తెరవగలము/మూసివేయగలము అని డైరెక్టర్ జనరల్ (విజిలెన్స్) రాజీవ్ రతన్ వెల్లడించారు.
Read Also : TDP : ఎమ్మిగనూరు, ఆలూరు సీట్ల కోసం టీడీపీ నేతల లాబీయింగ్
Related News
Top News Today: దేశవ్యాప్తంగా ఈ రోజు ప్రధాన అంశాలు
కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రసంగం వీడియోను ఎడిట్ చేసినందుకు గానూ ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఏప్రిల్ 30 న తీహార్ జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ను కలవనున్నారు. పశ్చిమ బెంగాల్ మినహా దేశంలోని ఇతర ప్రాంతాల్లో కాంగ్రెస్కు సహాయం చేస్తానని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటన చేశారు.