TSRTC : సంక్రాతికి సొంతూళ్లకు వెళ్లే వారికి టీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్
సంక్రాంతి పండుగ సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సుల్లో గతేడాది మాదిరిగా బస్సు చార్జీలను పెంచబోమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు
- By Prasad Published Date - 07:58 AM, Fri - 6 January 23
సంక్రాంతి పండుగ సందర్భంగా నడిచే ప్రత్యేక బస్సుల్లో గతేడాది మాదిరిగా బస్సు చార్జీలను పెంచబోమని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్ ప్రకటించారు. ప్రవేట్ వాహనాల్లో ప్రయాణించడం ద్వారా అదనపు డబ్బు ఖర్చు చేయవద్దని.. అది అంత సురక్షితం కాదని ఆయన ప్రయాణికులకు తెలిపారు హైదరాబాద్లోని బస్భవన్లో గురువారం ఈడీలు, ఆర్ఎంలు, డీఎంలతో ఆన్లైన్ సమీక్షా సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ.. టీఎస్ఆర్టీసీకి సంక్రాంతి పండుగ ముఖ్యమని, ప్రతి అధికారులు పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉండాలన్నారు. పండుగ సీజన్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డిపో మేనేజర్లు మరియు ఇతర అధికారులు కూడా ముఖ్యమైన ట్రాఫిక్ పాయింట్ల వద్ద ఉండి బస్సు కార్యకలాపాలను పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
ట్రాఫిక్కు అనుగుణంగా బస్సు సర్వీసులను పెంచాలని సజ్జనార్ ఆదేశించారు. ఈ కాలంలో పరిస్థితిని తెలుసుకునేందుకు హైదరాబాద్ MGBSలో కమాండ్ కంట్రోల్ సెంటర్ను కూడా ఏర్పాటు చేస్తారు. ఇంకా టూ-వే టికెట్ బుక్ చేసుకునే వారికి తిరుగు ప్రయాణంలో 10% తగ్గింపు అందించబడుతోందన్నారు. ప్రయాణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని కోరారు. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యార్థం అడ్వాన్స్ టికెట్ బుకింగ్ను 30 రోజుల నుంచి 60 రోజులకు పెంచారు. ఈ ఏడాది జూన్ వరకు ఈ బుకింగ్ సౌకర్యం ఉంటుందని తెలిపారు. స్వగ్రామాలకు వెళ్లే ప్రజల కోసం 4,233 ప్రత్యేక బస్సులను నడపాలని TSRTC నిర్ణయించింది శ్రీ సజ్జనార్. ఇందులో 585 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. జనవరి 7 నుంచి 14 వరకు ఈ ప్రత్యేక బస్సులు నడుస్తాయని వివరించారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది