TSPSC Group 4: తెలంగాణ గ్రూప్ 4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా.. కొత్త తేదీలివే.!
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) తెలిపింది.
- By Gopichand Published Date - 11:12 AM, Fri - 23 December 22
తెలంగాణలో గ్రూప్-4 ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ వాయిదా పడింది. నేటి నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉండగా, సాంకేతిక సమస్యల కారణంగా దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) ప్రకటించింది. ఈ నెల 30 నుంచి జనవరి 19 వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు టీఎస్పీఎస్సీ (TSPSC) తెలిపింది. మొత్తం 9,168 గ్రూప్-4 పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. వీటిల్లో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు 6,859, వార్డు ఆఫీసర్ పోస్టులు 1,862, పంచాయితీరాజ్శాఖలో 1,245 పోస్టులు, 429 జూనియర్ అకౌంటెంట్ పోస్టులు, 18 జూనియర్ ఆడిటర్ పోస్టులు ఉన్నాయి. త్వరలో గ్రూప్-2, 3 పోస్టులకు సంబంధించిన ఉద్యోగ ప్రకటనలు జారీ కానున్నాయి.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) సాంకేతిక కారణాల వల్ల గ్రూప్-IV సర్వీసుల కింద వివిధ విభాగాల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్, జూనియర్ ఆడిటర్, వార్డ్ ఆఫీసర్ ఖాళీల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీలను వాయిదా వేసింది. అర్హత గల అభ్యర్థులు ఇప్పుడు డిసెంబర్ 30 నుండి అధికారిక వెబ్సైట్ tspsc.gov.inలో ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోగలరు. పోస్ట్లకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ జనవరి 19, 2023, సాయంత్రం 5.00 గంటల వరకు ఉంటుందని TSPSC పేర్కొంది.
Also Read: Varahi Ammavaru : వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు
రాష్ట్రవ్యాప్తంగా 9,168 పోస్టుల భర్తీని TSPSCకి అప్పగిస్తూ నవంబర్ 25న ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చింది. పోస్టులపై క్లారిటీ రాకపోవడంతో శుక్రవారం నుంచి ప్రారంభం కావాల్సిన గ్రూప్4 దరఖాస్తుల ప్రక్రియ వాయిదా వేయాలని నిర్ణయించారు. అన్ని డిపార్ట్ మెంట్ల నుంచి పోస్టుల వివరాలు వచ్చిన వాటిని TSPSCకి సీజీజీకి పంపించాల్సి ఉంటుంది. వాళ్లు కూడా టెస్టింగ్ కోసం మూడు రోజులు టైమ్ తీసుకునే అవకాశముంది. దీంతో ఈనెల 29 లేదా 30న దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించే అవకాశముందని టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
Related News
Hyderabad: అమిత్ షా మీటింగ్ లో పిల్లలు, కేసు నమోదు
కేంద్ర మంత్రి అమిత్ షా, హైదరాబాద్ బీజేపీ లోక్సభ అభ్యర్థి మాధవీలత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్, బిజెపి రాష్ట్ర చీఫ్ కిషన్ రెడ్డి, యమన్ సింగ్ తదితరులపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన సభలో పిల్లలను పాల్గొనేలా చేసినందుకు మొగల్పురా పోలీసులు కేసు నమోదు చేశారు.