HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Tpcc Cheif Mahesh Goud React On Teenmar Mallanna Controversy

Mahesh Kumar Goud : శాస్త్రీయంగానే కులగణన సర్వే.. పార్టీలో క్రమశిక్షణ తప్పితే సహించం

Mahesh Kumar Goud : పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.

  • Author : Kavya Krishna Date : 05-02-2025 - 4:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mahesh Kumar Goud
Mahesh Kumar Goud

Mahesh Kumar Goud : తెలంగాణ కాంగ్రెస్‌లో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యవహారం హాట్‌టాపిక్‌గా మారింది. పార్టీ విధానాలకు విరుద్ధంగా తరచూ వ్యాఖ్యానించడం, ప్రభుత్వ నిర్ణయాలను విమర్శించడం నేతల్లో, కేడర్‌లో తీవ్ర గందరగోళాన్ని సృష్టిస్తోంది. ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన సర్వేను తగులబెట్టిన వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లడంతో ఆయనపై క్రమశిక్షణాత్మక చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై తీన్మార్ మల్లన్న తీవ్ర విమర్శలు చేశారు. సర్వేను తగులబెట్టడంతోపాటు, దీనిపై అనేక ఆరోపణలు చేయడంతో కాంగ్రెస్ హైకమాండ్ ఆయన తీరుపై సీరియస్ అయింది. దీనిపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు.

బుధవారం గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్, కులగణన సర్వేను శాస్త్రీయంగా నిర్వహించినట్లు స్పష్టం చేశారు. ఈ సర్వేలో బీసీల జనాభా 56 శాతానికి పైగా ఉన్నట్లు తేలిందన్నారు. అయితే, బీఆర్ఎస్ నేతలు బీసీ సంఘాలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం కొన్ని బీసీ సంఘాలు మార్గభ్రష్టమవుతున్నాయని, అలాంటి వలలో పడొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

 
Diabetes: మధుమేహం ఉన్నవారు పాలు తాగవచ్చా.. తాగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా?
 

పార్టీలో ఎవరైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే తగిన చర్యలు ఉంటాయని మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఉద్దేశించి మాట్లాడిన ఆయన, కాంగ్రెస్ పార్టీ అజెండాకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు. “ఎవరైనా ఎమ్మెల్సీ అయినా, ఎంపీ అయినా, పార్టీకి కట్టుబడి ఉండాలి. క్రమశిక్షణను పాటించకుంటే చర్యలు తప్పవు. క్రమశిక్షణ కమిటీ దానిపై తగిన నిర్ణయం తీసుకుంటుంది” అని ఆయన పేర్కొన్నారు.

అలాగే, గురువారం కాంగ్రెస్ కుటుంబ సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మీటింగ్‌లో అన్ని అంశాలను చర్చించి పరిష్కారం కనుగొంటామని తెలిపారు. తెలంగాణలో బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న హక్కులను సాధించిందని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రుల చొరవతో బీసీలకు, ఎస్సీలకు న్యాయం జరిగిందన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో మొదటిసారి బీసీ కులగణన చేపట్టిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, ఇది చారిత్రక విజయమని కొనియాడారు. బిహార్ లాంటి రాష్ట్రాల్లో కులగణన చేపట్టినా, అది కార్యరూపం దాల్చలేదని గుర్తుచేశారు.

ప్రతిపక్ష పార్టీలు కులగణనపై విమర్శలు చేయడం మానుకుని, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు అందించాలంటూ హితవు పలికారు. “కులగణన ఒక చారిత్రక అవసరం. దీన్ని విమర్శించడం కన్నా, దీని ప్రయోజనాలను అర్థం చేసుకోవడం మంచిది” అని వ్యాఖ్యానించారు. తెలంగాణ కాంగ్రెస్‌లో తీన్మార్ మల్లన్న వ్యవహారం పెద్ద దుమారం రేపుతోంది. పార్టీ విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న కారణంగా ఆయనపై క్రమశిక్షణాత్మక చర్యలు తప్పవని సంకేతాలు కనిపిస్తున్నాయి. గురువారం జరిగే కాంగ్రెస్ కుటుంబ సమావేశం అనంతరం ఈ వ్యవహారంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Rohit Sharma: ఛాంపియ‌న్స్ ట్రోఫీ త‌ర్వాత రోహిత్ రిటైర్ అవుతాడా? కోహ్లీపై బీసీసీఐ నిర్ణ‌యం ఏంటీ!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • BC Reservation
  • caste census
  • congress party
  • Mahesh Kumar Goud
  • Political Controversy
  • revanth reddy
  • Teenmar Mallanna
  • telangana congress
  • telangana politics
  • tpcc

Related News

Erravalli Farmhouse Seethakka, Konda Surekha,

కేసీఆర్‌ను కలవనున్న మంత్రి సీతక్క,కొండా సురేఖ.. ఎందుకంటే?

తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కాంగ్రెస్ మంత్రులు సీతక్క, కొండా సురేఖ గురువారం (జనవరి 8) మాజీ సీఎం కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మేడారం సమ్మక్క, సారక్క మహా జాతర ఆహ్వాన పత్రికను అందజేసి.. వనదేవతల పండుగకు రావాలని కోరనున్నట్లు సమాచారం. కాగా, మేడారం జాతరకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని పటిష్ట

  • Is a new era of BCs beginning in Telangana politics? Teenmar Mallanna's sensational statement..!

    ఆటోల్లోనూ ఫ్రీ జర్నీ పెట్టాలంటూ తీన్మార్ మల్లన్న డిమాండ్

Latest News

  • పాలకూర ప్రతిరోజూ తింటే ఎన్నో ప్రయోజనాలు..!

  • మహిళా మంత్రులకు కేసీఆర్‌ ఆత్మీయ పలకరింపు..పసుపు, కుంకుమ, చీర, తాంబూలాలతో సత్కారం

  • భారత ఉద్యోగ విపణిలో ఏఐ విప్లవం

  • దేశీయ స్టాక్ మార్కెట్లలో భారీ పతనం: పెట్టుబడిదారుల సంపదకు భారీ గండి

  • అమెరికా నౌకలను ముంచేస్తాం.. రష్యా ఎంపీ హెచ్చరికలు

Trending News

    • మ‌క‌ర సంక్రాంతి ఎప్పుడు? ఆరోజు ఏం చేస్తే మంచిది?!

    • టీమిండియా జ‌ట్టుతో క‌ల‌వ‌ని స్టార్ ఆట‌గాళ్లు.. ఎవ‌రంటే?

    • మీ మొబైల్ నంబర్ చివర సున్నా ఉందా?

    • టీమిండియాకు కొత్త స‌మ‌స్య‌.. స్టార్ ఆట‌గాడికి గాయం!?

    • చ‌రిత్ర సృష్టించిన రుతురాజ్ గైక్వాడ్‌!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd