Fertilizer shortage : ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోంది: పొన్నం ప్రభాకర్
కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షతతో చూడడమే కాకుండా, ఎరువుల సరఫరాలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎరువుల తయారీ మరియు సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే.
- By Latha Suma Published Date - 12:53 PM, Mon - 8 September 25

Fertilizer shortage : తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని రాష్ట్ర వ్యవసాయ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. గాంధీ భవన్లో సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన, ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వం కారణమని తీవ్రంగా విమర్శించారు. కేంద్రం తెలంగాణ రాష్ట్రాన్ని వివక్షతతో చూడడమే కాకుండా, ఎరువుల సరఫరాలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. ఎరువుల తయారీ మరియు సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే. కానీ, తెలంగాణకు అవసరమైన ఎరువులు సరఫరా చేయడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఇది రైతులలో అసంతృప్తిని కలిగించేందుకు ఉద్దేశపూర్వకంగా చేస్తున్న చర్యలుగా భావించాల్సి ఉంటుంది అని మంత్రి ధ్వజమెత్తారు.
Read Also: Yamuna River : తాజ్ మహల్ న్ను తాకిన యమునా నది..టెన్షన్ పడుతున్న పర్యాటకులు
రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందన్నది వాస్తవమేనని ఒప్పుకున్న మంత్రి, దీనికి బాధ్యత వహించాల్సిన వారంతా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించకపోవడం వల్లే రాష్ట్రానికి ఎరువుల సమస్య తలెత్తింది. ఇది పూర్తిగా రాజకీయ లాభాల కోసం కావాలనే మానవ తప్పిదం అని ఆయన ఆరోపించారు. పొన్నం ప్రబాకర్ బీజేపీ మరియు భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)లపై తీవ్ర విమర్శలు చేశారు. ఈ రెండు పార్టీలు చేతులు కలిపి రాష్ట్ర ప్రభుత్వంపై అనవసర ఆరోపణలు చేస్తూ, రైతుల మనోభావాలను గాయపరుస్తున్నాయి. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి కూడా తెలంగాణ రైతులకోసం ఏమీ చేయకపోవడం దారుణం అని మండిపడ్డారు.
రైతులకు ఎరువులు, విత్తనాలు వంటి అవసరమైన వనరులను సమయానికి అందించడం ప్రభుత్వ బాధ్యత అని చెప్పారు. రైతులు ఈవేళ ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న సమయంలో ఎరువుల కొరత ఏర్పడడం చాలా తీవ్రమైన అంశం. ఇది కేవలం ఒక లాజిస్టిక్ లోపం కాదు ఇది కేంద్ర ప్రభుత్వ వైఖరిని చూపే ప్రత్యక్ష ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. తనంతట తానే ఎరువులు కొనుగోలు చేసి, వాటిని రైతులకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. అయితే కేంద్రం సహకరించకుండా ఉండడం వల్ల కొంతమేరుగా ఆ ప్రయత్నాలు అడ్డంకి ఎదుర్కొంటున్నాయని వెల్లడించారు. ఇక, పై రైతుల హక్కుల కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా పోరాడుతుందని, కేంద్రం బాధ్యత తీసుకొని తక్షణమే సరిపడా ఎరువులు పంపించాలన్న డిమాండ్ను పునరుద్ఘాటించారు.