Minister KTR : జహీరాబాద్లో మంత్రి కేటీఆర్కి నిరసన సెగ
- By Prasad Published Date - 02:42 PM, Thu - 23 June 22
జహీరాబాద్లో ఉద్రిక్తత నెలకొంది. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ (నిమ్జ్)లో పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామారావు బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా డిఫెన్స్ యూనిట్కు శంకుస్థాపన చేయడాన్ని నిరసిస్తూ స్థానికులు నిరసన తెలిపారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో దాదాపు 15 మంది గాయపడ్డారు. ఝరాసంగం, న్యాల్కల్ మండలాల మార్గంలో జహీరాబాద్ నిమ్జ్కు వెళ్లే గ్రామాల్లో పోలీసులు మోహరించారు. మామిడిగి, మెటల్ కుంట, న్యాల్కల్కు చెందిన చిలపల్లి తండాకు చెందిన పలువురు రైతులు, ఇతర గ్రామస్తులు పోలీసులు ఉన్నప్పటికీ దాటుకుని మంత్రి కేటీఆర్ కాన్వాయ్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
నిమ్జ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ప్రాంతాలకు న్యాయమైన పరిహారం ఇవ్వాలని, తమ ఆందోళనలను తెలియజేయడానికి గ్రామస్తులు కేటీఆర్ను కలవాలన్నారు. అయితే నిమ్జ్లోకి రాకుండా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఆందోళనకారులు పోలీసు వాహనం అద్దాలను పగులగొట్టారు. కొంతమంది నిరసనకారులను పోలీసులు అరెస్టు చేసి రాయికోడ్ పోలీస్ స్టేషన్కు తరలించారు. మంగళవారం రాత్రి నుండి సుమారు 1,200 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల లాఠీఛార్జిని బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ ఎస్ ప్రవీణ్కుమార్ ఖండించారు. ప్రాజెక్ట్లో భూములు కోల్పోతున్న పేద రైతులపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్నితాను తీవ్రంగా ఖండిస్తున్నానని.. తెలంగాణ ప్రజలపై టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న దౌర్జన్యాలకు వ్యతిరేకంగా గళం విప్పాల్సిన సమయం వచ్చిందన్నారు. అన్నదాతల ఉసురు తగులుతుంది మీకు” అంటూ ఆయన ట్వీట్ చేశారు.
Related News
Rains : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అలర్ట్ చేసిన సీఎం రేవంత్
తూర్పు విదర్భ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగిన ఆవర్తనం కారణంగా తెలంగాణ ఐదు రోజుల పాటు కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి జల్లులు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది