SLBC Tunnel : ఇంకా లభించని కార్మికుల ఆచూకీ
SLBC Tunnel : టన్నెల్లో నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది
- Author : Sudheer
Date : 25-02-2025 - 7:29 IST
Published By : Hashtagu Telugu Desk
నాగర్కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద శ్రీశైలం ఎడమ కాలువ (SLBC) టన్నెల్లో చిక్కుకున్న ఎనిమిది మంది కార్మికులను రక్షించేందుకు సహాయ చర్యలు మూడో రోజూ కూడా కొనసాగినప్పటికీ వారి ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. అయితే, టన్నెల్లో నీరు ఉబికి వస్తుండటంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. రక్షణ బృందాలు లోపలికి ప్రవేశించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నా, బురద పేరుకుపోవడం, మట్టి పెళ్లలు విరిగిపడటం వల్ల ఒడిదుడుకులు ఎదురవుతున్నాయి.
MLC Elections : ఎమ్మెల్సీ ఓటు వేయలేకపోతున్న పవన్..ఎందుకంటే..!!
ఈ ఆపరేషన్కు నేవీ, ఐఐటీ చెన్నై నిపుణులు, ఢిల్లీ ర్యాట్ మైనర్స్, గరుడ టీంతో పాటు తొమ్మిది రెస్క్యూ బృందాలు పాలుపంచుకుంటున్నాయి. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రాథమికంగా వర్టికల్ డ్రిల్లింగ్ ప్రతిపాదనను తప్పించగా, టన్నెల్ లోపల నీటి ప్రవాహాన్ని అరికట్టేందుకు మరమ్మతులు చేస్తున్నారు. ప్రభుత్వం అత్యాధునిక కెమెరాలు, డ్రోన్లు ఉపయోగించి లోపలున్నవారిని గుర్తించేందుకు కృషి చేస్తోంది.
YCP : రాజీనామా చేసే ఆలోచనలో వైసీపీ ఎమ్మెల్యేలు..? రోజా కామెంట్స్ కు అర్ధం ఇదేనా..?
సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులు ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా చిక్కుకున్నవారి లొకేషన్ను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. టన్నెల్లో చిక్కుకున్న కొందరి ఫోన్లు ఇప్పటికీ రింగ్ అవుతున్నా, స్పందన లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర వైద్య బృందాలను సిద్ధంగా ఉంచింది. రక్షణ బృందాలు వారి ప్రాణాలను కాపాడేందుకు అనుసరించే వ్యూహాలను పరిశీలిస్తుండగా, కుటుంబసభ్యులు తమ వారి కోసం ఆందోళన చెందుతున్నారు.