Hyderabad: ఆలయంలో బీఆర్ఎస్ డబ్బుల పంపిణి
సికింద్రాబాద్లోని ఓ ఆలయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ కార్యకర్తను బోవెన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఓటర్లకు డబ్బు పంపిణీపై నిర్దిష్ట సమాచారం అందడంతో
- By Praveen Aluthuru Published Date - 06:39 AM, Mon - 23 October 23

Hyderabad: సికింద్రాబాద్లోని ఓ ఆలయంలో ఓటర్లను ప్రభావితం చేసేందుకు డబ్బులు పంచుతున్న బీఆర్ఎస్ కార్యకర్తను బోవెన్పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఏరియాలో ఓటర్లకు డబ్బు పంపిణీపై నిర్దిష్ట సమాచారం అందడంతో, అసిస్టెంట్ ఇంజనీర్ ఎం. నిఖిలేష్ , సికింద్రాబాద్, బోవెన్పల్లి పోలీస్ స్టేషన్ సబ్-ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు నేతృత్వంలోని బృందం తాడ్బండ్ హనుమాన్ ఆలయానికి చేరుకుని ఎం భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు బీఆర్ఎస్ కార్యకర్తగా, న్యూబోవెన్పల్లి నివాసిగా గుర్తించారు. రూ. 55,900 నగదును బృందం స్వాధీనం చేసుకుంది. అతనిపై బోవెన్పల్లి పోలీస్ స్టేషన్లో IPC సెక్షన్లు 171B r/w 171E, 188 IPC కింద కేసు నమోదు చేశారు
Also Read: world cup 2023: టీమిండియా పాంచ్ పటాకా… కివీస్ పై భారత్ విజయం