Independence Day Celebrations : స్వాతంత్య్ర, దినోత్సవేడుకలకు ముస్తాభవుతున్న తెలంగాణ.. రెండు వారాల పాటు..?
75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ సారి ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది.
- By Prasad Published Date - 06:01 PM, Sun - 24 July 22
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఈ సారి ఘనంగా నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఆగస్టు 15వ తేదీకి ముందు, ఆ తరువాత కూడా వారం రోజుల పాటు వేడుకలు నిర్వహిస్తారు. అలాగే 1.20 కోట్ల జాతీయ జెండాలను పంపిణీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దేశభక్తిని పెంపొందించేలా అనేక కార్యక్రమాలు నిర్వహించాలని, స్వాతంత్య్ర సమరయోధులు, వారి త్యాగాలు, దేశ స్వాతంత్య్ర పోరాట ఫలాలు గురించి కొత్త తరాలకు అవగాహన కల్పించాలని సీఎం కేసీఆర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని ప్రతి ఇంటిపై జాతీయ జెండా రెపరెపలాడాలని, అందుకోసం 1.20 కోట్ల త్రివర్ణ జెండాలను అందుబాటులో ఉంచాలని సీఎం కేసీఆర్ అధికారులకు తెలిపారు. ఇంటింటికీ జెండా ఎగురవేయడం, క్రీడాపోటీలు, వ్యాసరచన, కవి సమ్మేళనం (కవుల సమ్మేళనం), జాతీయవాదం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘స్వాతంత్య్ర పోరాటం, త్యాగాలు, ఆనాటి జాతీయ నాయకులు, పోరాటంలో అమరులయిన వారి గురించి నేటి తరానికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి తెలంగాణ పౌరుడు గ్రామం నుండి పట్టణానికి స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలలో పాల్గొనాలని కోరారు. గద్వాల్, నారాయణపేట, సిరిసిల్ల, పోచంపల్లి, భోంగీర్, వరంగల్కు చెందిన చేనేత, పవర్ లూమ్ కార్మికులకు జెండాల తయారీకి ఆర్డర్లు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు.
అన్ని జనావాస ప్రదేశాలు, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్, నగరాల్లోని స్టార్ హోటళ్లు, ప్రధాన ట్రాఫిక్ జంక్షన్లలో దేశభక్తిని ప్రతిబింబించేలా జాతీయ జెండాలను ఎగురవేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు వజ్రోత్సవ జ్యోతిని వెలిగించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సర్పంచ్ స్థాయి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి అధికారులు తమ అధికారిక లెటర్ ప్యాడ్లపై జాతీయ జెండా చిహ్నాన్ని ముద్రించాలని ముఖ్యమంత్రి సూచించారు. 15 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో మీడియా సంస్థలు టీవీ స్క్రీన్పై జాతీయ జెండాను ప్రదర్శించాలని, త్రివర్ణ పతాకాన్ని మాస్ట్ హెడ్లపై ప్రచురించాలని కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. దేశభక్తిపై ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేయాలని మీడియా సంస్థలను కోరారు
Related News
Lok Sabha Elections 2024: 10-11 సీట్లు గెలిస్తే కేసీఆరే మళ్లీ తెలంగాణ సీఎం
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్10-11 లోక్సభ స్థానాలు గెలిస్తే తెలంగాణలో మళ్లీ ఏడాదిలోపే బీఆర్ఎస్ అధినేత కేసీఆరే సీఎం అవుతారని షాకింగ్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.