HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Elections With Parliament

Telangana Elections: పార్లమెంట్ తో తెలంగాణ ఎన్నికలు?

పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఢిల్లీ వర్గాల్లోని లేటెస్ట్ టాక్. ఆ విషయాన్ని బీజేపీ రాయలసీమ సీనియర్ లీడర్ టీ జీ వెంకటేష్ చెప్పడం హాట్ టాపిక్ అయింది.

  • Author : CS Rao Date : 05-04-2023 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Election
Telangana Elections With Parliament..

Telangana Elections : పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఢిల్లీ వర్గాల్లోని లేటెస్ట్ టాక్. ఆ విషయాన్ని బీజేపీ రాయలసీమ సీనియర్ లీడర్ టీ జీ వెంకటేష్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. సాధారణ ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) కేవలం ఐదు నెలలు మాత్రమే గాప్ ఉంది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలు దృష్ట్యా లోక్ సభ ఎన్నికలతో తెలంగాణ, ఏపీ ఎన్నికలను పెట్టేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

ఢిల్లీ బీజేపీ ఇప్పటికే జమిలీ ఎన్నికల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాల పై కసరత్తు ఇంకా చేస్తూనే ఉంది. పలు సందర్భాల్లో జమిలీ గురించి మోడీ ప్రస్తావించిన అంశం తెలిసిందే.

బలమైన పోటీదారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్ ,కేజ్రీవాల్ లాంటి వారిని ఒంటరిగా వెళితే ఎదుర్కోలేమని, సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. బీజేపీకి అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకటే ఓటు పడడం ఖాయమని ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న విశ్వాసం బీజేపీకి ఉంది.

అందుకే ఈసారి డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికల (Telangana Elections) కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కదిద్దాక మేలో సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎలక్షన్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తుంది. అలా అయితే కేసీఆర్ ను దెబ్బకొట్టడంతోపాటు బీజేపీకి అధికారం రాష్ట్రంలో దక్కుతుందని అంచనా వేస్తోంది.

Also Read:  Limca Book of Records: “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

2024లో మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ను జరపాలని కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ రాష్ట్రాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే నెలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాయి. పార్లమెంట్ తోపాటు తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరిగితే కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతాడని.. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించవచ్చన్న ప్లాన్ ను బీజేపీ చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నిస్తే అందరూ చెప్పే సమాధానం ‘డిసెంబర్’. కానీ ఈసారి కేంద్రంలోని బీజేపీ పెద్ద ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలంటే.. రాష్ట్రం దాటకుండా జాతీయ రాజకీయాల్లోకి రానీయకూడదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకూడదంటూ బీజేపీ ప్లాన్ చేసిందట. గత ఎన్నికల సమయానికి మోడీ తో సఖ్యతగా కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆయన అనుకున్న విధంగా ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఈ సారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాని మోడీ , కేసీఆర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ ని రాజకీయంగా కొట్టాలని బీజేపీ వ్యూహంగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ సారి కెసిఆర్ సర్కార్ కు ఇరకాటం ఉండేలా మోడీ అండ్ టీమ్ చేస్తున్న ప్లాన్ బీ ఆర్ ఎస్ కు నిద్రలేకుండా చేస్తుందట.

Also Read:  Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • Election
  • kcr
  • parliament
  • telangana

Related News

Special Trains Sankranti 20

దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ సంక్రాంతికి ఊరెల్లే వారికి 16 అదనపు ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains :  సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త అందించింది. తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు 16 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, వికారాబాద్‌ల నుంచి శ్రీకాకుళం రోడ్డు వరకు జనవరి 9 నుంచి 19 వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయి.   సంక్రాంతికి వెళ్లేవారికి గుడ్‌న్యూస్ తెలంగాణ ఏపీ మధ్య 16 స్పెషల్ ట్ర

  • KTR

    కేటీఆర్ వెనుకబడిన ఆలోచనలతోనే బీఆర్‌ఎస్ పతనం.. కాంగ్రెస్ ఫైర్

  • Lok Sabha

    లోక్‌స‌భ‌లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!

  • Cm Stalin Counter To Amit S

    కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు CM స్టాలిన్ కౌంటర్

  • Sp Balasubrahmanyam Statue

    ఎస్పీ శైలజ హౌస్‌ అరెస్ట్, రవీంద్రభారతి లో SP బాలసుబ్రహ్మణ్యం విగ్రహావిష్కరణ!

Latest News

  • టీమిండియా మహిళా క్రికెటర్ శ్రీచరణికి రూ.2.5 కోట్ల చెక్‌ను అందజేసిన మంత్రి నారా లోకేష్

  • ANR కాలేజీకి అక్కినేని నాగార్జున 2 కోట్ల విరాళం

  • విజయ్ జన నాయకన్.. రేపే రెండో పాట విడుదల!

  • కాణిపాకం వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ సేవా టికెట్లు ఆన్‌లైన్‌లో!

  • అమెరికాలో ట్రంప్ ‘ట్రావెల్ బాన్’ ప్రకంపనలు.. మరో 7 దేశాలపై పూర్తి నిషేధం

Trending News

    • ఐపీఎల్ మినీ వేలం.. అమ్ముడుపోని ప్రముఖ ఆటగాళ్లు వీరే!

    • పాక్‌లోని అడియాలా జైలు వెలుపల ఉద్రిక్తత.. ఇమ్రాన్ ఖాన్‌ మద్దతుదారులపై కెమికల్ ప్రయోగం!

    • ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆట‌గాళ్లు వీరే!

    • మతీషా పతిరానాను రూ. 18 కోట్లకు దక్కించుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్

    • రికార్డు ధరకు అమ్ముడైన కామెరాన్ గ్రీన్.. రూ. 25.20 కోట్లకు దక్కించుకున్న కేకేఆర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd