HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Elections With Parliament

Telangana Elections: పార్లమెంట్ తో తెలంగాణ ఎన్నికలు?

పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఢిల్లీ వర్గాల్లోని లేటెస్ట్ టాక్. ఆ విషయాన్ని బీజేపీ రాయలసీమ సీనియర్ లీడర్ టీ జీ వెంకటేష్ చెప్పడం హాట్ టాపిక్ అయింది.

  • Author : CS Rao Date : 05-04-2023 - 4:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Telangana Election
Telangana Elections With Parliament..

Telangana Elections : పార్లమెంట్ ఎన్నికలతో తెలంగాణ ఎన్నికలు ఉంటాయని ఢిల్లీ వర్గాల్లోని లేటెస్ట్ టాక్. ఆ విషయాన్ని బీజేపీ రాయలసీమ సీనియర్ లీడర్ టీ జీ వెంకటేష్ చెప్పడం హాట్ టాపిక్ అయింది. సాధారణ ఎన్నికలకు, తెలంగాణ ఎన్నికలకు (Telangana Elections) కేవలం ఐదు నెలలు మాత్రమే గాప్ ఉంది. ప్రస్తుతం మారిన రాజకీయ సమీకరణాలు దృష్ట్యా లోక్ సభ ఎన్నికలతో తెలంగాణ, ఏపీ ఎన్నికలను పెట్టేలా ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది.

ఢిల్లీ బీజేపీ ఇప్పటికే జమిలీ ఎన్నికల కోసం విశ్వప్రయత్నాలు చేస్తోంది. పార్లమెంట్ లో ప్రత్యేక చట్టం చేసి దేశంలో అన్ని రాష్ట్రాల అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడానికి ప్లాన్ చేస్తున్నాయి. సాధ్యాసాధ్యాల పై కసరత్తు ఇంకా చేస్తూనే ఉంది. పలు సందర్భాల్లో జమిలీ గురించి మోడీ ప్రస్తావించిన అంశం తెలిసిందే.

బలమైన పోటీదారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్ ,కేజ్రీవాల్ లాంటి వారిని ఒంటరిగా వెళితే ఎదుర్కోలేమని, సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోందని సమాచారం. బీజేపీకి అసెంబ్లీకి పార్లమెంట్ కు ఒకటే ఓటు పడడం ఖాయమని ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న విశ్వాసం బీజేపీకి ఉంది.

అందుకే ఈసారి డిసెంబర్ లో తెలంగాణ ఎన్నికల (Telangana Elections) కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించి తెలంగాణలో పరిస్థితులన్నీ చక్కదిద్దాక మేలో సార్వత్రిక ఎన్నికలతో కలిపి ఎలక్షన్ నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేస్తోందని తెలుస్తుంది. అలా అయితే కేసీఆర్ ను దెబ్బకొట్టడంతోపాటు బీజేపీకి అధికారం రాష్ట్రంలో దక్కుతుందని అంచనా వేస్తోంది.

Also Read:  Limca Book of Records: “లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్” లో “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”

2024లో మేలో జరిగే సార్వత్రిక ఎన్నికలతోపాటే తెలంగాణ సహా 5 రాష్ట్రాల ఎన్నికల ను జరపాలని కేంద్రంలోని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం ఈ రాష్ట్రాల కాలపరిమితి ముగియగానే రాష్ట్రపతి పాలన విధించి మే నెలకు పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నాయి. పార్లమెంట్ తోపాటు తెలంగాణ ఎన్నికలు (Telangana Elections) జరిగితే కేసీఆర్ రాష్ట్రానికే పరిమితం అవుతాడని.. ఆయనను జాతీయ రాజకీయాల్లోకి రాకుండా నిరోధించవచ్చన్న ప్లాన్ ను బీజేపీ చేస్తున్నట్టు సమాచారం.

తెలంగాణ ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయని ప్రశ్నిస్తే అందరూ చెప్పే సమాధానం ‘డిసెంబర్’. కానీ ఈసారి కేంద్రంలోని బీజేపీ పెద్ద ప్లాన్ చేస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ను తెలంగాణకే పరిమితం చేయాలంటే.. రాష్ట్రం దాటకుండా జాతీయ రాజకీయాల్లోకి రానీయకూడదంటే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం జరపకూడదంటూ బీజేపీ ప్లాన్ చేసిందట. గత ఎన్నికల సమయానికి మోడీ తో సఖ్యతగా కేసీఆర్ ఉన్నారు. అందుకే ఆయన అనుకున్న విధంగా ముందస్తు ఎన్నికలు జరిగాయి. ఈ సారి పరిస్థితి పూర్తి భిన్నంగా ఉంది. ప్రధాని మోడీ , కేసీఆర్ మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గు మంటుంది. పైగా జగన్మోహన్ రెడ్డి ద్వారా కేసీఆర్ ని రాజకీయంగా కొట్టాలని బీజేపీ వ్యూహంగా ఉందని తెలుస్తుంది. మొత్తం మీద ఈ సారి కెసిఆర్ సర్కార్ కు ఇరకాటం ఉండేలా మోడీ అండ్ టీమ్ చేస్తున్న ప్లాన్ బీ ఆర్ ఎస్ కు నిద్రలేకుండా చేస్తుందట.

Also Read:  Revanth Reddy Secret Survey: గెలుపు అభ్యర్థులు పై పీసీసీ చీఫ్​ రేవంత్​ సర్వే.!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bjp
  • brs
  • Election
  • kcr
  • parliament
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Prashant Kishor To Contest

    Prashant Kishor : బీహార్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలు .. బీజేపీ కంచుకోట నుంచి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్

Latest News

  • US – Iran War: ట్రంప్ హెచ్చరించిన తర్వాత, చాబహార్ ఓడరేవుపై దాడి

  • Heavy rains: వర్షం ఎఫెక్ట్‌.. రోడ్లు నదులుగా మారాయి

  • Jobs: తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఆర్టీసీ కండక్టర్ పోస్టులకు గ్రీన్ సిగ్నల్

  • Gold Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్..ఒక్కసారిగా పడిపోయిన బంగారం ధరలు

  • LPG gas cylinder: భారీ వర్షాలకు కొట్టుకొస్తున్న 3,000 ఎల్‌పీజీ గ్యాస్ సిలిండర్లు

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd