CM KCR: ఢిల్లీ మే సవాల్.. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ కొత్త స్కెచ్
- By HashtagU Desk Published Date - 09:20 AM, Mon - 21 March 22
తెలంగాణలో మళ్లీ ధాన్యం రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే బీజేపీని ఇరుకున పెట్టడానికి కేసీఆర్ కొత్త కొత్త వ్యూహాలతో ముందుకు వెళుతూనే ఉన్నారు. దీనికి ప్రశాంత్ కిషోర్ స్కెచ్ లు తోడవ్వడంతో టీఆర్ఎస్ రాజకీయంగా ఓ అడుగు ముందే ఉంది. అయితే ఢిల్లీ లేకపోతే గల్లీ.. అలా బీజేపీ పోరుకు మళ్లీ మళ్లీ కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. అందుకే ఇప్పుడు మళ్లీ ఢిల్లీలో పంచాయతీ పెట్టారు.
ఫామ్ హౌస్ లోనే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో మీటింగ్ పెట్టిన కేసీఆర్… టీఆర్ఎస్ రాజకీయ పోరాటం ఎలా ఉండబోతోందో వారికి క్లారిటీ ఇచ్చినట్టుగా తెలిసింది. దీనికి తోడు టీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో.. కమలనాథులపై స్టాండ్ ఏమిటో పార్టీ పరంగా కూడా క్లారిటీ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ మీటింగ్ కు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర కార్యవర్గం, జిల్లా స్థాయిలో ఉన్న నేతలు.. ఇలా అందరినీ ఆహ్వానించారు.
ఇప్పుడు ధాన్యం కొనుగోళ్లలో కేంద్రాన్ని టార్గెట్ చేసేలా టీఆర్ఎస్ వ్యూహాన్ని తయారుచేసింది. నిజంగా ఇది మామూలుగా లేదు. కార్యకర్త నుంచి కేసీఆర్ వరకు అందరూ ఇందులో భాగస్వాములు అయ్యేలా ఆ స్కెచ్ ఉంది. వర్షాకాలానికి సంబంధించి 5.5 లక్షల టన్నుల ధాన్యం నిల్వ ఇంకా అలాగే ఉంది. ఇప్పుడు యాసంగిలో కోతకొచ్చిన 50 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోళ్లపై సందిగ్దం నెలకొంది. ఓ పదిరోజుల్లోపే ఆ ధాన్యమంతా చేతికొస్తుంది.
ఓ పది రోజుల్లో తెలంగాణ అంతా ధాన్యాగారంగా కనిపిస్తుంది. అదంతా అమ్ముడుపోకపోతే రైతులకు సమస్యలు తప్పవు. అది రాజకీయంగా టీఆర్ఎస్ ను ఇరకాటంలో పెడుతుంది. అందుకే ఆరునూరైనా సరే.. కేంద్రంతో ఆ ధాన్యాన్ని కొనిపించాలన్నది కేసీఆర్ ప్లాన్. కిందటిసారి ఢిల్లీకి వెళితే పీఎంతో పాటు కేంద్ర మంత్రులను కలవలేకపోయారు. అందుకే ఈసారి ముందే అపాయింట్ మెంట్ ను తీసుకోవాలనుకుంటున్నారు.
ముచ్చింతల్ లో సమతామూర్తి విగ్రహావిష్కరణకు ప్రధాని వచ్చినా.. అనారోగ్య సమస్యతో కేసీఆర్ ఆయనను కలవలేకపోయారు. మరిప్పుడు వారి భేటీ ఎలాంటి ఫలితన్నిస్తుందో చూడాలి. అటు పార్లమెంట్ లో కూడా ధాన్యం కొనుగోళ్ల అంశంపై పోరాడాలని ఎంపీలకు కేసీఆర్ ఇప్పటికే దిశానిర్దేశం చేశారు.
Related News
Lok Sabha Poll : తెలంగాణ లో పోలింగ్ సమయం పొడిగింపు
ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ పోలింగ్ సమయాన్ని పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది