CM KCR: అఖిలేష్ యాదవ్తో కేసీఆర్ భేటీ!
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు.
- By Balu J Published Date - 04:37 PM, Sat - 21 May 22
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు. ఇద్దరూ ప్రస్తుత జాతీయ సమస్యలపై చర్చించారు. జాతీయ స్థాయి రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇండియా పర్యటనలో ఉన్నారు. ఆయన ఢిల్లీలో వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఆర్థిక నిపుణులతో సమావేశమై దేశ ఆర్థిక పరిస్థితులపై చర్చించనున్నారు. జర్నలిస్టులతోనూ సమావేశం కానున్నారు. కేసీఆర్ పాన్-ఇండియా టూర్లో భాగంగా చండీగఢ్ కు వెళ్లనున్నారు. అక్కడ ఆయన రైతుల కుటుంబాలకు చెక్కులను పంపిణీ చేయడానికి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్లను కలవనున్నారు. మరికొద్ది రోజుల్లో ఆయన కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బీహార్లో పర్యటించనున్నారు.
Former Uttar Pradesh Chief Minister Sri @YadavAkhilesh met Chief Minister Sri K. Chandrashekar Rao at his residence in New Delhi. The two leaders discussed current national issues. pic.twitter.com/eVKRymyFiE
— Telangana CMO (@TelanganaCMO) May 21, 2022
Related News
Arvind Kejriwal: రేపు బీజేపీ ఆఫీస్ కు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలతో కలిసి మే 19 ఆదివారం మధ్యాహ్నం బీజేపీ ప్రధాన కార్యాలయానికి పాదయాత్ర చేస్తానని, అయితే మోడీ కోరుకున్న వారిని అరెస్టు చేసుకోవాలని సవాల్ విసిరారు.