Praja Sangrama Yatra 3rd Phase: రేపే బండి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ షురూ!
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మంగళవారం మూడో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ (వాకథాన్)ను ప్రారంభించనున్నారు.
- Author : Balu J
Date : 01-08-2022 - 5:13 IST
Published By : Hashtagu Telugu Desk
భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ మంగళవారం మూడో దశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ (వాకథాన్)ను ప్రారంభించనున్నారు. సోమవారం కరీంనగర్ లోని చైతన్యపురి శ్రీ మహాశక్తి ఆలయంలో ఎంపీపీ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. సంజయ్ మూడో విడత పాదయాత్ర ఆగస్టు 2న యాదగిరిగుట్ట నుంచి ప్రారంభమై ఆగస్టు 26న హన్మకొండ భద్రకాళి అమ్మవారి ఆలయం వద్ద ముగుస్తుంది. 125 గ్రామాల మీదుగా 325 కిలోమీటర్ల మేర 24 రోజుల పాటు కొనసాగనుంది. ఆలేరు, భువనగిరి, మునుగోడు, నకిరేకల్, తుంగతుర్తి, జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘన్పూర్, వర్ధన్నపేట, పరకాల, వరంగల్ పశ్చిమ, వరంగల్ తూర్పు నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర సాగనుంది.
బండి సంజయ్ గత ఏడాది ఆగస్టు 28న హైదరాబాద్ చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ‘ప్రజా సంగ్రామ యాత్ర’ తొలి విడతను ప్రారంభించి హుస్నాబాద్లో ముగించారు. 8 జిల్లాలు, 19 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో 438 కిలోమీటర్ల మేర 36 రోజుల పాటు సాగింది. రెండో దశను గద్వాల్ జిల్లా అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభించారు. 31 రోజుల పాటు పాదయాత్ర కొనసాగించేలా ప్రణాళిక రూపొందించారు. రెండో విడత పాదయాత్ర ముగిసిన తర్వాత హైదరాబాద్ శివారులోని తుక్కుగూడలో జరిగిన పార్టీ బహిరంగ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు.
రేపటి నుండి ప్రారంభం కానున్న మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర సందర్భంగా కరినగరంలోని చైతన్యపురి శ్రీ మహాశక్తి దేవాలయంలో అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.#PrajaSangramaYatra3 pic.twitter.com/q86b69ntvB
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) August 1, 2022