Kavith-KCR: కేసీఆర్ టార్గెట్గా.. కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు
- Author : Vamsi Chowdary Korata
Date : 15-05-2026 - 3:43 IST
Published By : Hashtagu Telugu Desk
kalvakuntla kavitha ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ చాలా గొప్ప వ్యక్తి అని, అందులో ఎవరికీ అనుమానాలు లేవని తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కానీ ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు క్రమంగా దూరమయ్యారని అన్నారు. ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ, పరిపాలన కాలంలో కేసీఆర్ ఒక యంత్రంలా మాత్రమే పనిచేశారని అన్నారు. అందువల్లే ఆయనకు ప్రజల భావోద్వేగాలు అర్థం కాలేదని విమర్శించారు.
బీఆర్ఎస్ పార్టీ అధినేతగా ఆయన ఎంతో కఠినంగా ఉండేవారని అన్నారు. కన్నబిడ్డగా సమస్యలు చెప్పుకునే అవకాశం తనకే ఇవ్వలేదని గుర్తు చేసుకున్నారు. కుటుంబ సభ్యులకే అందుబాటులో లేని వ్యక్తి, ఇక సామాన్య ప్రజల కష్టాలను ఎలా వింటారని ప్రశ్నించారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడి నుంచి ఒక యంత్రం లాంటి ముఖ్యమంత్రిగా మారిన తీరే ప్రస్తుత రాజకీయ పరిణామాలకు కారణమని అన్నారు.