T Congress Campaign : ప్రజలను ఆకట్టుకున్న కాంగ్రెస్ ప్రచారం.. “మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి..”
‘మార్పు కావాలి – కాంగ్రెస్ (COngress) రావాలి’ అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తుంది. ఈ వీడియో లో BRS అధినేత, CM KCR అమలు చేయని హామీలను హైలైట్ చేసారు.
- By Sudheer Published Date - 12:55 PM, Wed - 8 November 23
Telangana Congress Campaign : అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు (Political Parties) ఎక్కడ తగ్గేదెలా అంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బిఆర్ఎస్ (BRS) – కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య ప్రచార జోరు తారాస్థాయికి చేరుతుంది. ఇంటింటికి తిరుగుతూ తమ మేనిఫెస్టో లను తెలియజేస్తూ ఓట్లర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. సభలు , సమావేశాలు , బస్సు యాత్రలే కాదు సోషల్ మీడియా (Social Media) ను సైతం గట్టిగా వాడుకుంటున్నారు. ఎవరికీ వారు ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ టాలెంట్ ను బయటకు తీస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
బిఆర్ఎస్ పార్టీ యూట్యూబ్ లో ప్రచారం చేస్తా ఉంటె.. కాంగ్రెస్ (Congress) టీవీ లలో ప్రచారం చేస్తూ పల్లె ప్రజలకు , మాస్ జనాలకు దగ్గర అవుతుంది. ‘మార్పు కావాలి – కాంగ్రెస్ రావాలి’ అనే ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తుంది. ఈ వీడియో లో బిఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అమలు చేయని హామీలను వీడియోలో హైలైట్ చేసారు.
ఎన్నికల ప్రచారంలో కేసీఆర్ను పోలిన వ్యక్తి కారులో వచ్చి ఓటు అభ్యర్థిస్తే.. వివిధ వర్గాల వారు అంశాల వారీగా ఆయన్ను నిలదీసినట్లు.. చివరికి కారు పంక్చరైనట్లు వీడియో రూపొందించి ప్రచారం మొదలుపెట్టారు. ‘పదేండ్ల అహంకారం పోవాలంటే.. పదేండ్ల అవినీతిని తరమాలంటే.. మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అని పేర్కొంది.
Also Read: Rahul Gandhi – Varun Gandhi : వరుణ్ గాంధీతో రాహుల్ గాంధీ భేటీ.. అందుకేనా ?
మరో ప్రచారంలో కేసీఆర్ పోయిన వ్యక్తి ప్రచారానికి వచ్చినప్పుడు, TSPSC పేపర్ లీకేజీ, యువత మరియు యువతకు నిరుద్యోగ భృతి, ధరణి పోర్టల్ ద్వారా జరిగిన అక్రమాలు, 2BHK ఇళ్ల పంపిణీలో వైఫల్యం మరియు కాళేశ్వరం స్కామ్ గురించి యువకులు, మహిళలు మరియు రైతులు అతనిని ప్రశ్నించారు. ఓటర్లు ఇకపై బీఆర్ఎస్ నాయకుల అబద్ధాలను నమ్మరని, ఈసారి బీఆర్ఎస్ పార్టీ గుర్తు కారును పంక్చర్ చేస్తారని వీడియో లో చూపించారు. ఇలా కాంగ్రెస్ రూపొందించిన వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి.
ప్రజలారా నమస్తే…. బీఆర్ఎస్ కు ఓటేస్తే..
😡 8 వేల రైతుల సావుకు కారణం అయిండు.
👉 రుణమాఫీ మోసం చేసిండు
👉 ధరణీ పేరుతో భూములు లాక్కున్నారు.
👉 ఉచిత ఎరువులు అని రైతుల ఉరికొయ్యలు ఎక్కించిండు."పదేండ్ల అహంకారం పోవాలంటే,
పదేండ్ల అవినీతిని తరమాలంటే""మార్పు కావాలి – కాంగ్రెస్… pic.twitter.com/rjOnMiftZv
— Telangana Congress (@INCTelangana) November 8, 2023
ప్రజలారా నమస్తే…. బీఆర్ఎస్ కు ఓటేస్తే..
👉 పేపర్లు లీక్ చేసిండు
👉 నిరుద్యోగ భృతి అని నిండా ముంచిండు
👉 ధరణీ పేరుతో భూములు లాక్కున్నారు.
👉 రుణమాఫీ, ఉచిత ఎరువులు అని రైతుల నోట్లో మన్ను కొట్టిండు.
👉 డబుల్ బెడ్ రూంలు కట్టియ్యలేదు.
👉 కాళేశ్వరం పేరుతో కోట్లు దోచుకున్నరు.— Telangana Congress (@INCTelangana) November 7, 2023
KCR and his lies stand exposed!
People of Telangana are marching towards a CHANGE!
Congress will fulfill the dreams of Telangana by implementing our 6 Guarantees in 100 days of forming the government!#MaarpuKavaliCongressRavali#ByeByeKCR#BrsBjpMimDosti pic.twitter.com/zZSCubeTOd
— (Hon) Mohammed Azharuddin (@azharflicks) November 7, 2023
Read Also : Pawan Kalyan : బీసీ ఆత్మ గౌరవ సభలో పవన్.. బిజెపి నేతలను నిరాశ పరిచాడా..?
Tags
Related News
TS : విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిన కాంగ్రెస్ ప్రభుత్వంః హారిశ్ రావు
Electrical System: సిద్దిపేట ఎమ్మెల్యే హారీశ్ రావు(Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పై మరోసారి విమర్శలు గుప్పించారు. ఐదు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ వ్యవస్థను కుప్పకూల్చిందని ఆయన అన్నారు. కరెంట్ కోతల విషయంలో వైఫల్యాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అంగీకరించలేదన్నారు. ప్రతిపక్షాలు, విద్యుత్ ఉద్యోగులపై అభాండాలు మోపడాన్ని తాను ఖండిస్తున్నానన్నారు. We’re now on Whats